అన్వేషించండి

దిల్లీ స్కాం ఆరోపణలపై కవిత న్యాయపోరాటం- బీజేపీ నాయకులపై పరువు నష్టం దావా !

దిల్లీ లిక్కర్ స్కాంకి తనకు ఎలాంటి సంబధం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కక్ష్య పూరితంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని అన్నారు.

ఢిల్లీ మద్యం విధానంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఢిల్లీ బీజేపీ నేతలపై పరువు నష్ట దావా వేయనున్నాట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా కోర్టును అశ్రయించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరిపారు. 

నిరాధారంగా మాట్లాడడం ఆరోగ్యకర పద్ధతి కాదు..

దిల్లీ లిక్కర్ స్కాంకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కావాలనే బీజేపీ నాయకులు బట్ట కాల్చి తమపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కక్ష్యపూరిత రాజకీయాలు చేసే కాషాయ దళం ఏది పడితే అది మాట్లాడుదోందని వివరించారు. సీఎం కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే... కేసీఆర్ ఆగం అయి వెనక్కి తగ్గుతారని బీజేపీ నాయకులు అనుకుంటున్నట్లు కవిత స్పష్టం చేశారు. కానీ అలాంటి వాటికి తాము అస్సలే భయపడం అని.. ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్నీ వ్యర్థమేనని వ్యాఖ్యానించారు.

నిరాధారంగా మాట్లాడటం ఆరోగ్యకరమైన పద్దతి కాదని హితవు పలికారు. తెలంగాణ కోసం ఉద్యమించిన అన్ని సంవత్సరాలలో, తమ కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేసినా, మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడ్డామన్నారు కవిత. భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని కవిత తెలిపారు. బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగా లేదని మండి పడ్డారు. దీన్ని ప్రజలంతా గమనించాలని అన్నారు కవిత.

అసలేమైందంటే...?

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై కొన్ని రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు నమోదు చేసింది. దిల్లీ ప్రభుత్వంలో కీ రోల్‌ పోషించే మనీష్‌ సిసోడియా ఇంట్లో సోదాలు కూడా జరిపింది. ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల్లోను షేక్ చేస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ నేతలు ఇందులో భాగమై ఉన్నారంటూ బీజేపీ సంచలన ఆరోపణలు చేస్తోంది. 

కవితనే డీల్ కుదిర్చారంటూ కామెంట్లు..!

ఢిల్లీ మద్య పాలసీ రూపకల్పన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే జరిగిందని బీజేపీ నేతలు పర్వేశ్ సాహిబ్ సింగ్, మంజీందర్‌ సింగ్‌ సిర్సా బాంబు పేల్చారు. కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తూ సిర్సా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో అమలువుతున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన డీల్ ను సెట్ చేసింది కల్వకుంట్ల కవిత అంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్స్ వేదికగా డీల్ జరిగిందన్నారు. తెలంగాణ కేసీఆర్ తరపున ఎమ్మెల్సీ కవిత.. లిక్కర్ మాఫియాకు, ఢిల్లీ గవర్నమెంట్ కు మధ్య డీల్ కుదిర్చారని తెలిపారు. ఇందుకోసం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల ముడుపులు కూడా అందాయంటూ పొలిటికల్ హీట్ రాజేశారు మాంజీందర్ సింగ్ సిర్సా.

ఒబెరాయ్ హోటల్‌లో సూట్‌ను తెలంగాణ మద్యం మాఫియాకు చెందిన వ్యక్తి ఆర్నెళ్ల కోసం బుక్ చేశాడని ఆరోపించారు సిర్సా. డీల్ జరిగినన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులు స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ హైదరాబాద్‌ మధ్య తిరిగేవారన్నారు. ఈ ఫ్లైట్‌ను తెలంగాణ మద్యం మాఫియా ఏర్పాటు చేసిందంటూ వివరించారు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS leaders rebellion against Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో ముదురుతున్న సెగ - పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు
హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో ముదురుతున్న సెగ - పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget