Nalgonda Crime News: నల్గొండ జిల్లాలో దారుణం- ప్రియుడి భార్యకు నిప్పంటి చంపేసిన ప్రియురాలు
Nalgonda Crime News: ప్రియుడితో ప్రశాంతంగా ఉండేందుకు అతని భార్య అడ్డంగా ఉందని భావించిన ప్రియురాలి ఆమెను హత్య చేసింది. నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘోరం కలకలం రేపుతోంది.

Nalgonda Crime News: నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చిన్నారిని గాయపరిచింది.వెలుగులోకి వచ్చిన ఈ హత్య కేసు స్థానికంగా సంచలనంగా మారింది.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో ఈ దారుణం జరిగింది. నగేష్ యాదవ్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ గొడవలకు నగేష్ భార్య కారణమని భావించిన సుజాత ఆమెను చంపేయాలన నిర్ణయించింది. ఆమె ఇంట్లో ఉన్న టైంలో నగేష్ భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించేసింది. ఈ మంటల్లో ఆమె కాలి గాయాలపాలైంది. అక్కడికక్కడే చనిపోయింది. ఆమె పక్కనే ఉన్న ఆరునెలల బాబు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
వికారాబాద్ జిల్లాల దారుణం
వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం పరిధిలోని బిల్కల్ గ్రామంలో మరో దారణం జరిగింది. చేరాల నర్సింలు హత్యకు గురైన విధానం కలకలం రేపుతోంది. ఇందులో కూడా అక్రమ సంబంధమే హత్యకు కారణమైంది. చేరాల నర్సింలు తన పొలం వద్ద రక్తపు మడుగులో, విగతజీవిగా కనిపించాడు. స్థానిక రైతు ఒకరు పొలానికి వెళ్లిన సమయంలో ఈ భయానక దృశ్యాన్ని చూశాడు. అనంతరం పోలీసులకు కుటుంబానికి సమాచారం అందించాడు. నర్సింలు వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ తన భార్య వసంత, కుమారులు సాయికృష్ణ, శ్రీహరిని పోషించుకునేవాడు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మృతుడు నర్సింలకు బిల్కల్ గ్రామానికి చెందిన బేగరి నర్సమ్మ అనే మహిళతో సంబంధం ఉంది. దీనిపై చాలా కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఇవి ఎక్కువయ్యే సరికి మూడు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఆమె మాత్రం ఆయనకు ఫోన్ చేస్తూ కలిసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇలా చేయడంతో నర్సింల భార్య ఆమెకో గొడవ పెట్టుకుంది. అయితే ప్రతిగా నిన్ను చంపేసి నీ భర్తతో కాపురం చేస్తానంటూ సవాల్ వసంతతో సవాల్ చేసింది. గొడవలు జరిగిన తర్వాత గురువారం రాత్రి 8 గంటలకు నర్సింలు పోలానికి వెళ్లాడు. తిరిగి రాలేదు. ఫ్యామిలీ కంగారు పడింది. చివరకు నర్సింలు తెల్లవారి శవమై కనిపించాడు. కిరాతకంగా హత్య చేశారు. వసంత ఫిర్యాదు మేరకు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. నర్సమ్మ, ఆమె భర్త పాపయ్యతోపాటు మరికొందరు హత్య అనుమానిస్తున్నారు.























