అన్వేషించండి

Nizamabad News: నిజామాబాద్‌ మేలుకోని అధికార యంత్రాంగం-వరి రైతుల్లో టెన్షన్

నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నా... పూర్తిస్థాయిలో సన్నద్దత అధికార యంత్రాంగంలో కనిపించడం లేదు.

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయ్. వరి కోతల్లో రైతులు బిజీగా ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ముందే కోతలు పూర్తి చేసిన వరి రైతులు...ధాన్యం అమ్మటానికి ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాక అవస్థలు పడుతున్నారు. తక్కువ రేటుకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది ఆందోళన చెందుతున్నారు. 

పూర్తి స్థాయిలో రైస్ మిల్లుల అలాంట్మెంట్ కాలేదని తెలుస్తోంది. ధాన్యం సేకరణలో కీలకపాత్ర పోషించాల్సిన పౌర సరఫరాల సంస్థకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడం సమస్యగా మారుతోంది. ఇటీవల డీఎస్వోగా బదిలీపై వచ్చిన అధికారికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయినా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ధాన్యం సేకరణ సమయం ముంచుకొస్తున్నా రైస్ మిల్లుల అలాట్మెంట్, గన్నీ బ్యాగుల సరఫరా, ట్రాన్స్‌పోర్ట్‌ టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదని తెలుస్తోంది. తద్వారా ధాన్యం సేకరణకు జాప్యం జరిగుతోంది.

జిల్లాలో ధాన్యం సేకరణకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సొసైటీ ఛైర్మన్లు కూడా భావిస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ప్రక్రియ సజావుగా సాగాలంటే అదనపు కలెక్టర్ సహా డీఎస్పీ, డీఎం, డీసీవో, ఇతర అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. ధాన్యం రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూరల్ నియోజకవర్గంలో కొన్ని మండలాలకు టెండర్‌కు లారీల యజమానులు ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. గత్యంతరం లేక ఓ సంస్థకు రవాణా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఇవేగాక ధాన్యం సేకరణలో కడ్తా, నగదు జమ, తదితర సమస్యలు ప్రతి సీజన్లో ఉత్పన్నమవుతాయి.

పౌరసరఫరాల శాఖ అధికారులు 10 లక్షల గన్నీ బ్యాగులు సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 477 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1.20 కోట్ల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని. కమిషనర్ ఆదేశాల మేరకే ట్రాన్స్పోర్ట్ ప్రక్రియ పూర్తిచేయడం జరిగిందని చెబుతున్నారు. 305 రైస్ మిల్లులకుగాను కేవలం 142 మిల్లులకే అలాట్మెంట్ ఇచ్చారు. 

ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి ఉంది. కోతలు అయిన వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా జరగటంతో వర్షానికి రైతులు భారీగా ధాన్యం నష్టపోయారు. ఈసారి అలా కాకుండా వరి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోళు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Uttam Kumar Reddy: తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
GoldJewelry: బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
Embed widget