By: ABP Desam | Updated at : 07 Feb 2022 07:10 AM (IST)
నిజామాబాద్ జిల్లా పేరు మార్పు
Nizambad District Name Change: ఇందూరు జిల్లా పేరు నిజామాబాద్ గా ఎలా మారింది. పేరు మార్పు చేసేంత పరిణామం ఎందుకొచ్చింది. ఇందూరు జిల్లాగా ఉన్న పేరును నిజామాబాద్ గా మార్చింది ఎవరు.. సిర్నాపల్లి మీదుగా రైల్వే లైన్ వేసినందుకు జిల్లా పేరు మార్పు జరిగిందా.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే.
గతంలో ఉన్న ఇందూరు జిల్లా చాలా ఏళ్ల కిందటే నిజామాబాద్ జిల్లాగా మారింది. ఈ జిల్లా ఎంతో చారిత్రాత్మకం. భిన్నజాతులు, విభిన్న సంస్కృతులకు నిలయం ఇందూరు జిల్లా. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు ప్రసిద్ధి. జిల్లాను ఎంతో మంది రాజులు పాలించారు. ఎన్నో చారిత్రక ఆలయాలకు ప్రసిద్ధి. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరు. ఇక్కడ 70 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ ఎక్కువగా వరి, మొక్కజోన్న, పసుపు వంటి పంటలు పండిస్తారు. నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది. గతంలో నిజామాబాద్ జిల్లా మహారాష్ట్రలోని నాందేడ్ వరకు ఉండేది.
నిజామాబాద్ జిల్లాలో గుజరాతీలు, మరాఠీలు కూడా ఎక్కువగా ఉంటారు. మంచి వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి. రాష్ట్ర రాజధానికి 160 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది నిజామాబాద్. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా మీదుగా ముంబయ్ వరకు రైల్వే మార్గం ఉంటుంది. అయితే పూర్వం నిజామాబాద్ జిల్లాను ఇందూరు జిల్లాగా పిలిచేవారు. మరి ఇందూరు జిల్లాగా ఉన్న పేరు నిజామాబాద్ గా మార్చటానికి వెనుకున్న కారణం ఇదే...
ఇందూరును సిర్నాపల్లి దొరసాని శీలం జానకీభాయి పాలించేది. 1903లో నిజాం నవాబు సికింద్రాబాద్ నుంచి ఇందూరు మీదుగా మన్మాడ్ వరకు రైల్వే లైన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఇందల్వాయ్ మీదుగా వెళ్తున్న రైల్వే లైన్ ను సిర్నాపల్లి మీదుగా వేయాలని దొరసాని శీలం జానకీ భాయి నిజాం నవాబును కోరారట. సిర్నాపల్లి రైల్వే లైన్ పడితే ఆ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగు పడుతుందన్న భావనతో నిజాం నవాబుకు పెట్టిన ప్రతిపాదన ఆమోదించి జానకీ భాయి చెప్పిన విధంగా రైల్వే మార్గాన్ని సిర్నాపల్లి మీదుగా తీసుకొచ్చారు. తన కోరికను మన్నించిన నిజాంనవాబు రైల్వే మార్గాన్ని మార్చి సిర్నాపల్లి మీదుగా లైన్ వేయటంతో శీలం జానకీ భాయి అందుకు కృతజ్ఞతగా ఇందూరు జిల్లా పేరును నిజాం నవాబు పేరుతో నిజామాబాద్ జిల్లాగా మార్చారనేది చరిత్ర.
Also Read: Weather Updates: ఏపీలో వణికిస్తున్న చలి గాలులు, తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రత
Nizamabad News : కొడుకు మోసం చేశాడని కలెక్టరేట్ లో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో సుపారీ హత్యకు ప్లాన్, సర్పంచ్ భర్త కుట్రను భగ్నం చేసిన పోలీసులు
Nizamabad Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ఇద్దరు సజీవదహనం
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టీఎస్ టెట్ 2022 ఫలితాలు లేనట్లే !
Weather Updates: ఏపీలో ఆ జిల్లాల్లో 4 రోజులు వర్షాలు, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ