అన్వేషించండి

Tirumala Controversy: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన

MLA Anirudh Reddy News | తెలుగు రాష్ట్రాల వారికి తిరుమల అత్యంత పవిత్రమైన క్షేత్రం. కాగా, తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో తగిన గౌరవం లభించడం లేదని అనిరుధ్ రెడ్డి, బల్మూరి వెంకట్ ఆరోపించారు.

MLA Anirudh Reddy and MLC Balmoori Venkat visits Tirumala Temple | తిరుపతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. దీనిపై కొన్ని నెలల కిందట ఏపీ, తెలంగాణకు సంబంధించి పెద్దలు హైదరాబాద్ లో చర్చలు జరిపారు. కొన్ని విషయాల్లో క్లారిటీ రాగా, మరికొన్ని విషయాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే తిరుమల విషయంలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు అంత సంతోషంగా లేరని తెలుస్తోంది. తిరుమలకు వెళ్లిన తమకు తగిన గౌరవం దక్కడం లేదని, ప్రొటోకాల్ లాంటివి పాటించడం లేదని తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తమ సిఫార్సు లేఖలు తిరుమలలో చెల్లుబాటు కావడం లేదని, తమ వారికి కనీసం గదులు కూడా కేటాయించడం లేదని తెలంగాణ నేతలు ఆరోపించారు.

అసలేం జరిగిందంటే.. 
తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే తిరుమలలో తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు భద్రాచలం, యాదాద్రి ఆలయానికి వచ్చినప్పుడు వారికి ప్రొటోకాల్‌ అమలవుతోందన్నారు. కానీ  తెలంగాణ ఎమ్మెల్యేలపై తిరుమలలో ఎందుకు చిన్నచూపు అని అనిరుధ్ రెడ్డి, బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. 

Tirumala Controversy: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన

తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయమంటారా?

తిరుమలలో బాధతో మాట్లాడుతున్నామంటూ తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు చేస్తే కనీసం గదులు కూడా ఇవ్వరా అని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తనకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని చెబుతారు, కానీ తిరుమలలో తెలంగాణ నేతల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.  టీడీపీ, వైసీపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవచ్చా, ఏపీ ఎమ్మెల్యేలను రానివ్వకుండా  మేం కూడా అడ్డుకోవాలా అన్నారు. తెలంగాణ ఆలయాల్లో ఏపీ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్‌ లేకుండా ఉండాలన్నారు. దీని కోసం వచ్చే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని బల్మూరి వెంకట్, అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇప్పటికైనా ఏపీ సీఎం చంద్రబాబు తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ప్రొటోకాల్, వారి సిఫార్సు లేఖలపై స్పందించాలని బల్మూరి వెంకట్ కోరారు.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు

తిరమల లడ్డూ వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపడం తెలిసిందే. తిరుమల శ్రీవారి అత్యంత పవిత్ర ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పదే పదే తిరుమల లడ్డూ వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని, శ్రీ వెంకటేశ్వరస్వామికి అపచారం జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైసీపీ చేసిన తప్పుల్ని క్షమించి అందర్నీ చల్లగా చూడాలంటూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష సైతం చేశారు. అయితే ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో రాముడి పున: ప్రతిష్టకు తిరుమల నుంచి కల్తీ లడ్డూలు వెళ్లాయని వ్యాఖ్యానించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
Tirumala Controversy: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
ABP Southern Rising Summit 2024: దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ  - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్
దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియోDonald Trump works at McDonald's | స్వయంగా ఫ్రైంచ్ ఫ్రైస్ వేయించి అమ్మిన ట్రంప్ | ABP DesamOwaisi on Palestine: హమాస్ చీఫ్ మృతిపై ఒవైసీ ఆవేదనవయనాడ్‌లో ప్రియాంక గాంధీకి పోటీగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాక్, వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
Tirumala Controversy: తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు, ప్రోటోకాల్ పాటించడం లేదు- నేతల ఆవేదన
Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
ABP Southern Rising Summit 2024: దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ  - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్
దేశ పురోగతికి దక్షిణాది దిక్సూచీ - అక్టోబర్ 25న హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ సదరన్‌ రైజింగ్ సమ్మిట్
The Raja Saab : 'ది రాజా సాబ్' నుంచి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ వచ్చేసిందోచ్... కింగ్ ఆఫ్ స్వాగ్‌ - మరో కిక్ ఇచ్చే అప్డేట్ కూడా ఆన్ ది వే 
'ది రాజా సాబ్' నుంచి ప్రభాస్ బర్త్ డే స్పెషల్ వచ్చేసిందోచ్... కింగ్ ఆఫ్ స్వాగ్‌ - మరో కిక్ ఇచ్చే అప్డేట్ కూడా ఆన్ ది వే 
Dana Cyclone: ఏపీకి తుపాను 'దానా' ముప్పు - మత్స్యకారులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
ఏపీకి తుపాను 'దానా' ముప్పు - మత్స్యకారులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun : నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
OTT Movies : 'అన్ స్టాపబుల్' నుంచి 'సత్యం సుందరం' వరకు.. ఈ వారం ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. ఆ 5 మాత్రమే స్పెషల్ 
'అన్ స్టాపబుల్' నుంచి 'సత్యం సుందరం' వరకు.. ఈ వారం ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. ఆ 5 మాత్రమే స్పెషల్ 
Embed widget