అన్వేషించండి

Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీ, తెలంగాణలో వర్షాలు

Cyclone Remal: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు రాకముందే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత పది రోజులుగా ఏపీ, తెలంగాణల్లో ఏదో ఒక చోట వానలు పడుతూనే ఉన్నాయి. గత మూడు నెలల నుంచి భానుడి భగ భగలతో అల్లాడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం ఇచ్చాయి. తాజాగా మరో సారి తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది క్రమంగా బలపడి మే 25 నాటికి తుఫానుగా మారుతుందని, ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మే 26 నాటికి తీవ్ర తుఫానుగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఏపీకి తొలగిన ముప్పు
బంగాళాఖాతంలో వాయుగుండం కాస్తా తుఫాన్‌గా మారినా ఏపీకి వచ్చే ముప్పు ఏమీ లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుఫాన్ రోజు  తెలుగు రాష్ట్రాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, అలాగే మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  ఉత్తర కోస్తాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలతోపాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవచ్చని అంచాన వేసింది. రాయలసీమ జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది.

అనకాపల్లి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. అలాగే వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రుతపవనాలు తీరాన్ని తాకకముందే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తొలి తుఫాను ఇదే కావడం విశేషం.

రెమల్‌గా నామకరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పశ్చిమ్ బెంగాల్, బంగ్లాదేశ్ దిశగా ప్రయాణిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను‌కు ‘రెమల్‌’గా నామకరణం చేశారు.  బెంగాల్, బంగ్లా మధ్య రెమల్ తుఫాను ఆదివారం సాయంత్రం తీరం దాటుతుందని, దీని ప్రభావంతో ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త మోనికా శర్మ చెప్పారు. తుఫాన్ ప్రభావం మే 27 ఉదయం వరకు దాదాపు 24 గంటల పాటు ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు
తుఫాన్ కారణంగా 26, 27 తేదీల్లో, ఉత్తర ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, త్రిపుర, మిజోరం, దక్షిణ మణిపూర్‌లోని కొన్ని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. నైరుతి రుతు పవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో వేగంగా విస్తరిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. అండమాన్, నికోబార్, కొమరిన్ దీవుల వరకూ రుతు పవనాలు విస్తరించాయని, మే 31 లోపు కేరళ తీరానికి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

బెంగాల్ ఎన్నికలపై ప్రభావం
బెంగాల్‌ ఎన్నికలపై రెమల్ తుఫాన్ ప్రభావం చూపనుంది. ఆరో విడత కింద శనివారం పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే తుఫాన్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్నికలు జరగాల్సిన తమ్లుక్, కంఠి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినిపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్‌లలో పోలింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అరిజ్ అఫ్తాబ్ ఆయా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై  పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలింగ్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత కోస్తా జిల్లాలకు అదనపు సిబ్బందిని పంపాలని సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget