By: ABP Desam | Updated at : 10 Jan 2022 03:45 PM (IST)
విపక్షనాయకులను అరెస్టు చేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయురాలి ఆత్మహత్యపై దుమారం రేగుతోంది. ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆమె కుటుంబాన్ని పరామర్శిస్తున్నాయి. ఈ ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీనిపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాల్కొండ నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ టీచర్ సరస్వతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నాయకులను అరెస్టులు చేయడాన్ని తప్పుపట్టారు.
నిజామాబాద్ జిల్లా బీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ బేతల సరస్వతి కుటుంబాన్నిపరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకుడు మాజీ ప్రభుత్వ విప్ అనిల్, జీవన్ రెడ్డిని కమ్మరిపల్లి వద్ద అరెస్ట్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ నేతల అక్రమ అరెస్ట్లకు నిరసనగా కమ్మరిపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిoచారు పార్టీ నాయకులు.
కాంగ్రెస్ నేతలనే కాదు బిజెపి లీడర్లను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. పోలీసుల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. సరస్వతి అంతక్రియల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్యెల్యే యెండల లక్ష్మినారాయణ పాల్గొన్నారు. సరస్వతిది ప్రభుత్వ హత్యేనంటూ ఆరోపిస్తున్నారు విపక్ష నాయకులు.
317 జీవోను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతికరేకిస్తున్నారు. 317 జీవో అసంబద్దంగా తీసుకోచ్చారని ఆరోపించారు. 317 జీవో రెసిడెన్షియల్ ఆర్డర్ కి వ్యతిరేకంగా ఉందని అన్నారు. సీనియర్ టీచర్లు చాలా మంది స్థానికతను కోల్పోతున్నారని అన్నారు. కొత్తగా వచ్చిన టీచర్లకు సైతం బలవంతంగా వేరే ప్రాంతాలకు పంపించి అక్కడే శాశ్వతంగా పనిచేయాలనటం బాధాకరమంటున్నారు. ఈ సమస్యను మానవతా దృక్ఫధంతో పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ను కోరారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. బలవంతంగా మమ్మల్ని ట్రాన్ ఫర్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఇప్పటి వరకు 9 మంది టీచర్లు చనిపోవటం బాధాకరమని అంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు.
Also Read: మరికొన్ని గంటల్లో నిశ్చితార్థం ఇంతలో సూసైడ్... ఖమ్మం లాడ్జ్ లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Also Read: మా చావుకు కారణం ఆ నలుగురే.. అస్సలు వదలొద్దు.. నిజామాబాద్ ఫ్యామిలీ సెల్ఫీ వీడియో వెలుగులోకి..
Also Read: కాలు విరిగినట్టు తెగ బిల్డప్.. పిలిచి ఆరా తీస్తే అసలు గుట్టు బయటికి..
Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?
Also Read: ఏపీలో నైట్ కర్ఫ్యూ... థియేటర్లలో 50 శాతం సిట్టింగ్... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
Nizamabad News : నిజామాబాద్ జీజీహెచ్ లో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి, వాష్ రూమ్ లో స్పృహ లేని స్థితిలో
Nizamabad Crime : పెద్ద పోచమ్మ ముక్కు పుడక చోరీ, పట్టించిన మూడో కన్ను
Nizamabad News: నిజామాబాద్ జిల్లాలో హీటెక్కుతున్న రాజకీయాలు- తగ్గేదేలే అంటూ ఢీ కొంటున్న బీజేపీ, టీఆర్ఎస్
PM Modi On Kamareddy Road Accident: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటన
Acid Mixing in Liquor: మందులో నీళ్లకు బదులు యాసిడ్ మిక్సింగ్! మత్తులోనే తాగేసిన వ్యక్తి
Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయమ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
AP IPS Transfers : ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు - సుప్రీంకోర్టు చెప్పినా ఏబీవీకి మాత్రం నో పోస్టింగ్ !
Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్ డీల్కు మస్కా కొట్టాడుగా!
Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!