అన్వేషించండి

ఓవరాక్షన్ చేయొద్దు- తెలంగాణ అధికారులకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ముఖ్యమంత్రి సీఎం తెలంగాణ పాలిట శాపంగా మారారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బండి సంజయ్ చేస్తున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి టీఆర్‌ఎస్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో అక్రమాలకు పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. 

కుట్రలు చేసేందుకు మాత్రమే టైం ఉంటుంది..

సీఎం కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు కిషన్ రెడ్డి. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు మాత్రం టైం ఉంటుందని ఎద్దేవా చేశారు. కేజీ టూ పీజీ విద్య ఏమైందని నిలదీశారు. ఏడాది తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మార్పు ఖాయమని అన్నారు. అధికారులు ఓవర్ యాక్షన్ చేయొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అధికార పార్టీని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్న కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు... ఈడీ దాడులపై ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. 

యాదాద్రి టు భద్రకాళి

24 రోజుల పాటు కొనసాగనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దర్శనంతో ముగియనుంది. యాదగిరి పల్లి, గాంధీ నగర్, గణేష్ నగర్, శుభం గార్డెన్, పాతగుట్ట, యాదగిరి గుట్ట ప్రధాన రహదారి గొల్ల గుడిసెలు, దాతారు పల్లి, బస్వాపూర్, గ్రామాల్లో పర్యటన సాగనుంది.  

కేసీఆర్‌ను జైలులో వేస్తాం..

బండి సంజయ్ ప్రారంభించిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు, నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై న్యాయ బద్ధంగా పోరాడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే... కరుణానిధి, జయ లలిత, లాలూప్రసాద్ యాదవ్ అందరికీ గుర్తొస్తారని తెలిపారు. కేసీఆర్‌ను తప్పకుండా జైలులో వేస్తామని పునరుద్ధాటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస కేవలం 15 సీట్లు మాత్రమే గెలుస్తుందని అన్నారు. పాదయాత్రలో కేసీఆర్ అవినీతిని క్షేత్ర స్థాయిలో ఎండ గడతానని బండి సంజయ్ అన్నారు. 

చికోటి వెనుక సగం మంది టీఆర్ఎస్ నేతలే..

చికోటి ప్రవీణ్ వెనుక సగం మంది తెరాస నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ నేతలను తిట్టిన టీఆర్ఎస్ నేతలు.. వారం రోజులుగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రజాసంగ్రామ పాదయాత్ర ద్వారా సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిని క్షేత్ర స్థాయిలో ఎండగడతామని అన్నారు. అయితే తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది అధిష్ఠానం నిర్ణయం అని అన్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల తన అభిప్రాయం చెప్పారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానమే చెప్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా భాజపా గెలుస్తుందన్నారు. తెలంగాణపై మోదీ, అమిత్ షాకు సంపూర్ణ విశ్వాం ఏర్పడిందన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించబోయేది బీజేపీయే అని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం: ఢిల్లీ టు కాశ్మీర్ వణికిన ఉత్తరాది..
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Breaking News:తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
Embed widget