అన్వేషించండి

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తాం: తమ్మినేని

తెలంగాణలో వచ్చేఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తామన్నారు CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. జనచైతన్య యాత్ర నల్లగొండకు చేరుకున్న నేపథ్యంలో తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో వచ్చేఎన్నికల్లో BRSతో కలిసి పోటీచేస్తామన్నారు CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని. జనచైతన్య యాత్ర నల్లగొండకు చేరుకున్న సందర్శంగా తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. BRSకు మద్దతిస్తూ సీఎం కేసీఆర్ సూచనలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. భవిష్యత్తులో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని బలమైన పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాసంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సీపీఎం తిప్పికొడుతోందని, ఆ దిశగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తమపార్టీ ముందుకు సాగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.

బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ శక్తులను వ్యతిరేకిద్దాం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పోరాడుదాం అనే సంకల్పంతో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర సోమవారం నల్గొండకు చేరుకుంది. ఇందులో భాగంగా కలెక్టరేట్ నుంచి సభ నిర్వహించే అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీతో వచ్చారు. గడియారం సెంటర్, రామగిరి , పానగల్ మీదుగా చిన్నసూరారం, నకిరేకల్ వైపుగా జనచైతన్య యాత్ర సాగింది.

బీజేపీకి వ్యతిరేకంగా ఆ పార్టీని ఓడించేందుకే తమపార్టీ బీఆర్ఎస్‌కు మద్దతిచ్చిందన్నారు తమ్మినేని వీరభద్రం. మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తాయని తెలిపారు. వ్యవసాయాన్ని నాశనం చేసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్లచట్టాలే అందుకు నిదర్శనమన్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న బ్రిటిష్ పాలన కళ్లజూస్తున్నామని, దేశానికి ఇదెంతో ప్రమాదకరమని అన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని తమ్మినేని స్పష్టం చేశారు. ప్రజలను ఐక్యం చేసి, మోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను తెలియజేసేందుకే జనచైతన్య యాత్రలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.

సీపీఎం చేపట్టిన జనచైతన్య యాత్రకు BRS నేతలు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈ ర్యాలీకి హాజరయ్యారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ సంస్థలను నీరుగారుస్తున్నారని కంచర్ల విమర్శించారు. దేశంలో ఇప్పటివరకు 14 మంది ప్రధాన మంత్రులు పరిపాలన సాగించినా, రూ 52 లక్షల కోట్ల అప్పు మాత్రమే అయిందని, మోదీ హయాంలో రూ.100 లక్షల కోట్ల అప్పులయ్యానని విమర్శించారు. పేదవాడి కడుపుకొట్టి, నేతలను ఈడీ, సీబీఐలతో  ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచేతన యాత్రను స్వాగతిస్తున్నామని అన్నారు. సీపీఎంతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తామని కంచర్ల భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు.  

బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఎం మహిళా నాయకురాలు మల్లు లక్ష్మి, తదితర సీపీఎం, సీపీఐ, బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
Kavitha : సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
Ippa Flower: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?
తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఇప్ప పువ్వు ప్రత్యేకతలేంటి? సారా తయారీ విధానం, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Embed widget