అన్వేషించండి

Nagarjunasagar Buddhavanam : తెలంగాణలో మరో టూరిస్ట్ డెస్టినేషన్, ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం, మే 14న ప్రారంభోత్సవం

Nagarjunasagar Buddhavanam : ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం తెలంగాణలో ప్రారంభం కాబోతుంది. నాగార్జున సాగర్ వద్ద 274 ఎకరాల్లో సుమారు రూ.100 కోట్లతో అతిపెద్ద బుద్ధవనం నిర్మించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Nagarjunasagar Buddhavanam : నాగార్జున సాగర్ లో 274 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న, ఆసియా ఖండంలోనే అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్టును మే 14న రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి విశిష్ట అతిథిలుగా, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

Nagarjunasagar Buddhavanam : తెలంగాణలో మరో టూరిస్ట్ డెస్టినేషన్, ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం, మే 14న ప్రారంభోత్సవం

ఆసియాలోనే అతిపెద్ది బౌద్ధవనం 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో 274 ఎకరాల్లో సుమారు 100 కోట్ల రూపాయలతో ఆసియాలోనే అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించామన్నారు. బుద్ధుడు తర్వాత మరో బుద్ధుడిగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నా ఆచార్య నాగార్జునుడు 2000 వేల సంవత్సరాల క్రితం గడిపిన ప్రదేశంగా, వారు స్థాపించిన  విజయపురి విశ్వవిద్యాలయం, చరిత్ర ఆధారంగా బుద్ధవనం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సూచనలతో తెలంగాణ ప్రభుత్వం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా బుద్ధవనం నిర్మాణం పూర్తిచేశామన్నారు. మే 14న మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామన్నారు. ఈ బుద్ధవనం ప్రాజెక్టు దేశంలోనే విలక్షణమైన, అతిపెద్ద బౌద్ధ వారసత్వ పర్యాటక ఆకర్షణగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 

పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు

బుద్ధవనం ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతకవనం(బుద్ధ సత్వ పార్క్), ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం, బుద్ధిజం టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్, హాస్పిటాలిస్, వెల్నెస్ సెంటర్ నిర్మాణాలను  ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ బుద్ధవనంలో దేశ, విదేశాల్లోని 40 ప్రసిద్ధ జాతక కథ శిల్పాలున్నామన్నారు. అంతేకాకుండా మన దేశంతో పాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమూనాలు ఉన్నాయన్నారు. 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసంతో చుట్టూ ప్రదాక్షణాల పథంతో బౌద్ధ స్థూపం, చుట్టూ వేలకొలది శిల్పాలను నిర్మించమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రపంచ స్థాయిలో బుద్దిస్ట్ ఆధ్యాత్మిక పర్యాటకులను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. బుద్ధిజంలో తెలిపిన విధంగా బుద్ధవనం ప్రాజెక్టులో చేపట్టామన్నారు. బుద్ధుడు జీవించి ఉన్న కాలం నాటి నుంచి తెలంగాణ ప్రాంతంలో బుద్ధిజం నెలకొని ఉందన్నారు. బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణకు, భవిష్యత్ తరాలకు బౌద్ధ చరిత్ర తెలియజెప్పేలా ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget