అన్వేషించండి

Khammam Politics: సత్తుపల్లి కాంగ్రెస్‌లో డబుల్‌ గేమ్‌ - టికెట్ కోసం మాజీ మంత్రి సంబానీ, కోటూరి మధ్య పోటీ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. టిక్కెట్‌ వేటలో ఇద్దరు నేతల మధ్య పెరిగిన పోటీ కాస్తా రోడ్డున పడటంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు.

గతంలో కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే టిక్కెట్‌ వేటలో ఇద్దరు నేతల మధ్య పెరిగిన పోటీ కాస్తా రోడ్డున పడటంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, టీపీసీసీ అధికార ప్రతినిధి కొటూరి మానవతారాయ్‌లు నియోజకవర్గంలో పైచేయి సాధించేందుకు పోటీ పడుతున్నారు.
సత్తుపల్లి నియోజకవర్గం గతంలో కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉండేది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించడంతో ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీకి కీలకమైన స్థానం ఇది. టీడీపీ ఆవిర్భావం అనంతరం ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీల మధ్యే ఇక్కడ పోటీ ఉండేది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మూడు సార్లు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిథ్యం వహించారు. అయితే జలగం వెంగళరావు తనయులు జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావులు సత్తుపల్లి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.
వైసీపీతో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం..
సత్తుపల్లి.. ఏపీకి సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ ఆంధ్రా పార్టీ, నేతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉన్న ఈ ప్రాంతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌ క్యాడర్‌ ఎక్కువ మంది ఆ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వైసీపీకి చెందిన వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ తరుఫున ఇక్కడ మూడు సార్లు పోటీ చేసిన మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్‌ ఓటమిపాలయ్యారు. అయితే సత్తుపల్లి కేంద్రంగానే తన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదే నియోజకవర్గం కల్లూరుకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్‌ కూడా సత్తుపల్లిపైనే ఫోకస్ చేయడంతో ఇప్పుడు రెండు వర్గాలుగా కాంగ్రెస్‌ పోరు నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు రైతు రచ్చబండ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై చేసిన నిరసన దీక్షల సందర్భంగా రెండు శిబిరాలను ఏర్పాటు చేసి పోటాపోటీగా దీక్షలు చేపడుతున్నారు. ఒకప్పుడు పార్టీకి బలమైన ప్రాంతంగా ఉన్న సత్తుపల్లిలో పునర్ వైభవాన్ని తెప్పించే క్రమంలో నాయకుల మధ్య వర్గపోరు పెరగడం, ఈ విషయంపై రాష్ట్ర నాయకత్వం కూడా చొరవతీసుకోకపోవడంతో సత్తుపల్లిలో కాంగ్రెస్‌ పునర్‌వైభవానికి మార్గాలు కనిపించడం లేదు. భవిష్యత్‌లో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ వర్గాలు ఏకతాటిపైకి వస్తేనే ఇది సాధ్యమయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Congress Internal Fight : టీకాంగ్రెస్ లో చిచ్చురేపిన యశ్వంత్ సిన్హా పర్యటన, మళ్లీ రేవంత్ రెడ్డి వర్సెస్ జగ్గారెడ్డి

Also Read: Yashwant Sinha About KCR: దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి, తెలంగాణ సీఎంపై యశ్వంత్ సిన్హా ప్రశంసలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GVMC Council Meeting: విశాఖ మేయర్ పీఠం కోసం అర్ధరాత్రి నరాలు తెగే ఉత్కంఠ! 500 మంది పోలీసులతో బందోబస్తు, అసలేం జరిగిందంటే
విశాఖ మేయర్ పీఠం కోసం అర్ధరాత్రి నరాలు తెగే ఉత్కంఠ! 500 మంది పోలీసులతో బందోబస్తు, అసలేం జరిగిందంటే
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tim David 50* vs PBKS IPL 2025 | పీకల్లోతు కష్టాల్లో నుంచి RCB ని బయటపడేసిన టిమ్ డేవిడ్RCB vs PBKS Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamRohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GVMC Council Meeting: విశాఖ మేయర్ పీఠం కోసం అర్ధరాత్రి నరాలు తెగే ఉత్కంఠ! 500 మంది పోలీసులతో బందోబస్తు, అసలేం జరిగిందంటే
విశాఖ మేయర్ పీఠం కోసం అర్ధరాత్రి నరాలు తెగే ఉత్కంఠ! 500 మంది పోలీసులతో బందోబస్తు, అసలేం జరిగిందంటే
Bhu Bharathi Act: ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
ఆధార్ లాగే త్వరలో భూధార్ నెంబర్, పైరవీలు అవసరం లేదు.. భూభారతి పోర్టల్‌లో పరిష్కారాలు
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
AP 10th Class Results: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది, ఈసారి ఎంతో ప్రత్యేకం
PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని
Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్, షూటింగ్ అప్పుడే స్టార్ట్!
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త మూవీపై బిగ్ అప్ డేట్, షూటింగ్ అప్పుడే స్టార్ట్!
Adultery Case: భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
భార్య వివాహేతర సంబంధం నేరం కాదు- ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పుతో ప్రియుడికి ఊరట
Ramya Moksha Kancharla: అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
AP DSC 2025: ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
ఏప్రిల్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్!
Embed widget