అన్వేషించండి

Congress Focus on Munugodu:మునుగోడు ఉపఎన్నికపై ప్రియాంక గాంధీ ఫోకస్- నెలాఖరుకు అభ్యర్థి ఖరారు!

Congress Focus on Munugodu: మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

Congress Focus on Munugodu: తెలంగాణలో రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. తరచూ ఉప ఎన్నికలు రావడంతో రాజకీయ యుద్ధం నిత్యం కొనసాగుతూనే ఉంది. మొన్నటి హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంలో రాజకీయం అంతా ఆ నియోజకవర్గం చుట్టూనే జరగ్గా.. ఇప్పుడు మునుగోడు వంతు వచ్చేసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలా రాజీనామా చేయగానే ఇలా ప్రచారాలు ప్రారంభం అయ్యాయి. అసలు నోటిఫికేషన్ రాకముందే అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. 

మునుగోడు రాజకీయ కాక

ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మునుగోడులో అందరికంటే ముందే భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రచారానికి శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా అటు బీజేపీపై, ఇటు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ పార్టీ అత్యంత కీలకనేత అయిన అమిత్ షా మునుగోడు సభలో పాల్గొన్నారు. అసలు షెడ్యూల్ రాక ముందే అన్ని పార్టీలు యుద్ధ ప్రారంభించాయి. 

ఈ నెలాఖరుకు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు! 

కాంగ్రెస్ పార్టీకి మునుగోడు సిట్టింగ్ స్థానం. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మునుగోడు స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని అనుకుంటోంది కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల ముఖ్యనేతలు మునుగోడు ప్రచారంలో పాల్గొనగా.. కాంగ్రెస్ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఓసారి సభను ఏర్పాటు చేసింది రాష్ట్ర కాంగ్రెస్. నియోజకవర్గంలో లక్షమంది పాదాభివందన కార్యక్రమం కూడా చేపట్టింది. ఇప్పుడు అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టింది. అభ్యర్థి ఎంపికపై ఇవాళ్టి నుంచి ముఖ్య నేతలతో సంప్రదింపులు జరపనుంది.  ఈ నెలాఖరులోగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఎంపీ, పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయం తీసుకోమని ప్రియాంక సూచించిట్లు తెలుస్తోంది. 

ప్రజల్లోకి కాంగ్రెస్ నాయకులు

కరోనా నుంచి కోలుకున్న రేవంత్ రెడ్డి.. పలు రోజులుగా మునుగోడులోనే మకాం వేశారు. 'మన మునుగోడు -  మన కాంగ్రెస్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యానికి పాదాభివందనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తనతో సహా వెయ్యి మంది నాయకులు ఒక్కో నాయకుడు వంద మంది ఓటర్లకు వందనం చేస్తూ ఓట్లు అడగాలని నిర్దేశించుకున్నారు. 'మన వెయ్యి మంది నాయకులు లక్ష మందికి పాదాభివందనం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేయబోతున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 

మునుగోడు గెలిచి తీరాలి

మునుగోడు ఉపఎన్నికను అటు అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మునుగోడు బై పోల్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమిని, మునుగోడు ఫలితంతో మరుగున పడేలా చేసేందుకు అధికార గులాబీ దళం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధం అయింది. మునుగోడు ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసి బీజేపీలోనూ కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విజయం సాధిస్తారన్న ధీమా పార్టీలో కనిపిస్తోంది. ఇప్పుడే ఈ స్థాయిలో ప్రచార పర్వం. నోటిఫికేషన్ విడుదలై, షెడ్యూల్ వచ్చిన తర్వాత మరింత పెరిగే అవకాశం మాత్రం మెండుగా ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Embed widget