అన్వేషించండి

Cotton Farmers Protest: ఆసిఫాబాద్‌ లో పత్తి రైతుల ఆందోళన, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్

Cotton Farmers Protest: కుమురం భీం ఆసిఫాబాద్ లో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తికి గిట్టుబాటు ధర 15 వేల రూపాయలు కల్పించాలని కలెక్టరేట్ ను ముట్టడించారు. 

Cotton Farmers Protest: కుమురం భీం ఆసిఫాబాద్ లో పత్తిరైతులు ఆందోళ చేపట్టారు. పత్తి గిట్టుబాటు ధర 15 వేల రూపాయలు కల్పించాలని కోరుతూ.. రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ధర్నాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న పత్తి రైతులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల సమస్యలు పరిష్కారమైతాయని భావించామని కానీ రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

Cotton Farmers Protest: ఆసిఫాబాద్‌ లో పత్తి రైతుల ఆందోళన, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్డెక్కినా.. జిల్లా కలెక్టర్ తమ వద్దకు వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పలేని దీన స్థితిలో ఉన్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాన రహదారి గుండా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వాలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోతే రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలంతా ఏ విధంగా పోరాడారో అదే విధంగా రైతులు వారి కుటుంబ సభ్యులతో రోడ్డుపై వంటావార్పులతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలుపుతామని వివరించారు. పత్తికి రూ.15,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన తెలుసుకొని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నిరసన చేపట్టిన రైతుల వద్దకు వచ్చి పత్తి ధర గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొంత సంయమనం పాటించాలన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో ధర గురించి ప్రస్తావన చేసి న్యాయం చేస్తామన్నారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

కరీంనగర్ లో పత్తి అమ్మాలా వద్దాని రైతుల సందిగ్ధత

మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి రైతులు, వ్యాపారులు డైలమాలో పడిపోయారు. గతంతో పోలిస్తే ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో అమ్మకం కొనుగోళ్ల విషయంలో తికమక పడుతున్నారు. తెల్ల బంగారం ధర ఇంకా పెరుగుతుందనే ఆశతో రైతులు పంటను అమ్మకుండా ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. దీంతో పత్తి లేక జిన్నింగ్ మిల్లులు వెలవెలబోతున్నాయి. గత ఏడాది జనవరిలో క్వింటాల్ పత్తి కి రూ.12,000, ఫిబ్రవరిలో రూ.14,000 వరకు బహిరంగ మార్కెట్లో ధర పలికింది. ఈసారి కూడా అదే విధంగా రేటు వస్తుందన్న ఆశతో పత్తి దిగుబడులను విక్రయించడం లేదు. డబ్బులు అవసరం ఉన్నవారు కూడా కొంతే అమ్ముతున్నారు తప్ప.. పూర్తి స్థాయిలో అమ్మడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో భారత పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ జిన్నింగ్ మిల్లులను నిర్ణయించినప్పటికీ ఓపెన్ మార్కెట్ లోనే ఎక్కువ ధర పలకడంతో (సీసీఐ)కొనుగోలు ప్రారంభం కాలేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget