అన్వేషించండి

Revanth Reddy: ఆ ఆలోచన పోకపోతే యువత సీఎం నాలుక కోస్తారు.. అందంతా బీజేపీ ప్లానే..: రేవంత్ రెడ్డి

పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ 2022తో శ్రీమంతులకే ప్రయోజనం ఉందని, పేదలకు ఎలాంటి లాభం లేదని రేవంత్‌ విమర్శించారు.

పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను గంటన్నరపాటు ప్రసంగించి ప్రవేశపెడితే.. దాని గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటలపాటు ఏక పాత్రాభినయం చేశారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన ఒక కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారని అన్నారు. నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ గురించి నీచంగా, అత్యంత జుగుప్సాకరంగా కేసీఆర్ మాట్లాడారని రేవంత్ విమర్శించారు. పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ బుధవారం మీడియాతో మాట్లాడారు.

కేంద్ర బడ్జెట్‌ 2022తో శ్రీమంతులకే ప్రయోజనం ఉందని, పేదలకు, మధ్యతరగతి వారికి ఎలాంటి లాభం లేదని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌పై నిన్న సీఎం కేసీఆర్‌ ప్రెస్ మీట్‌లో చిత్రవిచిత్రంగా మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్‌ మాటలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేసీఆర్‌ అడగనేలేదని అన్నారు. విభజన చట్టం అంశాలు, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఎన్టీపీసీ యూనిట్, రైల్వే లైన్లు, జాతీయ రహదారుల విషయం ఏదీ మాట్లాడలేదని అన్నారు.

బీజేపీ ఆలోచనే కేసీఆర్ మాట ద్వారా..
కొత్త రాజ్యాంగం తేవాలనే ఆలోచన బీజేపీ కుట్ర అని.. వారి ఆలోచనను కేసీఆర్‌ ద్వారా బయటకు వదిలారని రేవంత్ విమర్శించారు. రాజ్యాంగం రద్దు చేయాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తోందని.. కేసీఆర్‌ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీదికి తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. భూస్వాములు, పెట్టుబడిదారుల కోసం కొత్త రాజ్యాంగం కోరుతున్నారా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ యోచన అని అన్నారు. 

జనం నాలుక కోస్తారు: రేవంత్
సీఎం వ్యాఖ్యలకు నిరసనగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్‌లో నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ ఆలోచనను ఉపసంహరించుకొకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కోస్తారని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. 

కేటీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ..
అంతకుముందు రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ‘‘ఎన్నికల సమయంలో హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కానీ కనీసం కాలుష్యం లేని నగరంగా కూడా చేయలేకపోయారు. విశ్వనగరం సంగతి పక్కన ఉంచితే జవహర్‌నగర్‌ డంపింగ్ యార్డ్ విషయంలో కూడా హామీ నెరవేరలేదు. మూడేళ్ల క్రితం ఇక్కడి డంపింగ్‌ యార్డ్‌ మారుస్తామని చెప్పిన హామీ ఇంత వరకు నెరవేర్చలేదు. నా పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల విష వాయువులు వెలువడి ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని మీకు జాయింట్ యాక్షన్‌ కమిటీ అనేక సార్లు చెప్పింది. ఇప్పటికైనా డంప్ యార్డ్‌ను తరలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి’’ అని రేవంత్‌ లేఖలో పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ

వీడియోలు

BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Stock Market on 24 March: యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
యుద్ధానికి ట్రంప్ బ్రేక్.. భారత స్టాక్ మార్కెట్ జోరు.. రికవరీ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 50
Falls Sick or Dies on a Plane : విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
విమానంలో ప్రయాణికుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఎయిర్‌లైన్ పరిహారం ఇస్తుందా?
Vijayawada Crime News: విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
విజయవాడలో ఉగ్రమూలాలు! పాక్‌ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్న ముగ్గురు యువకుల అరెస్ట్!
Embed widget