అన్వేషించండి

KCR Vasalamarri : వాసాలమర్రి దళితుల అకౌంట్లలోకి రూ. 10 లక్షలు.. కేసీఆర్ సంచలన ప్రకటన..!

దత్తత గ్రామం వాసాల మర్రి దళితులకు కేసీఆర్ స్వీట్ షాక్ ఇచ్చారు. వారి అకౌంట్లలోకి దళిత బంధు కింద రూ. పది లక్షలు జమ చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలును ప్రారంభించేశారు. అధికారికంగా హూజూరాబాద్ నియోజవర్గంలో ఆగస్టు పదహారో తేదీన ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ.. ముందుగా తన దత్తత గ్రామం వాసాల మర్రి దళితులకు పథకం వర్తింప చేయాలని నిర్ణయించారు. వాసాల మర్రి గ్రామంలోని ఎస్సీకాలనీలో  పర్యటించిన ఆయన .. దళితులతో సమావేశం అయ్యారు.  దళిత బంధు పథకంపై మాట్లాడారు. వాసాల మర్రిలో 76 దళిత కుటుంబాలు...  పథకానికి అర్హత సాధించాయని ఆ కుటుంబాలన్నింటికీ.. రేపే అకౌంట్లలో డబ్బులు చేస్తామని ప్రకటించారు.  ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షల చొప్పున.. 76 కుటుంబానికి రూ. ఏడు కోట్ల అరవై లక్షలు అకౌంట్లలో జమ చేస్తారు. అయితే..   రూ. పది లక్షల్లో రూ. పదివేలు మినహాయించుకుని .. దానికి ఇంకో రూ. పదివేలు జోడించి.. .దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ నిధి పూర్తిగా దళితులకేనని స్పష్టం చేశారు. ఎవరికైనా ఆపద వస్తే దళిత రక్షణ నిధులు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు. 

దళిత బంధు నిధులు దుర్వినియోగం చేయవద్దని కేసీఆర్ దళితులకు సలహా ఇచ్చారు. అభివృద్ధి చెందడానికి దళిత బంధు రూపంలో గొప్ప అవకాశం వచ్చిందని కేసీఆర్ తెలిపారు. దీన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. దళిత బంధు ఇచ్చినా మిగిలిన అన్ని పథకాలు కొనసాగిస్తామని ఇళ్లు కూడా కట్టిస్తామని కేసీఆర్ ప్రకటించారు.  దళిత బంధు పథకాన్ని మొదట నియోజకవర్గానికి వంద మందికి మాత్రమే వర్తింప చేయాలనుకున్న సీఎం కేసీఆర్... ఆ తర్వాత.. అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఉపఎన్నిక జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఐదు వందల కుటుంబాలను ఎంపిక చేసి.. వారికి ఆగస్టు పదహారో తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించారు.. అప్పుడే పథకం అధికారికంగా ప్రారంభమవుతుంది. అయితే కేసీఆర్ ముందుగానే లాంఛనంగా వాసాలమర్రిలో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని తాను గత ఏడాదే ప్రారంభించాలని అనుకున్నానని కానీ.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని కేసీఆర్ చెప్పారు.  

దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ చాలా దూకుడుగా ఉన్నారు. పథకం ప్రకటించినప్పటి నుండి ఆయన ప్రతీ రోజూ..  ఏదో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. రూ. లక్ష కోట్లు అయినా సరే పథకం కోసం వెచ్చిస్తామని చెబుతున్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. ఈ పథకాన్ని ఉపఎన్నికల్లోపే అమలు చేయాలని వస్తున్న డిమాండ్లకు... వాసాల మర్రి నుంచే సమాధానం ఇస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget