By: ABP Desam | Updated at : 28 Nov 2021 08:11 AM (IST)
పోచారం శ్రీనివాస రెడ్డి (Photo Credit: Twitter)
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. శనివారం ఆయన ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నవంబర్ 24 న ఆయనకు నిర్వహించిన టెస్టుల్లో కోవిడ్ పాజిటివ్ రావడంతో స్పీకర్ పోచారం ముందస్తు జాగ్రత్తగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో హస్పిటల్ నుండి డాక్టర్లు ఆయనను డిశ్చార్జి చేశారు. అయితే ఇంటికి వెళ్లిన తరువాత కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ కోవిడ్19 నిబంధనలు పాటించాలని స్పీకర్కు వైద్యులు సూచించారని తెలుస్తోంది.
ఇటీవల మనవరాలి వివాహం..
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం వారం రోజుల కిందట జరిగింది. ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో వీఎన్ఆర్ ఫామ్స్లో పోచారం మనవరాలి వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. మనవరాలి వివాహం అనంతరం జ్వరం, కరోనా లక్షణాలు కనిపంచడంతో కరోనా టెస్టులకు వెళ్లారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. కొవిడ్ 19 నిర్ధారణ టెస్టుల్లో పాజిటివ్ అని తేలడంతో ముందు జాగ్రత్తగా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతో వైద్యులు పోచారంను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిపోయిన స్పీకర్ హోం క్వారంటైన్లో ఉన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Also Read: YS Sharmila: సీఎం కేసీఆర్ ఓ హంతకుడు..! వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు, కవిత టార్గెట్గా ట్వీట్
ఎటువంటి సమస్యలు లేకపోవడంతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంతో ఈరోజు హస్పిటల్ నుండి డిశ్చార్జి చేసిన డాక్టర్లు..
— Pocharam Srinivas Reddy (@PSRTRS) November 27, 2021
మరికొన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండనున్న సభాపతి పోచారం గారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా అని తేలగానే ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోచారానికి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఇద్దరు సీఎంలు కరోనా నుంచి తప్పించుకున్నారు. అయితే తాజాగా ఓమిక్రాన్ అని కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి పలు దేశాలకు వ్యాప్తి అవుతున్న ఈ కరోనా వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైనదిగా గుర్తించారు. డబ్ల్యూహెచ్వో సైతం ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !
TSPSC Group 4 Results: టీఎస్పీఎస్సీ 'గ్రూప్-4' ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పటిలోపంటే?
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Telangana New CM: సాయంత్రం తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం- చాలా సింపుల్గా కార్యక్రమం!
First Time MLAs In Telangana: ఈ ఎమ్మెల్యేలు స్పెషల్ వేరే లెవల్- ఒకరిద్దరు కాదు ఏకంగా 50 మంది
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
/body>