అన్వేషించండి

Basar IIIT: ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్‌తో అర్ధరాత్రి కలెక్టర్ చర్చలు విఫలం! కొన్నసాగుతున్న విద్యార్థుల జాగరణ దీక్ష

Basar IIIT Students: 48 గంటల పాటు జాగరణ దీక్ష చేపడుతున్నారు. విద్యార్థుల 12 డిమాండ్లపై ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా సరైన హామీ ఇవ్వలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

బాసర ట్రిపుల్‌ ఐటీలో అర్ధరాత్రి వేళ కూడా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులతో ఇటీవలే నియమించిన డైరెక్టర్‌, కలెక్టర్‌ చర్చలు జరిపారు. అయితే వారితో చర్చలు సఫలం కాలేదు. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకూ క్యాంపస్ లోనే విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల వద్దకు ఆదివారం రాత్రి ఆర్‌జీయూకేటీ డైరెక్టర్‌ సతీశ్ కుమార్, కలెక్టర్‌ ముష్రాఫ్‌ అలీ వెళ్లి మాట్లాడారు. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు విద్యార్థులకు చెప్పారు. యూనివర్సిటీలో ఇప్పటికే పాడైన కరెంటు పనులు, నీళ్ల, డ్రైనేజీ పైపు లైను పనులు మరమ్మతులు చేపట్టామని వారు విద్యార్థులకు వివరించారు.

డిమాండ్లకు తగ్గట్లుగా వీసీ నియామకం జరుగుతుందని హామీ ఇచ్చారు. అందుకని ఆందోళన విరమించి హాస్టల్ గదుల్లోకి వెళ్లిపోవాలని చెప్పారు. అయితే, తమ సమస్యలు పరిష్కరించడంపై మంత్రుల నుంచి రాతపూర్వకంగా హామీ ఇప్పిస్తేనే తాము కదులుతామని విద్యార్థులు పట్టుబట్టారు. అయితే, మంత్రులతో అర్ధరాత్రి హామీ ఇప్పించడం కష్టమని కలెక్టర్ వారికి చెప్పారు. అయితే, అర్ధరాత్రి చర్చలు జరుపుతున్నారని, అలాంటిది హామీ ఇవ్వడానికి ఏం ఇబ్బందని విద్యార్థులు ఎదురు ప్రశ్నించారు. 

సత్యాగ్రహ దీక్ష
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు 48 గంటల పాటు జాగరణ దీక్ష చేపడుతున్నారు. విద్యార్థుల 12 డిమాండ్లపై ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా సరైన హామీ ఇవ్వలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. జాగన దీక్షలో భాగంగా విద్యార్థులకు ఏమైనా జరిగీతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్. 

రాత్రి ప్రెస్ నోట్ విడుదల
బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (SGC) విద్యార్థులు ఆదివారం రాత్రి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. తాము పోరాటం మొదలు పెట్టిన నాటి నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్, ముథోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, టీఎస్పీఎస్సీ వైస్ ఛైర్మన్ వెంకటరమణ, ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీశ్ కుమార్ తదితరులు తమతో చర్చలు జరిపారని అవి ఫలదాయకంగా లేవని తెలిపారు. డిమాండ్లకు సంబంధించిన వివరాలను కూడా అందులో పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget