అన్వేషించండి

Indigo Crisis:ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు ఏంటి?

Indigo Crisis: గత 5 రోజుల్లో 1700కు పైగా విమానాలు రద్దు. కేంద్రం 7 చర్యలు తీసుకుంది. అసలు ఏం జరుగుతోంది?

Indigo Crisis: భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో, ప్రతి నెలా కోటి మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. అయితే, గత 10-12 రోజులుగా ఇది తన అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. డిసెంబర్ ప్రారంభంలో, ప్రతిరోజూ 400-600 విమానాలు ఒక్కసారిగా రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ , ఇండోర్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. ప్రజలు గంటల తరబడి క్యూలలో నిలబడ్డారు, టికెట్ ధరలు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరిగాయి. సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. ఇండిగోకు అసలు ఏమైంది? అని అందరి మదిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇండిగో విషయంలో ప్రభుత్వం తీసుకున్న 7 ప్రధాన చర్యలు తీసుకుంది

డిసెంబర్ 4, 2025న, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో MoCA, DGCA, AAI, ఇండిగో సీనియర్ మేనేజ్‌మెంట్ పాల్గొన్నారు. ప్రయాణీకుల సౌకర్యాలపై పూర్తి శ్రద్ధ వహించాలని, పరిస్థితిని వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.

ఇండిగో కార్యాచరణ సమస్యలను అర్థం చేసుకున్న DGCA, ఫిబ్రవరి 10, 2026 వరకు కొన్ని FDTL నిబంధనలలో సడలింపునిచ్చే ఒక మినహాయింపు కల్పించారు. DGCA ప్రతి 15 రోజులకు ఈ మినహాయింపును సమీక్షిస్తుంది. ఇండిగో నుంచి నిరంతరం పురోగతి నివేదికలను తీసుకుంటుంది, ముఖ్యంగా సిబ్బంది కొరత, నియామకాలపై దృష్టి సారిస్తుంది.

DGCA అన్ని పైలట్ సంఘాలను వింటర్ వెకేషన్, వివాహ సీజన్లలో అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇండిగోకు పూర్తి సహకారం అందించాలని కోరింది.

DGCA ఇండిగోకు మరింత ఉపశమనం కలిగిస్తూ, ప్రస్తుతం శిక్షణ లేదా ఇతర పనులలో ఉన్న పైలట్‌లను కూడా ఫ్లయింగ్ డ్యూటీకి పంపడానికి అనుమతించింది. ప్రస్తుతం 12 FOI లను (DGCA అధికారులు, వీరు ఇండిగో నుంచి డెప్యూటేషన్ మీద ఉన్నారు) కూడా ఒక వారానికి విమానాలు నడపడానికి అనుమతించారు.

ఇండిగో 12 లైసెన్స్ పొందిన FOI లను, సీనియారిటీ తక్కువగా ఉన్న వారిని, DGCA ఫ్లయింగ్ డ్యూటీ నుంచి మినహాయించింది. తద్వారా వారు DGCA తనిఖీలు, పరిశోధనలకు సహాయపడగలరు.

DGCA ఇండిగో కంట్రోల్ సెంటర్‌లో కూడా తన బృందాన్ని ఏర్పాటు చేసింది, ఇది విమానాలను నిజ సమయంలో పర్యవేక్షిస్తుంది, ముఖ్యంగా ఆలస్యం, రద్దు, ప్రయాణీకుల సౌకర్యాలపై దృష్టి సారిస్తుంది.

DGCA ఇండిగోలో ఇంత పెద్ద ఆపరేషనల్ లోపం ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి నలుగురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఎవరి బాధ్యత ఏమిటో, మరింత మెరుగుదల చర్యలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో కూడా నిర్ణయిస్తుంది.

ప్రభుత్వం కొత్త నిబంధనలతో గందరగోళం

కేంద్ర ప్రభుత్వం కొత్త పైలట్ డ్యూటీ నిబంధనలు (FDTL ఫేజ్-2) అమలులోకి వచ్చాయి. ఇండిగో దీని కోసం సిద్ధంగా లేదు. జనవరి 2024లో, పైలట్ యూనియన్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో పైలట్‌ల ఎక్కువ పని గంటలు, అలసట కారణంగా విమాన భద్రత సమస్యను లేవనెత్తారు. హైకోర్టు ఆదేశాల మేరకు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ నిబంధనలు రెండు భాగాలుగా అమలు చేయాలి.

జూలై 1, 2025న, పైలట్‌లకు విశ్రాంతినిచ్చేందుకు ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం, ఎయిర్‌లైన్ కంపెనీలు పైలట్‌లకు వారానికి 36 గంటలకు బదులుగా 48 గంటల విశ్రాంతి, అంటే రెండు రోజుల వీక్లీ రెస్ట్ ఇవ్వడం తప్పనిసరి. ఈ సమయంలో సెలవులను వీక్లీ రెస్ట్‌గా పరిగణించడాన్ని నిషేధించారు. పైలట్ ఎంత తక్కువ అలసిపోతే, విమానం అంత సురక్షితంగా ఉంటుందనేది దీని లక్ష్యం. కానీ ఈ నిబంధనలు పైలట్‌ల లభ్యతను 15-20% తగ్గించాయి.

FDTL రెండో దశలో, నవంబర్ 1 నుంచి, DGCA పైలట్‌లు, ఇతర సిబ్బందికి నిరంతర నైట్ షిఫ్ట్‌లపై కూడా నిషేధం విధించింది.

ముందు వారానికి 36 గంటల విశ్రాంతి లభించేది, ఇప్పుడు 48 గంటలు తప్పనిసరి. అంటే, ప్రతి పైలట్ వారానికి దాదాపు ఒక రోజు తక్కువగా విమానం నడపవచ్చు.

రాత్రి డ్యూటీని ఇంతకు ముందు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పరిగణించేవారు, ఇప్పుడు ఉదయం 6 గంటల వరకు. అంటే, మరో గంట పెరిగింది.

ఒక వారంలో పైలట్ కేవలం 2 నైట్ ల్యాండింగ్‌లు మాత్రమే చేయవచ్చు, ఇంతకు ముందు 6 వరకు అనుమతి ఉండేది.
రెండు రాత్రుల కంటే ఎక్కువ నైట్ డ్యూటీని నిరంతరం చేయకూడదు.

అత్యంత ప్రమాదకరమైన నిబంధన ఏమిటంటే, విమానం రాత్రి 12 గంటల తర్వాత కూడా 1 నిమిషం నడిస్తే, మొత్తం డ్యూటీని నైట్ డ్యూటీగా పరిగణిస్తారు. పైలట్ మరుసటి రోజు ఉదయం 1-2 విమానాలను నడపలేడు.

గత 4 రోజుల్లో 1700 విమానాలు రద్దు

DGCA సమావేశంలో, ఇండిగో పైలట్‌ల అసలు అవసరం గురించి తప్పుగా అంచనా వేసినట్లు అంగీకరించింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత సిబ్బంది లభ్యత తగ్గుతుందని అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. రోస్టర్ తయారు చేయడంలో ఆలస్యం, లోపం జరిగింది. ఫేజ్-2 కోసం సన్నాహాలు అసంపూర్తిగా ఉన్నాయి. కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత ఇండిగో పైలట్‌లు,  ఇతర సిబ్బంది కొరతను తీర్చలేకపోయింది. గత 4 రోజుల్లో ఇండిగో 1700 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది.

ఢిల్లీలో అత్యధికంగా 225 విమానాలు రద్దు అయ్యాయి. పూణేలో 32 విమానాలు రద్దు. హైదరాబాద్ విమానాశ్రయంలో 3 రోజుల్లో 197 విమానాలు రద్దు కాగా బెంగళూరులో 102 విమానాలు రద్దు అయ్యాయి.

కొత్త నిబంధనల వల్ల ఇండిగోపై ఎక్కువ ప్రభావం

ఇండిగో మొత్తం వ్యాపార నమూనా ఎక్కువ విమానాలు, తక్కువ ధర , వేగవంతమైన టర్న్‌అవుట్‌పై ఆధారపడి ఉంటుంది. దీనిలో 70% కంటే ఎక్కువ విమానాలు రాత్రి లేదా అర్ధరాత్రి వరకు నడుస్తాయి. చిన్న చిన్న మార్గాల్లో పదేపదే విమానాలు నడుపుతారు. కొత్త నిబంధనలు వచ్చినప్పుడు పైలట్‌లు ఒక్కసారిగా తగ్గిపోయారు.

అతి పెద్ద తప్పు ఏమిటంటే, ఇండిగో 18-20 నెలల సమయం లభించినప్పటికీ, కొత్త నిబంధనల ప్రకారం పైలట్‌లను పెంచలేదు. మిగిలిన ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్ వంటి ఎయిర్‌లైన్స్ ఇప్పటికే పైలట్‌లను నియమించుకున్నాయి. ఇండిగో ఈ మార్పును నిర్వహించలేకపోయింది.

ఫలితంగా, నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు ప్రతిరోజూ వందలాది విమానాలు రద్దు అయ్యాయి. వేల మంది ప్రయాణికులు 24 గంటల పాటు ఆకలితో, దాహంతో విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. విమాన టికెట్ ధరలు ఆకాశాన్ని తాకాయి. స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు 10-12% వరకు పడిపోయాయి.

ప్రభుత్వం మధ్య మార్గ పరిష్కారం  

ప్రయాణీకుల తీవ్ర ఇబ్బందులు , మొత్తం విమానయాన వ్యవస్థ కూలిపోతుందనే భయంతో DGCA వెనక్కి తగ్గింది. డిసెంబర్ 5, 2025న, తక్షణ ఉపశమనం కలిగిస్తూ, ఇప్పుడు విమానం రాత్రి 12 గంటల తర్వాత కొంచెం నడిస్తే, దానిని పూర్తి నైట్ డ్యూటీగా పరిగణించబోరని ప్రకటించింది. అంటే, పైలట్ మరుసటి రోజు ఉదయం విమానాన్ని సులభంగా నడపగలడు. వీక్లీ రెస్ట్‌కు బదులుగా సెలవు ఇవ్వకూడదనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలకు విమానాలు రద్దు అయితే పూర్తి రీఫండ్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే చిక్కుకుపోయిన వారికి హోటల్‌లో వసతి కల్పించాలని కోరారు.

DGCA ఇండిగోపై నిఘా 

ప్రతి 15 రోజులకు ఎంత మంది పైలట్‌లను పెంచారు . రోస్టర్‌ను ఎలా సరిదిద్దారు అనే దానిపై పూర్తి నివేదికను సమర్పించాలి.
ఫిబ్రవరి 10, 2026 నాటికి కొత్త నిబంధనలను 100% ఎలా పాటిస్తారో తెలియజేస్తూ 30 రోజుల్లో రోడ్‌మ్యాప్ సమర్పించాలి. భద్రతకు సంబంధించిన ఇతర నిబంధనలలో ఎటువంటి సడలింపు ఉండదు.

ఇకపై ఏమవుతుంది?

ఇండిగో క్షమాపణలు చెప్పింది. డిసెంబర్ 10-15 నాటికి చాలా విమానాలు సాధారణ స్థితికి వస్తాయని, జనవరి నాటికి అంతా పూర్తిగా సర్దుబాటు అవుతుందని తెలిపింది. కంపెనీ ఇప్పుడు వేగంగా పైలట్‌లను నియమించుకుంటోంది.రోస్టరింగ్ సిస్టమ్‌ను మారుస్తోంది. కానీ ఈ మొత్తం వ్యవహారం ఒక పెద్ద పాఠం నేర్పింది, అదేమిటంటే భారతదేశంలో విమానయానం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఒకే కంపెనీ 60% కంటే ఎక్కువ మార్కెట్‌ను కలిగి ఉంది. ఒకవేళ అది కుప్పకూలితే, మొత్తం విమానయాన వ్యవస్థ కుప్పకూలుతుంది. రాబోయే 5 సంవత్సరాలలో వేల మంది కొత్త పైలట్‌లు, వందలాది కొత్త విమానాలు అవసరమని ప్రభుత్వం, ఇతర ఎయిర్‌లైన్స్ కూడా అర్థం చేసుకున్నాయి, లేకపోతే ఇలాంటి సంక్షోభాలు మళ్లీ మళ్లీ వస్తాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh News: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Mana Shankara Varaprasad Garu Collection : మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Advertisement

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh News: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Mana Shankara Varaprasad Garu Collection : మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మెగా బ్లాక్ బస్టర్ 'మన శంకరవరప్రసాద్ గారు' - ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Kakinada Fire Accident: పండుగ సరుకుల కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా మారిన సార్లంకపల్లె.. కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం
పండుగ సరుకుల కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా మారిన సార్లంకపల్లె.. కాకినాడలో అగ్ని ప్రమాదం
Makar Sankranti Special : మకర సంక్రాంతి రోజు చేసుకోవాల్సిన మినపప్పు కిచిడి.. టేస్టీ రెసిపీ ఇదే
మకర సంక్రాంతి రోజు చేసుకోవాల్సిన మినపప్పు కిచిడి.. టేస్టీ రెసిపీ ఇదే
Bank Holidays: నేడు (జనవరి 13న) బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా క్లోజ్ చేస్తారా ? హాలిడే లిస్ట్
నేడు (జనవరి 13న) బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా క్లోజ్ చేస్తారా ? హాలిడే లిస్ట్
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Embed widget