అన్వేషించండి

దిల్లీ స్కాం ఆరోపణలపై కవిత న్యాయపోరాటం- బీజేపీ నాయకులపై పరువు నష్టం దావా !

దిల్లీ లిక్కర్ స్కాంకి తనకు ఎలాంటి సంబధం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కక్ష్య పూరితంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని అన్నారు.

ఢిల్లీ మద్యం విధానంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఢిల్లీ బీజేపీ నేతలపై పరువు నష్ట దావా వేయనున్నాట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా కోర్టును అశ్రయించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరిపారు. 

నిరాధారంగా మాట్లాడడం ఆరోగ్యకర పద్ధతి కాదు..

దిల్లీ లిక్కర్ స్కాంకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కావాలనే బీజేపీ నాయకులు బట్ట కాల్చి తమపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కక్ష్యపూరిత రాజకీయాలు చేసే కాషాయ దళం ఏది పడితే అది మాట్లాడుదోందని వివరించారు. సీఎం కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే... కేసీఆర్ ఆగం అయి వెనక్కి తగ్గుతారని బీజేపీ నాయకులు అనుకుంటున్నట్లు కవిత స్పష్టం చేశారు. కానీ అలాంటి వాటికి తాము అస్సలే భయపడం అని.. ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్నీ వ్యర్థమేనని వ్యాఖ్యానించారు.

నిరాధారంగా మాట్లాడటం ఆరోగ్యకరమైన పద్దతి కాదని హితవు పలికారు. తెలంగాణ కోసం ఉద్యమించిన అన్ని సంవత్సరాలలో, తమ కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేసినా, మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడ్డామన్నారు కవిత. భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని కవిత తెలిపారు. బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగా లేదని మండి పడ్డారు. దీన్ని ప్రజలంతా గమనించాలని అన్నారు కవిత.

అసలేమైందంటే...?

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. దిల్లీ ప్రభుత్వంలో కీ రోల్‌ పోషించే మనీష్‌ సిసోడియా ఇంట్లో సోదాలు కూడా జరిపింది. ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లోను షేక్ చేస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నేతలు ఇందులో భాగమై ఉన్నారంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేస్తోంది. 

కవితనే డీల్ కుదిర్చారంటూ కామెంట్లు..!

ఢిల్లీ మద్య పాలసీ రూపకల్పన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే జరిగిందని బీజేపీ నేతలు పర్వేశ్ సాహిబ్ సింగ్, మంజీందర్‌ సింగ్‌ సిర్సా బాంబు పేల్చారు. కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తూ సిర్సా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో అమలువుతున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన డీల్ ను సెట్ చేసింది కల్వకుంట్ల కవిత అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్స్ వేదికగా డీల్ జరిగిందన్నారు. తెలంగాణ కేసీఆర్ తరపున ఎమ్మెల్సీ కవిత.. లిక్కర్ మాఫియాకు, ఢిల్లీ గవర్నమెంట్ కు మధ్య డీల్ కుదిర్చారని తెలిపారు. ఇందుకోసం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల ముడుపులు కూడా అందాయంటూ పొలిటికల్ హీట్ రాజేశారు మాంజీందర్ సింగ్ సిర్సా.

ఒబెరాయ్ హోటల్‌లో సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెళ్ల కోసం బుక్ చేశాడని ఆరోపించారు సిర్సా. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ హైదరాబాద్‌ మధ్య తిరిగేవారన్నారు. ఈ ఫ్లైట్‌ను తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిందంటూ వివరించారు

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
Telangana Assembly Clash: అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!
అసెంబ్లీ ఘర్షణల రగడ - కాంగ్రెస్‌ది అతి రాజకీయమా? KTR పీఏ, పీఆర్వోల విచారణతో తిరగబడ్డ వ్యూహం!
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
భాద్రపద మాసంలో చలిమిడి దీపం ఏ రోజుల్లో వెలిగించాలి? ప్రాముఖ్యత ఏంటి?
భాద్రపద మాసంలో చలిమిడి దీపం ఏ రోజుల్లో వెలిగించాలి? ప్రాముఖ్యత ఏంటి?
Embed widget