అన్వేషించండి

Komatireddy Rajagopal Reddy : కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు, ముందస్తుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy : వచ్చే మే నెలలోనే తెలంగాణలో ఎన్నికలు ఉంటాయని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ప్రతీ ఒక్కరు సిద్ధంగా ఉండాలన్నారు.

Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఉపఎన్నిక అనంతరం బీజేపీకి వచ్చిన ఓట్లను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే సంకేతాలతోనే బండి సంజయ్ పాదయాత్ర, భైంసా బహిరంగ సభ రద్దుకు ప్రభుత్వం యత్నించిందన్నారు. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడం చూస్తుంటే నిజాం పాలన గుర్తుకు వస్తోందన్నారు. కానీ తమ వైపున ధర్మం ఉండడంతోనే హైకోర్టు ప్రజా సంగ్రామ యాత్రకు, బహిరంగ సభకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. వచ్చే మే నెలలోనే కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఎన్నికలకు ప్రతీ ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదికి 10 స్థానాలను బీజేపీ గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు 

 మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్మల్‌ లో మాట్లాడిన ఆయన కర్ణాటక తో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సిద్ధంగా ఉండాలన్నారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో సీఎం  కేసీఆర్‌ లో భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ఆ పార్టీలో బలమైన నాయకులు లేరన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించి బీజేపీలోకి రావాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పది స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తనదే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.  

ఆరు నెలల ముందే ఎన్నికలు 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఇటీవల టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో స్పష్టంచేశారు. కానీ ముందస్తుపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ అంశంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు.  కొన్ని నెలల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.  ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియడానికి ఆరు నెలల ముందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్, మే నెలలో కర్ణాటకతో పాటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారని విమర్శించారు. 
 

కేసీఆర్ మాటలు అర్థాలే వేరు! 

గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఇటీవల కేసీఆర్ పార్టీ శ్రేణులకు తెలిపారు. ఈ మధ్య జరిగిన టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలోనే ఈ విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే కేసీఆర్ మాటలకు అర్థాలు వేరంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా మందస్తు ఎన్నికలు వెళ్లడమే కేసీఆర్‌ ప్లాన్‌ అంటూ ప్రచారం జరుగుతుంది.  
 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Crime News: 5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
Chandrababu:  చంద్రబాబుపై  తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs RR Match preview IPL 2025 | నేడు బెంగుళూరులో రాజస్థాన్ రాయల్స్ తో RCB ఫైట్ | ABP DesamRohit Sharma 70 Runs vs SRH IPL 2025 | సరైన సమయంలో బీభత్సమైన ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ | ABP DesamMumbai Indians top 3 Position IPL 2025 | అనూహ్య రీతిలో పాయింట్స్ టేబుల్ లో దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్ | ABP DesamIshan Kishan Match Fixing Trending IPL 2025 | తీవ్ర వివాదమవుతున్న ఇషాన్ కిషన్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Crime News: 5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
Chandrababu:  చంద్రబాబుపై  తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
BRS Meeting In Warangal: వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
వరంగల్‌లో గులాబీ మాస్ జాతరకు భారీ ఏర్పాట్లు, కేవలం పార్కింగ్ కోసమే వెయ్యి ఎకరాలు
YS Sharmila: ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ - ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు
Rajamouli: మహేష్ బాబు సినిమా కోసం... ఆర్టీఏ ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
మహేష్ బాబు సినిమా కోసం... ఆర్టీఏ ఆఫీసుకు రాజమౌళి... విదేశాల్లో జక్కన్నకు డ్రైవర్ అవసరం లేదా?
Pahalgam attack:భారత్‌ జవాన్‌ను బంధించిన పాక్- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత
భారత్‌ జవాన్‌ను బంధించిన పాక్- రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత  
Embed widget