By: ABP Desam | Updated at : 24 Feb 2022 01:47 AM (IST)
పసుపు రైతులపై సీఎం కేసీఆర్ కు దయ కలగట్లేదు
నిజామాబాద్ మార్కెట్లో పసుపునకు క్వింటాకు 10 వేల రూపాయలు ధర పలికింది. ఈ ఏడాది పడ్డ అకాల, అతి వర్షాలకు పసుపు పంట చాలా వరకు దెబ్బతిన్నది. పంట కుళ్లిపోయిన రైతులు చాలా వరకూ నష్టపోయారు. అలాంటి పసుపు తక్కువ ధర పలుకుతోంది. రైతులను ఆదుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కానీ ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.
ప్రకృతి వైపరిత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రారంభించింది. కానీ తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఈ పథకానికి తన వాటా ప్రీమియం చెల్లించకపోవడంతో ఇప్పుడు రైతులకు తీరని నష్టం జరుగుతోందని అన్నారు ఎంపీ అరవింద్. ప్రీమియం చెల్లించి ఉంటే ఇప్పుడు రైతులకు బీమా కింద నష్టపరిహారం అందేదని.. అలాగే ధర తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులను ఆదుకునే అవకాశం ఉన్నా.. కేంద్రం సహకరిస్తామని చెప్పినా.. ముఖ్యమంత్రి లేఖ రాయకుండా రైతులను కష్టాల పాలు చేస్తున్నాడని అన్నారు ఎంపీ అరవింద్.
If not for the farmers of Telangana, please do it for your Delhi ambition.”
— News Articles on my letter to Telangana CM on the plight of farmers in the state pic.twitter.com/Jy2iZXVAtg— Arvind Dharmapuri (@Arvindharmapuri) February 23, 2022
ఇప్పటికైనా సీఎం కేసీఆర్ కళ్లు తెరిచి రైతులను తక్షణమే ఆదుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు అరవింద్. నాణ్యమైన పంటకు ఇప్పటికి కూడా నిజామాబాద్ మార్కెట్లో మంచి ధరే పలుకుతుంది. మంచి పసుపును రైతులు సాంగ్లీకి తీసుకుపోయి అమ్ముకున్నా.... అక్కడ కూడా 11 వేల రూపాయలపైనే ధర పలుకుతోందని అన్నారు. గతేడాది కూడా పసుపు ధర నిజామాబాద్ మార్కెట్లో రూ. 10 వేల పైనే పలికిందని చెప్పారు ఎంపీ అరవింద్. వరుసగా రెండేండ్లు పసుపు పంటకు మంచి ధర రావడం ఆనందం కలిగిస్తోందని ఎంపీ అరవింద్ చెప్పారు.
“Janab,through you, I request the rich & wealthy Telangana Govt to implement the #PMFasalBimaYojna in Telangana & pay the premium for the same on time. I also urge you to compensate for the losses incurred by the farmers of Nizamabad & Telangana due to unseasonal rains last year. pic.twitter.com/NC16YBCxEM
— Arvind Dharmapuri (@Arvindharmapuri) February 23, 2022
Nizamabad News : కొడుకు మోసం చేశాడని కలెక్టరేట్ లో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
Nizamabad Crime : నిజామాబాద్ జిల్లాలో సుపారీ హత్యకు ప్లాన్, సర్పంచ్ భర్త కుట్రను భగ్నం చేసిన పోలీసులు
Nizamabad Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొట్టిన కారు, ఇద్దరు సజీవదహనం
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టీఎస్ టెట్ 2022 ఫలితాలు లేనట్లే !
Weather Updates: ఏపీలో ఆ జిల్లాల్లో 4 రోజులు వర్షాలు, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ