అన్వేషించండి

Telangana Elections: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు షాక్, తనిఖీల్లో పట్టుబడే నగదు, కానుకలపై ఈసీ కీలక ఆదేశాలు

Telangana Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల్లో పట్టుబడే నగదుపై అభ్యర్థులకు షాకిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Elections: ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ ఐదు రాష్ట్రాల ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. ఈ అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై తప్పనిసరిగా ఉంటుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిస్తున్నాయి. దీంతో ఎన్నికలు జరుగుతున్ను రాష్ట్రాల్లోని పార్టీలన్నీ అసెంబ్లీ పోరులో గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి.

పోటాపోటీగా జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నగదు కట్టడిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తనిఖీలలో పట్టుబడిన నగదు, కానుకలకు సంబంధించి ఈసీ కీలక ప్రకటన చేసింది. తనిఖీలలో పట్టుబడే నగదు, కానుకల విలువను అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు ఖరారు అయిన తర్వాత అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని, వారి ఖాతాకు జమ చేయాలని సూచనలు చేసింది. 

బుధవారం తెలంగాణ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల అధికారుల ప్రత్యేక బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న స్పెషల్ టీమ్.. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందం సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ బృందంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్రశర్మ ఉన్నారు.  మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌తో సమావేశం అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్దత గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు.

అలాగే బుధవారం రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌తో పాటు సీఎస్ శాంతికుమారితో సీఈసీ అధికారులు భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలతో పాటు శాంతిభద్రతలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం గురించి చర్చించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధికారులకు సీఈసీ స్పెషల్ టీమ్ పలు కీలక సూచనలు చేసింది. తనిఖీలను ముమ్మరం చేయాలని, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది.  తనిఖీలు, నిఘాను మరింత పెంచాల్సిన అవసరముందని సూచించారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులతో కూడా సీఈసీ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనిఖీల, నగదు స్వాధీనాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత నగదు పట్టుబడిందనే వివరాలను ఆరా తీశారు. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో.. నగదు పంపిణీ మరింత పెరిగే అవకాశముందని ఈసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈసీ అధికారులు మరింత నిఘాను పెంచాలని చూస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేయనున్నారని తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Asifabad Forest Officials Attack Case: సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష
సార్సాల అటవీ అధికారులపై దాడి కేసు.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్‌ సహా 8 మందికి జైలు శిక్ష

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget