అన్వేషించండి

Kamareddy News : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు చూస్తూ అధికారులు అప్రమత్తమయ్యారు.

గత రెండు మూడేళ్లుగా గడగడలాడించిన కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని నెలలుగా కరోనా సైలెంట్ అవ్వటంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలు ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు వస్తున్నాయని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

కామారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇటీవల నిజాంసాగర్‌ మండలంలో ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతేకాకుండా కామారెడ్డి పట్టణంలోనూ పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో, ల్యాబ్‌లలో పరీక్షలు చేసుకోగా మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఇలా జిల్లాలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ సైతం అప్రమత్తమవుతోంది. అధికారుల ఆదేశాల మేరకు ఇంటింటా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

వైద్యశాఖ కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్‌ వేయిస్తున్నారు. అందు కోసం హర్‌గర్‌, దస్తక్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల మొదటి వారంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఇంటికి వెళ్లి కరోనా టీకాలు వేస్తున్నారు. జిల్లాలో 531 మందికి మొదటి డోసు, 2100 మందికి రెండో డోసు, 259మందికి బుస్టర్‌డోసు వేశారు. దీంతోపాటు ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా కేంద్రాసుపత్రిలోను కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడుతున్నారు.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 16,13, 850 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. మొదటి డోసు తీసుకున్న వారు 8,06,920 మంది ఉండగా రెండో డోసు తీసుకున్నవా రు 7,90,411 మంది ఉన్నారు. బూ స్టర్‌ డోస్‌ తీసుకున్నవారు 16,519 మంది ఉన్నారు.

మాస్క్ మరుస్తున్న ప్రజలు

కరోనా వైరస్‌ బెడద లేకపోవడంతో జనాలు మాస్క్ ధరించడం మరిచిపోయారు. కరోనా వైరస్‌ పూర్తిగా పోలేదని అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడంతోనే వైరస్‌ను అరికట్టవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. కానీ జనాలు మాస్క్‌ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడంలాంటి నిబంధనలు పాటించకపోవడంతోనే కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించటం లేదు.

థియేటర్లలో ఒక్కరూ కూడా మాస్క్‌ లు పెట్టుకోవటం లేదు. దీంతో కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బయటకు వెళ్తే మాస్క్ లు తప్పని సరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదుకావటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు పీహెచ్సీ సెంటర్లలో వ్యాక్సినేషన్ వేగవంతం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana News: జూన్ 2న ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇండ్ల పండుగకు శ్రీకారం
జూన్ 2న ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ ఇండ్ల పండుగకు శ్రీకారం
Breaking News: కేబినెట్ నుంచి తొలగింపు! కొత్త పార్టీ ఏర్పాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కేబినెట్ నుంచి తొలగింపు! కొత్త పార్టీ ఏర్పాటుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
Tourist Guide Jobs In Telangana: తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే! అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే!

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI VS KKR Result Update: కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
కేకేఆర్ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ రేసులోనే ర‌హానే సేన‌.. రాణించిన మ‌నీశ్.. ముంబైకి మ‌రో ఓట‌మి
AP Green Energy: రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Caste Census 2027: కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
కుల గణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు- ప్రభుత్వానికి తెలియాల్సిందే .. వ్యతిరేక పిటిషన్ కొట్టివేత
FD Rates 2026: బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ ఎఫ్‌డీల కండీషన్లు మరిచిపోవద్దు
బ్యాంకుల కొత్త స్కీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలు.. ఆ FDల కండీషన్లు మరిచిపోవద్దు
Modi In Italy: మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
మెలోనీకి ‘మెలొడీ’ చాక్లెట్లు ఇచ్చిన మోదీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ పిక్స్!
Ebola Virus : ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం.. బుండిబుగ్యో రకంపై WHO అత్యవసర హెచ్చరికలు
He Man Telugu Trailer : హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
హీ మ్యాన్ తెలుగు ట్రైలర్ - టాలీవుడ్ హీరో నిఖిల్ వాయిస్ ఓవర్... బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా?
Embed widget