అన్వేషించండి

Vemula Prashanth Reddy: ‘10 తరాల రైతులకు ప్రయోజనం చేకూరేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు’

Vemula Prashanth Reddy: సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి ఏడేళ్లలో మూడు రెట్లు పెరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 

TS Minister Vemula Prashanth Reddy Comments: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం సికింద్రపూర్ గ్రామంలో 8 కోట్ల 40 లక్షల వ్యయంతో నిర్మించిన 10వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం అధునాతన సౌకర్యాలతో నిర్మించిన గోదాంను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఒక్క టన్ను నిల్వ చేసుకునే గోడౌన్ కూడా లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో నేడు 25 కోట్లతో 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం గల గోడౌన్లు నిర్మించుకున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ కు నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి 7 ఏళ్లలో 3 రెట్లు పెరిగిందని అన్నారు. ముందు చూపుతో పండిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడానికి లక్షల మెట్రిక్ టన్నులు గోదాంలు నిర్మించారని గుర్తు చేశారు. 

యావత్ దేశం కేసీఆర్ నాయకత్వం కావాలంటోంది..!

కేసీఆర్ తలపెట్టిన ఏ సంక్షేమ కార్యక్రమం అయినా 10 తరాల పాటు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా రూపకల్పన చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల నాయకులు, రైతులు, ప్రజలు ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, సకాలంలో ఎరువులు... ఇన్ని కార్యక్రమాల అమలుపై ఆశ్చర్య పోతున్నారని వివరించారు. అందుకే యావత్ దేశం కేసిఆర్ నాయకత్వం కావాలని.. తెలంగాణ తరహా అభివృద్ది కావాలని కోరుకుంటుందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా కేసిఆర్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ది తమకు కావాలని బహిరంగంగానే చెబుతున్నారన్నారు.

పనికి బదులు మాటలు చెప్తూ.. ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు!

తెలంగాణ నేడు దేశంలోనే అభివృద్ధిలో, సంక్షేమంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి వెల్లడించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత చేస్తున్నా కొంత మంది మాత్రం మాటలు చెప్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పని చేసేది ఎవరో, మాటలు చెప్పేది ఎవరో ప్రజలే ఓ సారి ఆలోచించుకోవాలన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేయడమే వారి ఎజెండాగా పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని చేసినా ప్రజలకు బీఆర్ఎస్ మీద ఉన్న ప్రేమ, అభిమానమే తమ ప్రభుత్వాన్ని నిలబెడుతుందన్నా చెప్పుకొచ్చారు. కేసిఆర్ తెలంగాణలో ఇస్తున్నట్లు వారి పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు లాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా అని నిలదీశారు. దేవుని పేరుమీద రాజకీయాలు చేస్తున్నవారి అబద్ధపు ప్రచారాలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs New Zealand: న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
Advertisement

వీడియోలు

Vizag Google Data Centre Controversy | వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ పై ప్రశ్నలకు సమాధానాలేవి..? | ABP
Aus vs Ind 2nd ODI Highlights | రెండు వికెట్ల తేడాతో భారత్ పై రెండో వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ | ABP Desam
Netaji Subhash Chandra Bose | నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్ర | ABP Desam
కోహ్లీ భయ్యా.. ఏమైందయ్యా..? అన్నీ గుడ్లు, గుండు సున్నాలు పెడుతున్నావ్!
గిల్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చిన పాకిస్తాన్ ఫ్యాన్‌.. ఫైర్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs New Zealand: న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
న్యూజిలాండ్‌ను ఓడించి ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించిన భారత్; మంధానా-ప్రతికా ఇన్నింగ్స్ అదుర్స్
Telangana Cabinet Decisions: బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
బీసీ రిజర్వేన్లపై వీడిన సస్పెన్స్- తెలంగాణ క్యాబినేట్ కీలక నిర్ణయాలు!
YS Jagan Comments on Google Data Center: విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
విశాఖకు గూగుల్ సెంటర్ రావడంలో మాకు, అదానీకి క్రెడిట్ ఇవ్వడం లేదు: జగన్
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
కాల్పులు జరిగిన 12గంటల్లోపే నిందితుడ్ని పట్టుకున్నాం.. గోఅక్రమ రవాణాలో అసలేం జరిగిందటే..!? రాచకొండ సీపీ సుధీర్ బాబు
Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా?  సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
Telangana Cabinet: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత - కేబినెట్ నిర్ణయం - త్వరలో ఆర్డినెన్స్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత - కేబినెట్ నిర్ణయం - త్వరలో ఆర్డినెన్స్
Pakistani Taliban: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ పరువు తీసిన తాలిబన్ - మగాడివైతే మాతో పోరాడాలని సవాల్
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ పరువు తీసిన తాలిబన్ - మగాడివైతే మాతో పోరాడాలని సవాల్
Jublihills Byelections: జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
జూబ్లిహిల్స్ గెలుపు కోసం కేసీఆర్ రూట్ మ్యాప్ - ఫామ్ హౌస్‌లో కీలక నేతలతో సమావేశం !
Embed widget