అన్వేషించండి

Mallu Ravi: కేటీఆర్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరం, ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న మల్లు రవి

Telagnana Congress leader Mallu Ravi: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana MLC Elections 2024: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు రవి పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్‌ పిలానీలో చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతారా..? అని మల్లు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బిట్స్‌ పిలానీ స్టూడెంట్‌ అని, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బ్లాక్‌మెయిలర్‌ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

తాజాగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. బిట్స్‌ పిలానీలో చదివిన వ్యక్తిని అభ్యర్థిగా పెట్టామని చెబుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు.. అక్కడ చదివిన వారిని మాత్రమే ఓట్లు అడుగుతున్నారా..? అని మల్లు రవి ప్రశ్నించారు. బిట్స్‌ పిలానీలో చదివిన వాళ్లే పట్టభద్రులుగా, మిగిలిన వాళ్లు కాదన్నట్టుగా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను కించపరుస్తూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులపై భారతీయ రాష్ట్ర సమితి నాయకుల వైఖరి ఏమిటో వారి మాటల్లోనే తెలుస్తోందని విమర్శించారు. తీన్మార్‌ మల్లన్న పోటీకి అర్హుడు కాబట్టే ఎన్నికల కమిషన్‌ అంగీకరించిందని, కాబట్టి కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్న మల్లు రవి.. ఈసీ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ

జూన్‌ రెండో తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియాగాంధీ విస్తున్నారని మల్లు రవి పేర్కొన్నారు. ఆమెను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నట్టు వివరించారు. తెలంగాణ సాధనకు పని చేసిన అన్ని పార్టీలను వేడుకలకు ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ గురించి సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారని, ఆ పార్టీలన్నీ తీన్మార్‌ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయన్నారు. మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత కాంగ్రెస్‌ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళతారన్నారు. శాసన మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగులు, మహిళలు గురించి తీన్మార్‌ మల్లన్న తన గొంతును వినిపిస్తారని, ఆ నమ్మకం తనకుందని రవి స్పష్టం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Embed widget