అన్వేషించండి

ఓవరాక్షన్ చేయొద్దు- తెలంగాణ అధికారులకు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ముఖ్యమంత్రి సీఎం తెలంగాణ పాలిట శాపంగా మారారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బండి సంజయ్ చేస్తున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి టీఆర్‌ఎస్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో అక్రమాలకు పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. 

కుట్రలు చేసేందుకు మాత్రమే టైం ఉంటుంది..

సీఎం కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు కిషన్ రెడ్డి. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు మాత్రం టైం ఉంటుందని ఎద్దేవా చేశారు. కేజీ టూ పీజీ విద్య ఏమైందని నిలదీశారు. ఏడాది తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మార్పు ఖాయమని అన్నారు. అధికారులు ఓవర్ యాక్షన్ చేయొద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అధికార పార్టీని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్న కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు... ఈడీ దాడులపై ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. 

యాదాద్రి టు భద్రకాళి

24 రోజుల పాటు కొనసాగనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దర్శనంతో ముగియనుంది. యాదగిరి పల్లి, గాంధీ నగర్, గణేష్ నగర్, శుభం గార్డెన్, పాతగుట్ట, యాదగిరి గుట్ట ప్రధాన రహదారి గొల్ల గుడిసెలు, దాతారు పల్లి, బస్వాపూర్, గ్రామాల్లో పర్యటన సాగనుంది.  

కేసీఆర్‌ను జైలులో వేస్తాం..

బండి సంజయ్ ప్రారంభించిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు, నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై న్యాయ బద్ధంగా పోరాడతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే... కరుణానిధి, జయ లలిత, లాలూప్రసాద్ యాదవ్ అందరికీ గుర్తొస్తారని తెలిపారు. కేసీఆర్‌ను తప్పకుండా జైలులో వేస్తామని పునరుద్ధాటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస కేవలం 15 సీట్లు మాత్రమే గెలుస్తుందని అన్నారు. పాదయాత్రలో కేసీఆర్ అవినీతిని క్షేత్ర స్థాయిలో ఎండ గడతానని బండి సంజయ్ అన్నారు. 

చికోటి వెనుక సగం మంది టీఆర్ఎస్ నేతలే..

చికోటి ప్రవీణ్ వెనుక సగం మంది తెరాస నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ నేతలను తిట్టిన టీఆర్ఎస్ నేతలు.. వారం రోజులుగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. ప్రజాసంగ్రామ పాదయాత్ర ద్వారా సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిని క్షేత్ర స్థాయిలో ఎండగడతామని అన్నారు. అయితే తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది అధిష్ఠానం నిర్ణయం అని అన్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల తన అభిప్రాయం చెప్పారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానమే చెప్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా భాజపా గెలుస్తుందన్నారు. తెలంగాణపై మోదీ, అమిత్ షాకు సంపూర్ణ విశ్వాం ఏర్పడిందన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించబోయేది బీజేపీయే అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
PM Kisan Yojana: హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
హోలీకి PM కిసాన్ యోజన 22వ విడత నిధులు వస్తాయా? తాజా అప్‌డేట్ ఏంటీ?
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget