News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Krishna River: వర్షాలు లేక కృష్ణమ్మ వెలవెల, తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి నిల్వ

Krishna River: పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడంతో కృష్ణా నదిలో నీరు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ఉంది.

FOLLOW US: 
Share:

Krishna River: నదిలో నీటి ప్రవాహం లేక కృష్ణమ్మ వెలవెలబోతోంది. పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవడంతో.. నదిలో నీటి ప్రవాహం లేదు. మరో నాలుగైదు రోజులు వానలు కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. తాగు, సాగునీటిపరంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు అత్యంత కీలకమైన నాగార్జున సాగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సాగరే తాగునీటికి ప్రధాన వనరు కావడంతో, సాగర్ లో నీరు లేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునేందుకు కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా.. ప్రస్తుతం ఈ జలాశయంలో 518 అడుగుల వద్ద నీటి నిల్వ ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 145.83 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు శ్రీశైలం నుంచి 32 టీఎంసీలు రావడంతో ఈ మాత్రం నిల్వ ఉంది. లేదంటే పరిస్థితి మరింత దారణంగా ఉండేదని అధికారులు అంటున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు.. గత సంవత్సరం ఈ రోజుకు 584.90 అడుగుల స్థాయిలో నీరు ఉండేది. అంటే 297.15 టీఎంసీల నీరు ఉంది. 

267 టీఎంసీల మేర ఖాళీ

కర్ణాటకలో మొన్నటి వరకు ఓ మోస్తరు వానలు కురిశాయి. దాంతో ఆలమట్టి నుంచి నారాయణపూర్ కు 98.90 టీఎంసీలను విడుదల చేశారు. నారాయణపూర్ నుంచి జూరాల జలాశయానికి 100 టీఎంసీల నీరు వచ్చింది. జూరాలతో పాటు తుంగభద్ర పరీవాహకం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 100.77 టీఎంసీలు మాత్రమే వచ్చాయి. శ్రీశైలం జలాశయంలో మంగళవారం నాటికి 885 అడుగులకు గాను 862.90 అడుగుల నీటిమట్టం ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు 115 టీఎంసీల నీరు ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు నిండేందుకు చేరువ కావడం ప్రస్తుతం కొంతలో కొంత ఊరట కలిగిస్తోంది. ఈ నదీ పరీవాహకంలో వర్షాలు కురిస్తే ఇక దిగువకు నీటిని విడుదల చేస్తారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడానికి మరో 100 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్ర సర్కారు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. దీని వల్ల రోజుు 12 వేల నుంచి 27 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నాగార్జున సాగర్ జలాశయం వైపు వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ వైపు 14 వేల క్యూసెక్కులను కాల్వలకు వదులుతున్నారు. కృష్ణా నదిపై ఉన్న ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ లు రెండూ కలిపి మొత్తంగా 267 టీఎంసీల మేర ఖాళీ ఉందని అధికారులు చెబుతున్నారు.

Also Read: Airport Metro: వచ్చే నెలలో ఎయిర్‌పోర్టు మెట్రో పనులు, 36 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు!

శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 115 టీఎంసీల నీరు ఉంది. గతేడాది ఈ సమయానికి 213.40 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 145.83 టీఎంసీల నిల్వ ఉంది. గతేడాది ఈ సమయానికి 297.15 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

Published at : 16 Aug 2023 12:05 PM (IST) Tags: Krishna River No Heavy Rains Krishna Catchment Area Water Storage Drinking Purposes

ఇవి కూడా చూడండి

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

రెవెన్యూ డివిజన్‌గా చండూరు, మండలం కేంద్రం మహ్మద్ నగర్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రెవెన్యూ డివిజన్‌గా చండూరు, మండలం కేంద్రం మహ్మద్ నగర్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !