అన్వేషించండి

నల్లగొండలో చేరికల్ని అడ్డుకుంటున్న కోమటిరెడ్డి - కొత్త నేతలొద్దని వాదన !

నల్లగొండ నుంచి ఎవర్నీ పార్టీలో చేర్చుకోవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకమాండ్‌కు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడున్న అభ్యర్థులతోనే అన్ని సీట్లు గెలుస్తామంటున్నారు.


Telangana Congress :   కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. ఆసక్తి చూపిన నేతలందర్నీ చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ అవుతుందనుకున్న నేతల్ని తానే సంప్రదించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నల్లగొండ జిల్లా నుంచి  పార్టీలో చేరాలనుకుంటున్న నేతల విషయంలో మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డం పడుతున్నారు. ఇంకెవర్నీ పార్టీలో చేర్చుకోవద్దని ఆయన స్పష్టం చేస్తున్నారు.  ఇప్పటికే ఓవర్లోడ్ అయింది.. కాంగ్రెస్‌ పార్టీలో నేతలు కొత్తగా చేరాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి వాదిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కొత్తగా నాయకులు చేరాల్సిన అవసరం లేదని, ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలకు గాను 12 ఎమ్మెల్యే అభ్యర్దులు ఇప్పటికే రెడీగా ఉన్నారని అన్నారు.  నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కోమటిరెడ్డి వ్యతిరేకిస్తూండటంతో ఆగిపోయింది.                                  

గతంలోనూ చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. తనకు తెలియకుండా నల్లగొండ జిల్లాలో చేరికలు ఉంటున్నాయని... తన ప్రాధాన్యం తగ్గించే కుట్ర చేస్తున్నారని ఆయన గతంలో ఆరోపించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఆ జిల్లాల ముఖ్య నేతలతో చర్చించిన తర్వాతే చేరికలు ఉంటాయని హామీ ఇచ్చారు. తాజాగా.. కోమటిరెడ్డి ఇంట్లో చేరికల అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది.  కాంగ్రెస్ కీలక నేతల సమావేశంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ 2.0పై ప్రధానంగా చర్చించారు. 

పార్టీలోకి భారీగా చేరికలు ఉండేలా టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరనున్నారు. గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి తదితరులు  ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. బీఆర్‌ఎస్ అసంతృప్త నేతలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితర నేతలతో చర్చలు జరుగుతుండగా.. త్వరలో వీరంతా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.                       

అయితే నల్లగొండ జిల్లా చేరికల విషయంపై మాత్రం కోమటిరెడ్డి అంత ఆసక్తిగా లేరు. తనను కాదని ఎవర్నీ చేర్చుకోవద్దని ఆయన అంటున్నారు. ఈ అంశంపై ఇతర సీనియర్ నేతలు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని చెబుతున్నారు.                        

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget