అన్వేషించండి

Vemulawada: విద్యార్థికి 5 రోజులపాటు లెక్చరర్ కఠిన శిక్ష, చచ్చుబడ్డ యువతి కాళ్లు

విద్యార్థిని చేసిన చిన్న తప్పునకు లెక్చరర్ మందలించాల్సింది పోయి, కఠిన శిక్ష వేసింది. ఆ ఫలితమే ఆమె కాళ్లకు స్పర్శ తెలియకుండా పోయింది.

వేములవాడలోని ఓ ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్ వ్యవహరించిన తీరుతో విద్యార్థిని ఆస్పత్రి పాలు అయింది. ఆమె కాళ్లకు స్పర్శ లేకుండా పోవడంతో ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో ఈ విషయం కలెక్టర్ వరకూ వెళ్లింది. కన్నెర్ర చేసిన కలెక్టర్ వెంటనే మహిళా లెక్చరర్ ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్ పైనా తగిన చర్యలు తీసుకున్నారు.  

విద్యార్థిని చేసిన చిన్న తప్పునకు లెక్చరర్ మందలించాల్సింది పోయి, కఠిన శిక్ష వేసింది. ఆ ఫలితమే ఆమె కాళ్లకు స్పర్శ తెలియకుండా పోయింది. గత వారం వేములవాడలోని ఓ ప్రభుత్వ కాలేజీలో విద్యార్థిని ఒక రోజు లీవ్ పెట్టింది. వివిధ కారణాలతో 5 రోజుల పాటు కాలేజీకి రాలేదు. దీంతో ఆగ్రహించిన తరగతి లెక్చరర్ సదరు విద్యార్థినిని అయిదు రోజుల పాటు కాలేజీ టైం మొత్తం నిలబెట్టింది. ఫలితంగా ఆ విద్యార్థిని కాళ్లలో స్పర్శ కోల్పోయింది. వెంటనే కాలేజీ సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జరిగింది. 

రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా.. ఆదివారం వెలుగు చూసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలానికి చెందిన  ఓ విద్యార్థిని వేములవాడలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 18న అనారోగ్యంగా ఉందని ఒక రోజు సెలవు పెట్టి ఆమె ఇంటికి వెళ్లింది. తర్వాత ఆ విద్యార్థిని 23న తిరిగి కాలేజీకి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన ఆ విద్యార్థినిని లెక్చరర్ డి.మహేశ్వరి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరసగా అయిదు రోజులపాటు నిలబెట్టింది. 

దీంతో ఆమె కాళ్లలో స్పర్శ కోల్పోయి నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం తోటి విద్యార్థుల సాయంతో వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు వివిధ పరీక్షలు చేసి అనంతరం ఎమ్మారై స్కానింగ్‌ కోసం సిరిసిల్లలోని జిల్లా ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై కలెక్టర్‌ అనురాగ్‌ జయంతికి తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. అధ్యాపకురాలు మహేశ్వరిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్న మాతంగి కల్యాణిపై తగిన చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ప్రిన్సిపల్‌ కల్యాణి శనివారం ట్రాన్స్‌ఫర్ పై వెళ్లిపోయారు.

వేములవాడ కోర్టును సందర్శించిన హైకోర్టు జడ్జి
శనివారం వేములవాడ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి ఏనుగు సంతోష్ రెడ్డి సందర్శించారు. న్యాయవాదులతో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. లా కార్యదర్శిగా ఉన్న సమయంలో నేను 50 కోర్టులు మంజూరు చేశానని అన్నారు. ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకరించిందని అన్నారు. కోర్టు భవనం చిన్నదిగా ఉన్నందున భవనం పై అంతస్తు నిర్మాణానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశామని అన్నారు. తన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేయడంతో పరిపాలన మరింత విస్తరించిందని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hanuman Deeksha Incident in Mancherial |మిషనరీ స్కూల్ పై హిందూ సంఘాల ఆగ్రహం.. ఇలా చేయడం కరెక్టేనా..?MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనాSunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
My Dear Donga Trailer: ‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
‘మై డియర్ దొంగ’ ట్రైలర్ - మన హీరో ‘రాజా’ సినిమాలో వెంకటేష్ టైప్!
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Tesla in India: ఇండియాకి టెస్లా కార్‌లు వచ్చేస్తున్నాయ్, గట్టిగానే ప్లాన్ చేసిన మస్క్ మామ
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
AR Rahman - Subhash Ghai: నా మ్యూజిక్ కోసం కాదు, నాపేరు కోసం చెల్లిస్తున్నారు - రెహమాన్ మాటలకు ఆ దర్శకుడు షాక్
నా మ్యూజిక్ కోసం కాదు, నాపేరు కోసం చెల్లిస్తున్నారు - రెహమాన్ మాటలకు ఆ దర్శకుడు షాక్
Embed widget