BRS Foundation Day: సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం, పట్టణంలో పార్టీ జెండాలను ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేస్తున్నట్లు వెల్లడించారు.

భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం మరియు జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేసి, ఆవిర్భావ వేడుకలను పండుగలా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ మేరకు శనివారం పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన దిశానిర్దేశం చేశారు.
ఏప్రిల్ 27న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన క్రమంలో పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు.
రేపే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27, 2001)
— BRS Party (@BRSparty) April 26, 2026
తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరిన చారిత్రాత్మక రోజు! ✊
అసాధ్యమని అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాధ్యం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ గారు ఎగురవేసిన గులాబీ జెండా, నేడు తెలంగాణ ప్రగతి,… pic.twitter.com/mgJVOp6IlG
సోమవారం మధ్యాహ్నం 1.30 కల్లా చేరుకోవాలి..
తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశానికి ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని, ఉదయాన్నే స్థానిక ప్రాంతాల్లో వేడుకలు ముగించుకుని, ఆహ్వానం ఉన్న ప్రతినిధులు మధ్యాహ్నం 1:30 గంటల కల్లా హైదరాబాద్ చేరుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పిల్లుట్ల రఘు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన పిల్లుట్ల రఘుకు కండువా కప్పి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఫ్లోరోసిస్ సమస్య లేకుండా చేసిన నేత కేసీఆర్
60 ఏండ్లు పాలించిన ఈ కాంగ్రెస్ సన్నాసులు నల్గొండకు కనీసం నీళ్లు ఇవ్వలేదన్నారు. కానీ కేసీఆర్ పదేళ్లలో నల్గొండలోని చివరి మడివరకు నీళ్లు పారించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా వేధించిన ఫ్లోరోసిస్ను మిషన్ భగీరథతో తరిమికొట్టిన నేత కేసీఆర్ దామరచర్లలో అతిపెద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను స్థాపించాం. దేశ ప్రజలు అబ్బురపడేలా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దారు కేసీఆర్.
కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా రైతుబంధు అందించారు. గురుకులాలతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారు. ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలతో వైద్య విద్యను అందించారు. కరెంటు కష్టాల రాష్ట్రాన్ని 24 గంటల విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణాన్ని పెంచారు. నాడు మా పాలనలో కేసీఆర్ చేసిన అప్పు… నేడు తెలంగాణకు పెట్టుబడిగా మారిందని’ కేటీఆర్ అన్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















