అన్వేషించండి

Ramji Gond : సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే రాంజీగోండ్ పోరాటం, 1000 మంది ఉరికొయ్యల అర్థనాదాలకు గుర్తింపులేదు - తుడుందెబ్బ నేతలు

Ramji Gond : 1857 సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే రాంజీగోండ్ స్వాతంత్ర్య పోరాటం చేశారని తుడుందెబ్బ నాయకులు అన్నారు.

 Ramji Gond : ఆదివాసీ పోరాట యోధుడు మర్సుకొల రాంజీగోండ్ 163వ వర్ధంతిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీలు జరుపుకున్నారు. నిర్మల్ జిల్లాలోని వెయ్యి ఉర్రిల మర్రి వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో రాంజీగోండ్ 163వ వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపల్లి రోడ్ లోని రాంజీగోండ్ స్థూపానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే గొప్ప పోరాటం రాంజీగోండ్ పోరాటమన్నారు. ఈ దేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు మొదలు కాక ముందే నిర్మల్ కొండల్లో నడిచిన పోరాటం రాంజీగోండ్ పోరాటమని అన్నారు. బ్రిటీష్, నైజాంలతో జరిగిన హోరాహోరి పోరులో గోండు రాజ్య రక్షణ కోసం చేసిన పోరాటంలో 1860 ఏప్రిల్ 9న రాంజీగోండుతో సహా 1000 మందిని నిర్మల్ ప్రాంతంలోని ఎల్లపల్లి వెళ్లే చెరువు కట్ట వద్ద ఊడల మర్రికి ఉరితీశారని గుర్తుచేశారు. ఈ ఘటన స్వాతంత్ర్య పోరాటంలో ఎక్కడలేదని అన్నారు. ఆదివాసీ పోరాట యోధుల చరిత్రను ఈ దేశం అణచివేసిందన్నారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పనికిరాని వారి చరిత్ర రాశారు కానీ రక్తం ఏరులై పారిన ఆదివాసుల చరిత్రని రాయకపోవడం ఆదివాసీలపై అణచి వేత ధోరణికి నిదర్శనం అన్నారు. 


Ramji Gond : సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే రాంజీగోండ్ పోరాటం, 1000 మంది ఉరికొయ్యల అర్థనాదాలకు గుర్తింపులేదు - తుడుందెబ్బ నేతలు

ట్యాంక్ బండ్ పై విగ్రహం 

1000 మంది గోండుల ఉరికొయ్యల అర్థనాదాలను ఈ ప్రభుత్వాలు నేటికీ గుర్తించకపోవడం దుర్మార్గ చర్య అని, అందుకే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాంజీగోండు చరిత్రని బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేసి అధికారికంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని వెంకగారి భూమయ్య కోరారు. రాంజీగోండు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని, రాంజీగోండు చరిత్రని పాఠ్య పుస్తకంలో చేర్చాలని తెలంగాణ పోరాట గడ్డపై ఉన్న వీరున్ని ఈ దేశ చరిత్రలో నిర్మాణం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.  

కుమ్రం భీం కాలనీలో రాంజీగోండ్ 163వ వర్ధంతి కార్యక్రమం 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్రం భీం కాలనీలో ఆదివాసీ అమరవీరుడు రాంజీగోండు 163వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో కుమ్రం భీం కాలనీ నుంచి బస్‌స్టాండ్ వరకు రెండు కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ రీతిలో డోలు వాయిద్యాలు వాయిస్తూ అమర్ హై రాంజీగోండ్, రాంజీగోండ్ ఆశయాలను నెరవేర్చాలంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. అనంతరం బస్‌స్టాండుకు చేరుకొని రాంజీగోండు విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ మాట్లాడుతూ... బ్రిటిష్, నైజాంలతో నాడు గోండు రాజ్య రక్షణ కోసం చేసిన పోరాటంలో ఏప్రిల్ 9న మర్సుకోల రాంజీగోండు తో సహా 1000 మందిని నిర్మల్ ప్రాంతంలోని ఎల్లపల్లి వెళ్లే చెరువు కట్ట వద్ద ఊడల మర్రికి ఉరితీసిన చరిత్ర.. నేడు స్వాతంత్ర్య పోరాటంలో ఎక్కడలేదని అన్నారు. ఆదివాసి పోరాట యోధుల చరిత్రను ఈ దేశం అణచివేసిందన్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
Embed widget