అన్వేషించండి

Nagarjuna Sagar: సాగర్ వద్ద కొనసాగుతున్న టెన్షన్, ప్రాజెక్టు గేట్లు ఏపీ పోలీసులు స్వాధీనం!

ఓ వైపు తెలంగాణలో ఎన్నికల పోలింగ్ నడుస్తుంటే మరోవైపు నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ నీటి విడుదల అంశం మరోసారి తెలంగాణ పోలింగ్ రోజున రచ్చరచ్చగా మారింది.

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్త వాతావారణం కొనసాగుతోంది. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటాక అక్రమంగా చొరబడి డ్యామ్‌కు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అడ్డుకున్న డ్యామ్‌ ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేసి మొబైల్‌ ఫోన్లను, డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. 13వ గేట్‌ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  రెండు రాష్ట్రాలకు చెందిన వందల మంది పోలీసులు అక్కడ భారీగా మోహరించడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డ్యామ్ పై ఉన్న పరిస్థితిలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. 

Also Read: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

అంబటి రాంబాబు వివాదాస్పద ట్వీట్
ఇంత ఉద్రిక్తత నడుస్తున్న సమయంలో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ అంశంపై ట్వీట్ చేశారు.  ‘తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కి నేడు నీరు విడుదల చేయనున్నాము!’ అంటూ సంచలన కామెంట్ పెట్టారు.

వ్యూహాత్మక వివాదం- రేవంత్ రెడ్డి
ఈ అంశంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలింగ్‌కు ముందు రోజు కావాలనే సెంటిమెంట్‌ను రగిల్చేందుకే వ్యుహాత్మకంగా వివాదం సృష్టించారని బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం నాగార్జున సాగర్‌ వద్ద నెలకొన్న ఉద్రిక్తతపై మాట్లాడారు. 

ఇదంతా కేసీఆర్ కుట్ర - కోమటిరెడ్డి
ఈ ఘటనపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలింగ్ రోజునే ఈ ఘటన సంభవించడంతో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం పై అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా కెసిఆర్ చేస్తున్న కుట్ర అన్నారు. ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ డ్రామాకు తెరలేపిందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తెలుగు ప్రజలకు అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వీళ్లతో పాటు బీజేపీ కూడా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈ ముగ్గురూ కలిసి పోలింగ్ వేళ రాజకీయ లబ్ధిపొందేలా నాగార్జున సాగర్ వద్ద అర్ధరాత్రి హంగామా సృష్టించారని మండిపడ్డారు. నీటి వివాదం కొత్తది కాదని.. కానీ, రాజకీయ లబ్ధి కోసమే పోలింగ్‌కు ముందు రోజు వివాదం క్రియేట్ చేశారని అన్నారు. కేవలం ఇది తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రే అని తేల్చి చెప్పారు. రాజకీయ కుట్రలను తెలుగు ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు నారాయణ.

నేతలు తొందరపడొద్దు -వికాస్ రాజ్
ఈ విషయంపై స్పందించిన  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్..రాజకీయ నాయకులు తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. నేతలెవరూ కూడ  నిబంధనలను అతిక్రమించవద్దన్నారు. తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందన్నారు.

మొత్తంగా తెలంగాణ పోలీసుల కంట్రోల్లో ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్ కి ఏపీ పోలీసులు వెళ్లడం, అది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల జరుగుతున్న రోజునే కావడంతో అక్కడ ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వ చర్యలపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి లబ్ది చేకూర్చేందుకే సాగర్ వివాదాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget