అన్వేషించండి

Nizamabad News: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎప్పటికీ రాణించలేరు: ధర్మపురి అరవింద్

బీఆర్ఎస్ పార్టీ కేవలం పేరు మార్పు కోసమేనని... దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఎప్పటికీ రాణించలేన్నారు నిజామాబాద్‌ ఎంపీ. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోరు ఉందని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఎప్పటికీ రాణించలేరని అభిప్రాయపడ్డారు నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో జరిపిన చిట్ చాట్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కేవలం పేరు మార్పు కోసమే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజున కేటీఆర్‌ను పిలిచిన కేసీఆర్.. ఎమ్మెల్సీ కవితను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు ఎంపీ అరవింద్. ఇందూరుకు సంబందించిన రాజకీయ నాయకురాలిని పిలవలేదన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావ్ కూడా లేరు అని గుర్తు చేశారు. ఎందుకు పిలవలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కవితను బీఆర్‌ఎస్‌లో యాక్టివ్‌గా ఉంచాలని నిజామాబాద్ జిల్లా వాసిగా తన కోరికగా వివరించారు.  దసరా నాడు చెడు మీద మంచి విజయం అని ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కవిత ఆ రోజు నుంచి గాయబ్  అయ్యారని ఆరోపించారు ఎంపీ అరవింద్.
 
బీఆర్‌ఎస్‌లో భారత మ్యాప్ వేసి పాక్ ఆక్రమిత కాశ్మీరును లేపేశారని ఆరోపించారు ఎంపీ అరవింద్. బీఆర్ఎస్ పార్టీ రిజిస్టర్ కాలేదని... కేసీఆర్ బతికున్నంత వరకు నేషనల్ పార్టీ కాదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పట్టించుకోకుండా... బీఆర్ఎస్ పార్టీ పెట్టారని అన్నారు అరవింద్. లిక్కర్ స్కాంలో ఓ మహిళా నేత కూడా ఉన్నారని  వార్తల్లో చూశామని వివరించారు. త్వరలోనే అ మహిళా నేతను కూడా అరెస్టు చేస్తారని అన్నారు.
 
ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంలో ఉన్నారని ఆరోపణలేనా లేక ఆధారలున్నాయా అని ఏబీపీ దేశం అడిగిన ప్రశ్నకు ఆధారాలుంటేనే కదా అరెస్టులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు ఎంపీ అరవింద్. అభిషేక్ రావు వాగ్మూలం మేరకు మరి కొంత మందికి నోటీసులు జారీ అవుతున్నాయని అన్నారు.
 
నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డా 
 
నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ సభ్యుల అరెస్టులు కొనసాగుతున్నాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పార్లమెంట్‌లో సైతం తన గళం వినిపించాని వీడియో పుటేజీని మీడియా ముఖంగా చూపించారు అరవింద్. పీఎఫ్ఐ వ్యవహారంలో టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు అరవింద్. ఎన్‌ఐఏ ద్వారా దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే అమిత్ షాకు, డిజిపి మహేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశానని చెప్పారు ఎంపీ అరవింద్. పీఎఫ్ఐకి సంబంధించి దేశవ్యాప్తంగా అరెస్టులు జరిగాయన్నారు. ఏడాదిన్నర క్రితం బోధన్ లో దొంగ పాస్ పోర్ట్ ల జారీ వ్యవహారం బయటపడిందన్నారు. ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ పీఎఫ్ఐ రెక్కీ నిర్వహించింది మరి కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోందని అడిగిన ప్రశ్నకు ఆ వ్యవహారం కేంద్ర చూసుకుంటుందని అన్నారు అరవింద్. 
 
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లరు 
 
ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకోవడం లేదన్నారు ఎంపీ అరవింద్. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లే అవకాశం లేదన్నారు ఎంపీ. మునుగోడులో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉందన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. బీజేపీదే గెలుపు ఖాయం అన్నారు ఎంపీ అరవింద్. మునుగోడులో బీజేపీ గెలిచాక అభివృద్ధి చేస్తామన్నారు. ఒక్క మునుగోడు కాదు తెలంగాణ మొత్తం అభివృద్ధి చేస్తామన్నారు అరవింద్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన అరవింద్ రాజగోపాల్ రెడ్డి 20 ఏళ్ల క్రితమే కాంట్రాక్టర్ అని అన్నారు ఎంపీ అరవింద్. 
 
కేసిఆర్ కు సొంత విమానం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు అరవింద్. బ్యూటీ పార్లర్ తో కవితకు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే అన్న అరవింద్... రేవంత్ రెడ్డి కూడా మునుగోడు ఎన్నికల ప్రచారంలో గులాబీ కండువా కప్పుకుని స్పీచ్ ఇచ్చారని అన్నారు.   
       
 పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జోడోయాత్ర చేయమనండి .
 
ఏఐసీసీ అధ్యక్ష పోటీలో ఉన్న వ్యక్తి రాహూల్ కంటే 25 ఏళ్లు పెద్దవాడై ఉండాలని... 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవద్దు... స్మార్ట్ గా ఉండోద్దు.. హింది సరిగ్గా రావొద్దు అన్న కండిషన్స్ ఉన్నాయంటూ ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పాక్ అక్రమిత కాశ్మీర్ లో పాదయాత్ర చేయమని సవాల్ చేశారు. అప్పుడే తాము భారత్ జోడో యాత్ర అని ఒప్పుకుంటామని అన్నారు. అసలు భారత్ ఏం విడిపోయిందని జోడో యాత్ర చేపట్టారు అని అన్నారు. 
 
కేంద్రం పాలసీతో పసుపు రైతులు హ్యాపీ 
 
పసుపు రైతులు కేంద్ర సర్కార్ చర్యల వల్ల హ్యాపీగా ఉన్నారని అన్నారు ఎంపీ అరవింద్. ముందు ముందు పసుపు రైతులకు మరిన్ని మంచిరోజులు వస్తాయని అన్నారు.. పసుపు పంట సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన రైతులు బిజెపిలో చేరుతున్నారని..... ఇప్పటికే కొందరు రైతులు బీజేపీలో చేరారని చెప్పారు అరవింద్. ఇది బిజెపి నైతిక రాజకీయ విజయం అని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే పసుపు రైతులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. పసుపు పంటను వేర్ హౌస్ లో నిల్వ చేసి క్వింటాకు రూ. 10వేల ధర వచ్చిందని చెప్పారు అరవింద్. పసుపు శుద్ధి కర్మాగారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాధనలు కేంద్రానికి పంపితే తాము 80 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపమన్నా పట్టించుకోవటం లేదని అన్నారు ఎంపీ అరవింద్. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల మహారాష్ట్రలో పసుపు పంట విస్తీర్ణం పెరిగిందన్నారు. అక్కడ కూలీ రేట్లు తక్కువ. ఎకరానికి 60 నుంచి 70 వేల రూపాయలు కూలీలకు ఖర్చైతే ఇక్కడ లక్ష నుంచి 1.20వేల రూపాయలు ఖర్చవుతున్నాయని అన్నారు ఎంపీ అరవింద్.
 
తెలంగాణ లో 17 ఇధనాల్ ఫ్యాక్టరీలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదని అన్నారు అరవింద్. డబ్బులు ఇస్తాం, ప్రతిపాదనలు పంపాలని కోరుతున్న రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నారు ఎంపీ. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా అని చెప్పుకొచ్చారు ఎంపీ అరవింద్. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget