అన్వేషించండి

KCR Vasalamarri : వాసాలమర్రి దళితుల అకౌంట్లలోకి రూ. 10 లక్షలు.. కేసీఆర్ సంచలన ప్రకటన..!

దత్తత గ్రామం వాసాల మర్రి దళితులకు కేసీఆర్ స్వీట్ షాక్ ఇచ్చారు. వారి అకౌంట్లలోకి దళిత బంధు కింద రూ. పది లక్షలు జమ చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలును ప్రారంభించేశారు. అధికారికంగా హూజూరాబాద్ నియోజవర్గంలో ఆగస్టు పదహారో తేదీన ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ.. ముందుగా తన దత్తత గ్రామం వాసాల మర్రి దళితులకు పథకం వర్తింప చేయాలని నిర్ణయించారు. వాసాల మర్రి గ్రామంలోని ఎస్సీకాలనీలో  పర్యటించిన ఆయన .. దళితులతో సమావేశం అయ్యారు.  దళిత బంధు పథకంపై మాట్లాడారు. వాసాల మర్రిలో 76 దళిత కుటుంబాలు...  పథకానికి అర్హత సాధించాయని ఆ కుటుంబాలన్నింటికీ.. రేపే అకౌంట్లలో డబ్బులు చేస్తామని ప్రకటించారు.  ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షల చొప్పున.. 76 కుటుంబానికి రూ. ఏడు కోట్ల అరవై లక్షలు అకౌంట్లలో జమ చేస్తారు. అయితే..   రూ. పది లక్షల్లో రూ. పదివేలు మినహాయించుకుని .. దానికి ఇంకో రూ. పదివేలు జోడించి.. .దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ నిధి పూర్తిగా దళితులకేనని స్పష్టం చేశారు. ఎవరికైనా ఆపద వస్తే దళిత రక్షణ నిధులు ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు. 

దళిత బంధు నిధులు దుర్వినియోగం చేయవద్దని కేసీఆర్ దళితులకు సలహా ఇచ్చారు. అభివృద్ధి చెందడానికి దళిత బంధు రూపంలో గొప్ప అవకాశం వచ్చిందని కేసీఆర్ తెలిపారు. దీన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. దళిత బంధు ఇచ్చినా మిగిలిన అన్ని పథకాలు కొనసాగిస్తామని ఇళ్లు కూడా కట్టిస్తామని కేసీఆర్ ప్రకటించారు.  దళిత బంధు పథకాన్ని మొదట నియోజకవర్గానికి వంద మందికి మాత్రమే వర్తింప చేయాలనుకున్న సీఎం కేసీఆర్... ఆ తర్వాత.. అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఉపఎన్నిక జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఐదు వందల కుటుంబాలను ఎంపిక చేసి.. వారికి ఆగస్టు పదహారో తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించారు.. అప్పుడే పథకం అధికారికంగా ప్రారంభమవుతుంది. అయితే కేసీఆర్ ముందుగానే లాంఛనంగా వాసాలమర్రిలో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని తాను గత ఏడాదే ప్రారంభించాలని అనుకున్నానని కానీ.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని కేసీఆర్ చెప్పారు.  

దళిత బంధు పథకం విషయంలో కేసీఆర్ చాలా దూకుడుగా ఉన్నారు. పథకం ప్రకటించినప్పటి నుండి ఆయన ప్రతీ రోజూ..  ఏదో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. రూ. లక్ష కోట్లు అయినా సరే పథకం కోసం వెచ్చిస్తామని చెబుతున్నారు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. ఈ పథకాన్ని ఉపఎన్నికల్లోపే అమలు చేయాలని వస్తున్న డిమాండ్లకు... వాసాల మర్రి నుంచే సమాధానం ఇస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget