అన్వేషించండి

KTR vs Revanth Reddy: అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు

Telangana News | కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే అమృత్ 2.0 స్కీమ్ టెండర్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగంతో పాటు అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు.

KTR lodge complaint against Revanth Reddy on AMRUT 2.0 scam | ఢిల్లీ / హైదరాబాద్: అమృత్ టెండర్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి రేవంత్ తన బావమరిది సుజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని తెలిపారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని సంస్థకు కేవలం తన బావమరిది కంపెనీ అన్న కారణంతో ఇంత పెద్ద ఎత్తున పనులను కట్టబెట్టారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి తన బావమరిది కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పజెప్పారని పేర్కొన్నారు.

అమృత్ 2.0 స్కీం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వివిధ పనులకు దాదాపు రూ. 8,888 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ స్కీం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఉంది.  కేటీఆర్ సోమవారం ఢిల్లీకి వెళ్లి ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు. అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో...ఆధారాలతో సహా కేంద్రమంత్రి ఖట్టర్ కు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు వివరించారు. మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని ఈ టెండర్లపై విచారణ జరిపించాలని  ఖట్టర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
 
2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులా?
అమృత్ టెండర్లలో భాగంగా రూ. 1,137 కోట్ల రూపాయల పనులు దక్కించుకున్న రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ శోధా ఇన్ ఫ్రాక్చర్ లిమిటెడ్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ. 2 కోట్ల 20 లక్షల లాభాన్ని మాత్రమే చూపించిందన్నారు. అలాంటి కంపెనీకి రూ. 1,137 కోట్ల రూపాయల పనులు ఎలా అప్పజెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటేనే తెర వెనుక భారీ అవినీతి బాగోతం జరిగిందని చెప్పారు. మొత్తం రూ. 1137 కోట్ల పనుల్లో ఇండియన్ హ్యూమ్ పైప్స్ కో. లిమిటెడ్ కంపెనీకి 20 శాతం పనులు, మిగతా 80 శాతం పనులను శోధా సంస్థ చేసేలా ఒప్పందం చేసుకున్నారని కేటీఆర్ అన్నారు.

మొత్తం ప్రాజెక్ట్ లో 80 శాతం పనులను సీఎం రేవంత్ బావమరిది కంపెనీ కావటంతోనే ఇండియన్ హ్యూమ్ పైప్స్ లిమిటెడ్ సంస్థ శోధా సంస్థకు అప్పగించిందని కేటీఆర్ చెప్పారు. అమృత్ టెండర్ల కు సంబంధించి పూర్తిగా మున్సిపాలిటీ శాఖకే అధికారం ఉన్నందున పురపాలక శాఖ మంత్రిగానూ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా ఈ టెండర్ల ను బావమరిదికి అప్పగించటం ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని కేటీఆర్ విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపించి, అక్రమాలు జరిగితే టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధన ఉల్లంఘన
రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని కేటీఆర్ అన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన ఎంతటి ప్రజా ప్రతినిధులపైనైనా వేటు వేయవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించి పలు కేసులను కూడా కేటీఆర్ ఉదాహరించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ గనుల కేటాయింపు, బిహారిలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు (1983), ది శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు (2005), ది జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2001), దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా (2003) కేసులను కేటీఆర్ ప్రస్తావించారు. 2014 లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిందో ల్యాండ్ కేటాయింపులు చేసిందో...పొరుగున ఉన్న కర్ణాటకలో ముడా స్కాం లో ఏ విధంగా అక్కడి సీఎం యడ్యూరప్ప తన భార్యకు భూములు కేటాయించారో అదే విధంగా రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో తన బావమరిదికి మేలు చేశారని కేటీఆర్ ఆరోపించారు.

Also Read: KTR vs Ponguleti: కేటీఆర్ ను మంత్రి పొంగులేటి ఎందుకు టార్గెట్ చేశారు? కారణాలు ఇవేనా!

ముఖ్యమంత్రే అవినీతికి పాల్పడితే...
సాధారణంగా రాష్ట్రంలో అధికారులు, మంత్రులు అవినీతికి పాల్పడితే ముఖ్యమంత్రికి నివేదిస్తారని.. కానీ కంచె చేను మేసిందన్నట్లుగా ఇక్కడ ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డియే అవినీతికి పాల్పడటం అనైతికమని కేటీఆర్ అన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను మాత్రమే కాకుండా టెండర్ కేటాయింపుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో సీఎం రేవంత్ ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన కుటుంబ సభ్యులకు మేలు చేస్తున్నారని కేంద్రమంత్రికి కేటీఆర్ వివరించారు.


 
పారదర్శకంగా విచారణ జరిపించండి.
అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. అమృత్ టెండర్లలో చట్టవిరుద్దంగా కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: Revanth Reddy: యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Telangana Roads: HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Chahal - Dhanashree Verma Divorce: చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు కన్ఫామ్- భరణం ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు కన్ఫామ్- భరణం ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Telangana Roads: HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Chahal - Dhanashree Verma Divorce: చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు కన్ఫామ్- భరణం ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు కన్ఫామ్- భరణం ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క, శాఖలవారీగా కేటాయింపుల పూర్తి వివరాలు
Karantaka Assembly: మగాళ్లు అల్లాడిపోతున్నారయ్యా… వారానికి రెండు బాటిళ్లు ఫ్రీ గా ఇవ్వండి- అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థన
మగాళ్లు అల్లాడిపోతున్నారయ్యా… వారానికి రెండు బాటిళ్లు ఫ్రీ గా ఇవ్వండి- అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థన
BSNL Recharge Plans: 6 నెలల వరకు చెల్లుబాటు, డైలీ డేటా, అపరిమిత కాలింగ్ - తక్కువ ధరలో BSNL రీఛార్జ్‌ ఆఫర్లు
6 నెలల వరకు చెల్లుబాటు, డైలీ డేటా, అపరిమిత కాలింగ్ - తక్కువ ధరలో BSNL రీఛార్జ్‌ ఆఫర్లు
Manchu Manoj - Mohan Babu Birthday: నాన్నా... నిన్ను మిస్ అవుతున్నాం - మోహన్ బాబు బర్త్‌ డేకి మనోజ్ మంచు ఎమోషనల్ పోస్ట్‌
నాన్నా... నిన్ను మిస్ అవుతున్నాం - మోహన్ బాబు బర్త్‌ డేకి మనోజ్ మంచు ఎమోషనల్ పోస్ట్‌
Embed widget