అన్వేషించండి

Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీ, తెలంగాణలో వర్షాలు

Cyclone Remal: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు రాకముందే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత పది రోజులుగా ఏపీ, తెలంగాణల్లో ఏదో ఒక చోట వానలు పడుతూనే ఉన్నాయి. గత మూడు నెలల నుంచి భానుడి భగ భగలతో అల్లాడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం ఇచ్చాయి. తాజాగా మరో సారి తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది క్రమంగా బలపడి మే 25 నాటికి తుఫానుగా మారుతుందని, ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మే 26 నాటికి తీవ్ర తుఫానుగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 

ఏపీకి తొలగిన ముప్పు
బంగాళాఖాతంలో వాయుగుండం కాస్తా తుఫాన్‌గా మారినా ఏపీకి వచ్చే ముప్పు ఏమీ లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుఫాన్ రోజు  తెలుగు రాష్ట్రాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, అలాగే మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  ఉత్తర కోస్తాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలతోపాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవచ్చని అంచాన వేసింది. రాయలసీమ జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది.

అనకాపల్లి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. అలాగే వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రుతపవనాలు తీరాన్ని తాకకముందే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తొలి తుఫాను ఇదే కావడం విశేషం.

రెమల్‌గా నామకరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పశ్చిమ్ బెంగాల్, బంగ్లాదేశ్ దిశగా ప్రయాణిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను‌కు ‘రెమల్‌’గా నామకరణం చేశారు.  బెంగాల్, బంగ్లా మధ్య రెమల్ తుఫాను ఆదివారం సాయంత్రం తీరం దాటుతుందని, దీని ప్రభావంతో ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త మోనికా శర్మ చెప్పారు. తుఫాన్ ప్రభావం మే 27 ఉదయం వరకు దాదాపు 24 గంటల పాటు ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు
తుఫాన్ కారణంగా 26, 27 తేదీల్లో, ఉత్తర ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, త్రిపుర, మిజోరం, దక్షిణ మణిపూర్‌లోని కొన్ని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. నైరుతి రుతు పవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో వేగంగా విస్తరిస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. అండమాన్, నికోబార్, కొమరిన్ దీవుల వరకూ రుతు పవనాలు విస్తరించాయని, మే 31 లోపు కేరళ తీరానికి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

బెంగాల్ ఎన్నికలపై ప్రభావం
బెంగాల్‌ ఎన్నికలపై రెమల్ తుఫాన్ ప్రభావం చూపనుంది. ఆరో విడత కింద శనివారం పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే తుఫాన్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్నికలు జరగాల్సిన తమ్లుక్, కంఠి, ఘటల్, ఝర్‌గ్రామ్, మేదినిపూర్, పురూలియా, బంకురా, బిష్ణుపూర్‌లలో పోలింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అరిజ్ అఫ్తాబ్ ఆయా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై  పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలింగ్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత కోస్తా జిల్లాలకు అదనపు సిబ్బందిని పంపాలని సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget