అన్వేషించండి

Komatireddy Rajagopal Reddy : కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు, ముందస్తుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy : వచ్చే మే నెలలోనే తెలంగాణలో ఎన్నికలు ఉంటాయని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ప్రతీ ఒక్కరు సిద్ధంగా ఉండాలన్నారు.

Komatireddy Rajagopal Reddy : మునుగోడు ఉపఎన్నిక అనంతరం బీజేపీకి వచ్చిన ఓట్లను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే సంకేతాలతోనే బండి సంజయ్ పాదయాత్ర, భైంసా బహిరంగ సభ రద్దుకు ప్రభుత్వం యత్నించిందన్నారు. ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడం చూస్తుంటే నిజాం పాలన గుర్తుకు వస్తోందన్నారు. కానీ తమ వైపున ధర్మం ఉండడంతోనే హైకోర్టు ప్రజా సంగ్రామ యాత్రకు, బహిరంగ సభకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. వచ్చే మే నెలలోనే కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఎన్నికలకు ప్రతీ ఒక్కరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదికి 10 స్థానాలను బీజేపీ గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు 

 మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్మల్‌ లో మాట్లాడిన ఆయన కర్ణాటక తో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సిద్ధంగా ఉండాలన్నారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో సీఎం  కేసీఆర్‌ లో భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ఆ పార్టీలో బలమైన నాయకులు లేరన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించి బీజేపీలోకి రావాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పది స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తనదే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.  

ఆరు నెలల ముందే ఎన్నికలు 

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఇటీవల టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో స్పష్టంచేశారు. కానీ ముందస్తుపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ అంశంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు.  కొన్ని నెలల్లో కర్ణాటకతో పాటు తెలంగాణలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.  ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియడానికి ఆరు నెలల ముందే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఏప్రిల్, మే నెలలో కర్ణాటకతో పాటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారని విమర్శించారు. 
 

కేసీఆర్ మాటలు అర్థాలే వేరు! 

గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ఇటీవల కేసీఆర్ పార్టీ శ్రేణులకు తెలిపారు. ఈ మధ్య జరిగిన టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలోనే ఈ విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే కేసీఆర్ మాటలకు అర్థాలు వేరంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా మందస్తు ఎన్నికలు వెళ్లడమే కేసీఆర్‌ ప్లాన్‌ అంటూ ప్రచారం జరుగుతుంది.  
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Embed widget