అన్వేషించండి

Nizamabad News: శ్రీరాం సాగర్ వద్ద కొత్త టూరిజం స్పాట్- ఆకట్టుకోనున్న బోటింగ్, రోప్‌వే

శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియా టూరిజం స్పాట్ చేసేందుకు ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి సమీక్షించారు. ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాటర్ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం నడుంబిగిస్తోంది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు ఈ దిశగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఇప్పటికే సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. టూరిజం అభివృద్ధి సంస్థతోపాటు, అటవీ అభివృద్ధి సంస్థ కూడా ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో టూరిజం స్పాట్ ఏర్పాటుకు ఆసక్తితో ఉన్నందున దీనికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి మొదలుకొని బినోల వరకు గల బ్యాక్ వాటర్ ఏరియా పరీవాహక ప్రాంతం గుండా అప్రోచ్ రోడ్డు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వద్ద బ్యాక్ వాటర్ ఏరియాలో నీరు నిలిచి ఉండే ప్రాంతాన్ని మినహాయిస్తూ కనీసం 33 అడుగుల మేర రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇది వరకే పరీవాహక ప్రాంతం అంతటా భూ సేకరణ చేసి ఉన్నందున రోడ్డు నిర్మాణానికి స్థల సమస్య అంతగా ఉత్పన్నం కాదని కలెక్టర్ పేర్కొన్నారు. కేవలం రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మాత్రమే సేకరించడం జరుగుతుందన్నారు. అది కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులను సంప్రదించి వారి సహకారంతో రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలన్నారు. రోడ్డు నిర్మాణం జరిగితే పరిసర ప్రాంతాల వ్యవసాయ భూముల విలువ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున రైతులు కూడా తోడ్పాటును అందిస్తారని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వ యంతో ముందుకెళ్లాలని సూచించారు.

మరోవైపు ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ఐలాండ్ ఉంది. ప్రాజెక్టు కట్ట నుంచి ఐలాండ్ వరకు రోప్‌వే ఏర్పాటు చేసి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ 2017లో ఎస్సారెస్పీని సందర్శించిన సమయంలో తెలిపారు. ఆ దిశగా అధికారులు ఇంకా చర్యలు చేపట్టలేదు. అందుకు తగిన ప్లానింగ్‌పై ఇటు పర్యాటక శాఖ అటు నీటి పారుదల శాఖ అధికారులు సైతం ప్రాజెక్టును సందర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మధ్యలో ఉన్న ఐలాండ్‌ను టూరిస్ట్ స్పాట్‌గా చేస్తే పర్యాటకులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రోప్‌వే ద్వారా ఐలాండ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అధికారులు పరిశీలంచారు. కానీ ఆ పనులు ఇంకా మొదలు కాలేదు. 

ఎస్సారెస్పీ నుంచి బాసర సరస్వతి అమ్మవారి పుష్కర ఘాట్‌ల వరకు బోటింగ్‌ను నడపాలన్న ప్రతిపాదనలు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి బాసర వరకు బోటింగ్ ఏర్పాటు చేస్తే... పర్యాటకులకు ఆహ్లాదంతోపాటు ఆదిలాబాద్ నుంచి వచ్చే భక్తులకు దూరభారం కూడా తగ్గుతుంది. ఇక్కడి ప్రజలకు బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే నీటి పారుదల శాఖ, టూరిజం అధికారులు బోటింగ్ స్పాట్‌ల నుంచి ట్రయల్ రన్ కూడా చేశారు. అయితే పనులు మాత్రం మొదలు పెట్టలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరుగుతుంది. జిల్లాలో పర్యాటక ప్రదేశాలు తక్కువ. జిల్లా వాసులు అహ్లాదం కోసం ఎక్కడికో వెళ్లాల్సి వస్తోంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget