అన్వేషించండి

Congress Focus on Munugodu:మునుగోడు ఉపఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్- నెలాఖరుకు అభ్యర్థి ఖరారు!

Congress Focus on Munugodu: మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

Congress Focus on Munugodu: తెలంగాణలో రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. తరచూ ఉప ఎన్నికలు రావడంతో రాజకీయ యుద్ధం నిత్యం కొనసాగుతూనే ఉంది. మొన్నటి హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంలో రాజకీయం అంతా ఆ నియోజకవర్గం చుట్టూనే జరగ్గా.. ఇప్పుడు మునుగోడు వంతు వచ్చేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలా రాజీనామా చేయగానే ఇలా ప్రచారాలు ప్రారంభం అయ్యాయి. అసలు నోటిఫికేషన్ రాకముందే అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. 

మునుగోడు రాజకీయ కాక

ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మునుగోడులో అందరికంటే ముందే భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారానికి శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా అటు బీజేపీపై, ఇటు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ పార్టీ అత్యంత కీలకనేత అయిన అమిత్ షా మునుగోడు సభలో పాల్గొన్నారు. అసలు షెడ్యూల్ రాక ముందే అన్ని పార్టీలు యుద్ధ ప్రారంభించాయి. 

ఈ నెలాఖరుకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు! 

కాంగ్రెస్ పార్టీకి మునుగోడు సిట్టింగ్ స్థానం. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మునుగోడు స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని అనుకుంటోంది కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల ముఖ్యనేతలు మునుగోడు ప్రచారంలో పాల్గొనగా.. కాంగ్రెస్ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఓసారి సభను ఏర్పాటు చేసింది రాష్ట్ర కాంగ్రెస్. నియోజకవర్గంలో లక్షమంది పాదాభివందన కార్యక్రమం కూడా చేపట్టింది. ఇప్పుడు అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టింది. అభ్యర్థి ఎంపికపై ఇవాళ్టి నుంచి ముఖ్య నేతలతో సంప్రదింపులు జరపనుంది.  ఈ నెలాఖరులోగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఎంపీ, పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయం తీసుకోమని ప్రియాంక సూచించిట్లు తెలుస్తోంది. 

ప్రజల్లోకి కాంగ్రెస్ నాయకులు

కరోనా నుంచి కోలుకున్న రేవంత్ రెడ్డి.. పలు రోజులుగా మునుగోడులోనే మకాం వేశారు. 'మన మునుగోడు -  మన కాంగ్రెస్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యానికి పాదాభివందనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తనతో సహా వెయ్యి మంది నాయకులు ఒక్కో నాయకుడు వంద మంది ఓటర్లకు వందనం చేస్తూ ఓట్లు అడగాలని నిర్దేశించుకున్నారు. 'మన వెయ్యి మంది నాయకులు లక్ష మందికి పాదాభివందనం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేయబోతున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 

మునుగోడు గెలిచి తీరాలి

మునుగోడు ఉపఎన్నికను అటు అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మునుగోడు బై పోల్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమిని, మునుగోడు ఫలితంతో మరుగున పడేలా చేసేందుకు అధికార గులాబీ దళం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధం అయింది. మునుగోడు ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసి బీజేపీలోనూ కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విజయం సాధిస్తారన్న ధీమా పార్టీలో కనిపిస్తోంది. ఇప్పుడే ఈ స్థాయిలో ప్రచార పర్వం. నోటిఫికేషన్ విడుదలై, షెడ్యూల్ వచ్చిన తర్వాత మరింత పెరిగే అవకాశం మాత్రం మెండుగా ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
Telangana Indiramamma Kutumba Jeevita Beema Scheme : తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Embed widget