అన్వేషించండి

మునుగోడు ఉపఎన్నిక కేసీఆర్‌కు అసలైన పరీక్ష- మరి ప్రిపరేషన్ ఎలా ఉంది?

నిన్నటి వరకు ఒక లెక్క నిన్నటి నుంచి ఒక లెక్క. బీఆర్‌ఎస్‌ వచ్చిందని చెప్పండి అంటున్నారు కేసీఆర్. మునుగోడు ఉపఎన్నికలపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారట. ఇకపై ప్రత్యర్థులకు దబిడిదిబిడే అంటున్నాయి పార్టీ వర్గాలు.

తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కెసిఆర్‌ పార్టీ మునుగోడు ఉపఎన్నికలో ఎలాంటి ఫలితం అందుకుంటుంది. విపక్షాలు విమర్శలకు తగ్గట్టు ప్రజల తీర్పు ఉంటుందా లేదంటే కెసిఆర్‌ వెంటే మరోసారి ప్రజలు ఉంటారా ? ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతోంది.

టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌కి పార్టీ పేరు మారుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టిన కెసిఆర్‌ ఇప్పటి నుంచి దేశ రాజకీయాలపైనా కన్నేయాల్సిందే ! 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేయాలంటే ఇప్పటి నుంచే దేశరాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కెసిఆర్‌ జాతీయపార్టీపై ఎప్పటిలాగానే విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ పరిస్థితుల్లో మునుగోడు ఉపఎన్నిక అంశం రాజకీయ వర్గాల్లో హైలెట్‌ అవుతోంది.

నిన్నటి వరకు ఈ ఉపఎన్నిక గురించి కెసిఆర్‌ పెద్దగా శ్రద్ధ చూపలేదన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన చూపంతా మునుగోడుపైనే పడింది. ఇప్పటి వరకు జరిగిన ఏ ఉపఎన్నికపైనా చూపని శ్రద్ధని ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పటికే మంత్రి జగదీష్‌తో పాటు జిల్లా నేతలకు మునుగోడు ఉపఎన్నిక టాస్క్‌  అప్పజెప్పిన కెసిఆర్‌ ఇప్పుడు మరింత మందిని రంగంలోకి దింపారు. కీలక నేతలతో పాటు జిల్లా, నియోజకవర్గంపై పట్టున్న స్థానిక నేతలు, కార్యకర్తలకు ఉపఎన్నిక బాధ్యతలను అప్పజెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మునుగోడు ఉపఎన్నిక బరిలో ఉన్నారు. ఇంకా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. రేపో మాపో గులాబీ పార్టీ అభ్యర్థిని కెసిఆర్‌ ప్రకటించడంతోపాటు గెలుపు వ్యూహాలను అమలు పరచబోతున్నారని ఇన్‌ సైడ్‌ టాక్‌.

నిన్నటివరకు మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుపై కెసిఆర్‌ అంతగా ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఈ విజయం తప్పనిసరైందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. జాతీయపార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ మునుగోడు ఉపఎన్నికను రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమిఫైనల్‌గా భావిస్తున్నాయి. కానీ కెసిఆర్‌కి మాత్రం ఈ ఉపఎన్నిక విజయం భారత్‌ రాష్ట్ర సమితికి ఊపిరినిచ్చేదిగా అంచనా వేస్తున్నారు. పార్టీ పేరు మార్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉపఎన్నిక కాబట్టి ఈ ఫలితం తప్పకుండా గులాబీదళానికి కీలకమని ఆపార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. అందుకే కెసిఆర్‌ తన బలం, బలగాన్నంతా మునుగోడుకి తరలిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

నవంబర్‌ 3న ఉపఎన్నిక 6వ తేదీన జరిగే కౌంటింగ్‌తో మునుగోడులో ఎవరిది గెలిచేది తేలిపోతుంది. అంతేకాదు ఈ గెలుపుతో ప్రజల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో కూడా తెలిసిపోతుందంటున్నారు రాజకీయవిశ్లేషకులు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget