అన్వేషించండి

Ramreddy Damodar Reddy: తుంగతుర్తి టైగర్ అస్తమయం: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి జీవిత ప్రస్థానం

Ramreddy Damodar Reddy: రాంరెడ్డి దామోదర్‌రెడ్డి లేని లోటు కాంగ్రెస్‌లో ఎవరూ తీర్చలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయడ్డారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

Ramreddy Damodar Reddy: ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో సుదీర్ఘ అనుభవం, అపారమైన ప్రజాదరణ కలిగిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 'టైగర్‌ దామన్న'గా,'జనహృదయ నేత'గా పేరుపొందిన ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ వర్గాలు, నాయకులు కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు ఆయన వేసిన పునాది బలమైనదని నాయకులు కొనియాడారు.

వ్యక్తిగత నేపథ్యం- కుటుంబ రాజకీయ వారసత్వం

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1952 సెప్టెంబర్‌ 14న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాత లింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలలో మూడో కుమారుడిగా జన్మించారు. ఆయన కుటుంబానికి రాజకీయ వారసత్వం ఉంది; ఆయన పెద్ద సోదరుడు వెంకట్‌రెడ్డి కూడా సుజాత నగర్, పాలేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పని చేశారు.

దామోదర్‌రెడ్డి ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే చదువుకున్నా, ఆ తరువాత హైస్కూల్‌ విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. డిగ్రీని వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో చదివారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం, తుంగతుర్తికి చెందిన దేశ్‌ముఖ్‌ కుటుంబం ఉప్పునూతల సర్వోత్తంరెడ్డి, కౌసల్యాదేవిల రెండో కుమార్తె వరూధినీ దేవితో వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. వారికి సర్వోత్తం రెడ్డి అనే కుమారుడు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో జన్మించినప్పటికీ, తుంగతుర్తికి అల్లుడిగా వచ్చిన ఆయన ఇక్కడే రాజకీయంగా ఎదిగి స్థిరపడటం విశేషం.

కమ్యూనిస్టుల కంచుకోటను ఛేదించిన ధీశాలి

వివాహం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట్లో, వారి పూర్వీకులు తుంగతుర్తిలో నిర్మించిన పట్టాభి రామచంద్రస్వామి ఆలయానికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. జనాకర్షణ నేతగా ఎదిగిన ఆయన తుంగతుర్తిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి రాజకీయ జీవితంలో అత్యంత విశిష్టమైన అంశం, కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం. కమ్యూనిస్టు యోధులు భీంరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం గెలుపొందిన తుంగతుర్తి నుంచి ఆయన నాలుగుసార్లు గెలుపొందడం విశేషం. 1985లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనే. 1989లో నల్లగొండ జిల్లాలో గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో దామన్న ఒకరు.

ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నిక: 1985, 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తుంగతుర్తి నుంచి గెలుపొందారు. 1994లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత, 2009 ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రెండుసార్లు మంత్రిగా సేవలు

దామోదర్‌రెడ్డి రెండు సార్లు రాష్ట్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన 1992లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత, 2009లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో ఐటీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలోనే సూర్యాపేటలో బహిరంగ సభలు, ఖమ్మం జిల్లాలో సదస్సులు పెట్టి పార్టీలో టైగర్‌ దామన్న’గా గుర్తింపు పొందారు.

రైతుల కోసం గోదావరి జలాల కృషి

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రజాసేవలో అత్యంత కీలకమైన అంశం గోదావరి జలాల సాధన. తుంగతుర్తి నియోజకవర్గ రైతులకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అందించాలనే లక్ష్యంతో ఆయన అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆయన కృషి ఫలితంగానే గోదావరి జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీసుకువచ్చారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో కలిసి వెలిశాల వద్ద గోదావరి జలాలకు పూజలు చేయడం ఆయన చిరస్మరణీయ కృషికి నిదర్శనం.

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తన చివరి ఎన్నికల్లో (2014, 2018, 2023) వరుసగా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన తర్వాత అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు.

ఆయన మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భౌతికకాయాన్ని సందర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ సంతాపం ప్రకటించారు. దామన్న లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఆయన సేవలు ప్రజలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?
Kavitha : సీతానవమి రోజు కవిత కొత్త పార్టీ ఆవిర్భావం! సవాళ్లు దాటుకుని సత్తాచాటుతారా? ఈ ముహూర్తం వెనుక రహస్యమేంటి?

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Embed widget