అన్వేషించండి

Munugode Bypoll: కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్షతో ఎదిగి వెన్నుపోటు రాజకీయాలా: రేవంత్ రెడ్డి ఫైర్

TPCC Chief Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల విషయంలో కాస్త సీరియస్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన భిక్షతో ఎదిగిన నేతలు పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

Munugode ByElections: మునుగోడు ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో విభేదాలను బయట పెడుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వచ్చిన ఉప ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దిక్సూచిగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదంటూ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందే కొందరు కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ అండగా ఉంటాడని, ఆయనకు మద్దతు తెలపాలంటూ ఆడియో టేపులు కలకలం రేపాయి. ఈ వరుస ఘటనలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy ) మునుగోడు ఉప ఎన్నికల విషయంలో కాస్త సీరియస్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన భిక్షతో ఎదిగిన నేతలు నేడు పార్టీకి వెన్నుపోటు పొడిచారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

దుష్ట శక్తులు ఏకమయ్యాయి..
కొందరు నేతలు పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఈ మేరకు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. పార్టీ విజయం కోసం కాంగ్రెస్‌ శ్రేణులంతా మునుగోడుకు తరలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు. దుష్టశక్తులన్నీ ఏకమై కాంగ్రెస్‌ను ఒంటరి చేయాలనుకుంటున్నాయని, ఇక కాంగ్రెస్ శ్రేణులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అంతం చేయాలని కేంద్రంలోని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని పార్టీ శ్రేణులు ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ఎన్నికల కమిషన్, ఈడీ, సీఆర్పీఎఫ్ లను దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. మరోవైపు అధికార టీఆర్ఎస్ నేతలు, మంత్రులు పోలీసులను వినియోగించుకుని ప్రతిపక్ష పార్టీల నేతల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. యాదగిరి గుట్ట నరసింహస్వామి దేవస్థానాన్ని సైతం రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదన్నారు. 

ఆడబిడ్డపై రాళ్ల రాడులా చేస్తారా.. !
ఎన్నికలు జరుగుతుంటే పోరాడి విజయం సాధించాలి కానీ ఆడబిడ్డ అని కూడా చూడకుండా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు పాల్పడటం మీ రాజకీయమా అని ప్రశ్నించారు రేవంత్‌. కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీకి పార్టీలో ఎదిగిన నేతలు ద్రోహం చేస్తుంటే వదిలేద్దామా? అని పార్టీ శ్రేణులను అడిగారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపళంగా మునుగోడుకు కదలి రావాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా కలిసి కదం తొక్కుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల కోసం మునుగోడులో ఎదురు చూస్తుంటానని రేవంత్‌ రెడ్డి అన్నారు.

పీసీసీ చీఫ్ అయినప్పటినుంచీ పార్టీలో తనకు మద్దతు కరువైందని రేవంత్ రెడ్డి ఇటీవల కంటతడి పెట్టుకున్నారు. మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించేందుకు సొంత పార్టీ నేతలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి తనను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించడమే కొందరు లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి మునుగోడులో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget