అన్వేషించండి

మునుగోడు ఉపఎన్నికపై ఈసీ స్పెషల్ ఫోకస్ - రంగంలోకి పరిశీలకులు

Munugodu By-Election: మునుగోడు ఉపఎన్నికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈసీ ముగ్గురు పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకునితోపాటు పోలీసు, వ్యయ పరీశీలకులను రంగంలోకి దించింది. 

Munugodu By-Election: మునుగోడు ఉపఎన్నికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉపఎన్నిక కోసం ముగ్గురు పరిశీలకులను రంగంలోకి దించింది. సాధారణ పరిశీలకునితోపాటు పోలీసు పరిశీలకుడు, వ్యయ పరిశీలకులను నియమించింది. సాధారణ పరిశీలకునిగా మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్​ను ఈసీ నియమించింది. ఈయన శుక్రవారం అంటే 14వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు మునుగోడులో బాధ్యతలు నిర్వర్తిస్తారు. 

పోలీసు పరిశీలకునిగా ఛత్తీస్​గఢ్​కు చెందిన ఐపీఎస్ అధికారి మయాంక్ శ్రీవాస్తవను నియమించారు. పోలీసు పరిశీలకుడు ఈ నెల 14 వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు విధుల్లో ఉంటారు. వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారిణి సమతా ముళ్లమూడిని నియమించారు. వ్యయ పరిశీలకులు ఈ నెల 13వ తేదీ నుంచి పోలింగ్ తేదీ అయిన నవంబర్ 3వ తేదీ వరకు మునుగోడు ఉపఎన్నికక కోసం విధులు నిర్వర్తిస్తారు.

మొదటి రోజు నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల నేతలు..

యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మొదటి సెట్ నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. వీరందరి మధ్య రాజగోపాల్ రెడ్డి చండూరు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి 3 సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా సోమవారం నామినేషన్ వేశారు. అలాగే ఐదుగురు స్వతంత్య్ర అభ్యర్థులు, యుగ తులసి పార్టీ తరఫున మరొకరు నామినేషన్ వేశారు. దీంతో మూడో రోజుల్లో దాఖలైన మొత్తం నామినేషన్ల సంఖ్య 23కు చేరుకుంది.

ప్రచార దూకుడు పంచిన పార్టీలు..

సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, ఉపఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్‌ పార్టీ, తెలంగాణలో తన సత్తా చాటేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ భావిస్తున్నాయి. మునుగోడులో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు మూడు పార్టీల నేతలు సమాయత్తమయ్యారు. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు మునుగోడులు ఉంటూ క్యాంపెయినింగ్‌ చేస్తున్నారు. 

మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ ను ఈనెల 3వ తేదీన విడుదల చేశారు. అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరించారు. వచ్చే నెల 3వ తీదన పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6వ తేదీన కౌంటింగ్ ఉండనుంది. మునుగోడుతోపాటు దేశంలో ఖాళీ అయిన స్థానాల్లో ఇదే తేదీల్లో ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మోకమా, గోపల్ గంజ్, హరియాణాలోని ఆదమ్ పూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రన్నథ్, ఒడిశాలోని ధామ్ నగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Rythu Bharosa Funds Release 2026:తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్- రైతు భరోసా నిధులు విడుదల- స్టాటస్‌ ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్- రైతు భరోసా నిధులు విడుదల- స్టాటస్‌ ఇలా చెక్ చేసుకోండి!
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
ధరావత్ నిఖిల్ పరువుహత్య.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget