అన్వేషించండి

ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల కోరఢా- రెండింటిపై చర్యలు

ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలకు అధికారుల చెక్. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీలు. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, సిబ్బంది కరవు. నిబంధనలు పాటించని 2 ఆస్పత్రులు సీజ్, 19 ఆస్పత్రులకు నోటీసులు

గత కొంత కాలంగా నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులపై అధికార యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వాటి పనితీరుపై అధికారులు ఆరా తీస్తున్నారు. అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా 18 బృందాలు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నాయి. వీటిలో 3 బృందాలను కలెక్టర్ నియమించగా మిగతా బృందాలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్యారోగ్యశాఖ అధికారులు నియమించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలు, అందిస్తున్న సేవలపై ఆరాతీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తున్నారు.
 
జిల్లాలో 250 వరకు నర్సింగ్ హోమ్ లు, ప్రైవేట్ క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికీ పూర్తిస్థాయి రిజిస్ట్రే షన్ ఉండగా మరికొన్నింటికి రిజిస్ట్రేషన్ సమయం ముగియడంతో రెన్యువల్ చేశారు. మరికొన్నింటికీ తాత్కాలిక అనుమతులు ఇచ్చారు. జిల్లాలో అనుమతులు ఇచ్చిన హాస్పిటల్స్, ల్యాబ్ లో కనీస వసతులను కల్పించడంతోపాటు శిక్షణ పొందిన సిబ్బంది ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అనుమతులు ఉన్న వాటికే వైద్యసేవలు అందించాలని రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆయా ఆసుపత్రులకు నిబంధనలను వివరించారు. జిల్లాలోని ప్రైవేట్ వర్కింగ్ హోమ్ అనుమతులు కొన్నిరకాల వైద్యసేవలకే తీసుకుంటున్నా... స్పెషలిస్ట్ వైద్యులు లేకున్నా పలు రకాల సేవలను అందిస్తున్నారు. ల్యాబ్ నిర్వహణ సక్రమంగా లేకున్నా..... బయట నుంచి టెక్నిషియన్లను పిలిపిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోగుల అవసరం మేరకు స్పెషలిస్టులను కన్సల్టెంట్ బేస్ గా తీసుకువచ్చి వైద్యసేవలు అందిస్తున్నారని అధికారులు గుర్తించారు.
 
అనుమతి లేకుండా నిర్వహణ
 
హస్పిటల్స్‌కు ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకున్నా మేనేజ్ చేస్తున్న రెండు అసుపత్రులకు నోటీసులు జారీచేశాయి. వైద్యులు లేకుండానే వైద్య సేవలు అందిస్తుండడంతో ఈ రెండు ఆసుపత్రులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని 19 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులను జారీచేశారు. మరి కొన్ని హాస్పిటల్స్ కు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. జిల్లాలో కొన్ని సర్సింగ్ హోమ్ లు మినహాయిస్తే మిగితా వాటిలో వైద్యులతోపాటు నర్సింగ్ స్టాప్ ల్యాబ్ సిబ్బంది లేనట్లు గుర్తించారు అధికారులు. ఇష్టారీతిలో రోగుల నుంచి బిల్లులు వసూళ్లు, రోగులకు సంబంధించిన వివరాలు లేకపోవటం వాటిపై అధికారులు దృష్టి సారించారు. కనీస మౌలిక వసతులు లేని ఆసుపత్రుకు నోటీసుల జారీ చేశారు.
 
జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు చేస్తున్నానుని ఇప్పటివరకు నిబంధనలు పాటించని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని డీఎంహెచో డాక్టర్ సుదర్శనం తెలిపారు. మరికొన్ని ఆసుపత్రులకు నోటీసులు జారీచేశామని ఆయన తెలిపారు. 
 
తెలంగాణలో సిజేరియన్లలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. సిజేరియన్లను అరికట్టాలని వైద్య మంత్రి హరీష్ రావు ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోతోంది. సిజేరియన్లను అరిక్టటేందుకు జిల్లా కలెక్టర్ వైద్య అధికారులను హెచ్చరించినప్పటికీ సరైన పద్దతిలో చర్యలు తీసుకోవటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. ఓ వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల్లోకి వెళ్లటానికి కారణాలు, అక్కడ ఎక్కువగా సిజేరియన్లనే చేయటంపై జిల్లా వైద్య శాఖ తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయ్. తనిఖీల పేరుతో కొన్ని ఆస్పత్రుల్లో అధికారులు హడావుడి చేస్తున్నారని... పేరొందిన ఆస్పత్రులపై చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయ్. ఓ వైపు ఈ వ్యవహారంపై కలెక్టర్ నారయణ రెడ్డి సీరియస్ గా వ్యవహరిస్తున్నప్పటికీ జిల్లా వైద్యాధికారులు పెడచెవిన పెడుతున్నట్లు ఆరోపనలు వస్తున్నాయ్. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణిలకు నార్మల్ డెలవరీ అయ్యేందుకు వారికి యోగా, వ్యాయామం వంటి మెలుకువలను సైతం శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చాలా మంది నార్మల్ డెలివరీలు అవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 90 శాతం సిజేరియన్లకే వైద్యులు ప్రోత్సహిస్తున్నారని అసలు వాదన. 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget