అన్వేషించండి

Sircilla: టెక్స్‌టైల్ కోర్సుపై ఆసక్తి చూపని విద్యార్థులు - ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా ?

2022-23 సంవత్సరానికి మొదటి విడత కౌన్సిలింగ్ లో టెక్స్‌టైల్ కోర్సులో నలుగురు చేరారు. రెండో విడత కౌన్సిలింగ్ లో వీరంతా మరో కోర్సులోకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఈ కోర్సులో ఎవరూ లేరు.

వస్త్రాల ఉత్పత్తికి నిలువెత్తు నిదర్శనంగా ప్రసిద్ధిగాంచిన సిరిసిల్లలో ప్రభుత్వం ఇక్కడి జేఎన్టీయూ కళాశాలలో పోయిన సంవత్సరం కొత్తగా టెక్స్‌టైల్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ రంగంలో వస్తున్న మార్పులను విద్యార్థులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని వస్త్రాల తయారీతో పాటు, అందులో పరిశోధనలు చేయడమే లక్ష్యంగా దీన్ని ప్రవేశపెట్టింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ కోర్సును ప్రారంభించారు. 2021-22 విద్యా సంవత్సరంలో సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ సివిల్, టెక్స్‌టైల్ విభాగాల్లో తొలి ఏడాది 170 మంది విద్యార్థులు చేరారు. వీటిలో టెక్స్‌టైల్ కోర్సులు 8 మంది విద్యార్థులు చేరారు. ఈసెట్ నుంచి వచ్చిన వారితో కలిపి ద్వితీయ సంవత్సరంలో 22 మంది ఉన్నారు. 
టెక్స్‌టైల్ లో సీట్లు మాత్రం భర్తీ కాలేదు..
2022-23 సంవత్సరానికి మొదటి విడత కౌన్సిలింగ్ లో టెక్స్‌టైల్ కోర్సులో నలుగురు చేరారు. రెండో విడత కౌన్సిలింగ్ లో వీరంతా మరో కోర్సులోకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఈ కోర్సులో ఎవరూ లేరు. ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తి అయిన టెక్స్‌టైల్ లో సీట్లు మాత్రం భర్తీ కాలేదు. ఇక మిగిలిన ఈసెట్ కౌన్సిలింగ్ లోనైనా ఎవరైనా చేరుతారేమోనని కళాశాల వర్గాలు భావిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఇచ్చల్ కరంజ్ అనే ప్రాంతం సిరిసిల్లాల చేనేత మరమగ్గాలకు ప్రసిద్ధి చెందింది. 1982 వరకు అక్కడ చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడింది. నేతన్నలకు ఎలాంటి సాంకేతిక నైపుణ్యాలు లేకపోవడం సాంప్రదాయ మరమగ్గాలను నమ్ముకోవడం వల్ల నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఫలితంగా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతుండేవారు. దీనికి పరిష్కారంగా అక్కడి ప్రభుత్వం 1982లో అక్కడి పాలిటెక్నిక్ కాలేజ్ లో డిప్లమా కోర్సులో టెక్స్‌టైల్ ను చేర్చింది. వీటిని చదివిన విద్యార్థులు సాంకేతికతను అందుపుచ్చుకొని అక్కడి వస్త్ర పరిశ్రమలో మార్పు తేగలిగారు. ఫలితంగా దశాబ్దం తిరిగేసరికి సంక్షోభం నుంచి తీరుకొని లాభాల బాటలోకి వచ్చి దేశంలోని ఆదర్శంగా నిలిచింది. 
సెప్టెంబర్ లో జిల్లాకు చెందిన పలువురు వస్త్ర వ్యాపారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అధ్యయనం చేసి అక్కడ నేతన్నల విజయగాథలను తెలుసుకొని వచ్చాను. ఇచ్చల్ కరంజి స్ఫూర్తితో సిరిసిల్లలోనూ టెక్స్‌టైల్ కోర్సులకు ఆదరణ లభించేలా చేసే వస్త్ర పరిశ్రమ మెరుగవడంతో పాటు కార్మికుల జీవితాల్లోనూ గణనీయ మార్పులు వస్తాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చేయాల్సిన అవసరం ఎంతయిన ఉంది. విద్యార్థులు ఎవరూ టెక్స్‌టైల్ కోర్సు వైపు ఆసక్తి చూపకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులు ఎక్కువగా సీఎస్ఈ, ఐటీ వంటి కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోని ఎక్కువగా చేరుతున్నారు. 
ఉద్యోగ అవకాశాలపై అవగాహన లేకపోవడం
ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, వర్చువల్ టెక్నాలజీ వంటి కోర్సులు నేర్చుకుంటే తక్కువ సమయంలోనే అధిక జీతాలు పొంది స్థిరపడొచ్చనే అభిప్రాయంతో ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు వీటిలో చేరారు. ఇందులో సీటు దక్కని వారు సివిల్, మెకానికల్ ఈసీఈ వంటి సాంప్రదాయ కోర్సుల్లో చేరారు. ఈ కోర్సులు చదివిన వారికి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. దీంతో వీటి ప్రభావం టెక్స్‌టైల్ పై ఎక్కువగా ఉంటుంది. ఈ కోర్సు అభ్యసించిన ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అనే అవగాహన లేకపోవడం, ప్రభుత్వం సైతం సరిగా ప్రచారం చేయకపోవడంతో ప్రత్యేక శ్రద్ధతో ప్రవేశపెట్టిన ఈ ఏడాది నిరాశ ఎదురయిందని పలువురు విద్యా నిపుణులు భావిస్తున్నారు. 
అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలోని టెక్స్‌టైల్ డిప్లొమా కోర్సుది ఇదే పరిస్థితి. కౌన్సిలింగ్ పూర్తయిన నాటికి 8 మంది మాత్రమే చేరడం గమనార్హం. సిరిసిల్ల జేఎన్టీయూలో ఈ ఏడాది కోర్సుల్లో ప్రవేశాల వివరాలు ఇలా ఉన్నాయి. సీఎస్ఈ 66 మంది విద్యార్థులు, ఈసీఈ 66 మంది విద్యార్థులు, ఈఈఈ 32 మంది విద్యార్థులు, సివిల్ 20 మంది విద్యార్థులు, మెకానికల్ 2 విద్యార్థులు చేరగా టెక్స్‌టైల్ కోర్సులో మాత్రం ఒక్కరు కూడా ఇప్పటివరకు చేరలేదు.

టాప్ హెడ్ లైన్స్

KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
BRS Leader Harish Rao Arrest: తెలంగాణలో గురుకులాల టెండర్లపై రగడ! మంత్రులతో చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలు! పోలీసుల అడ్డగింత, అరెస్టు!
తెలంగాణలో గురుకులాల టెండర్లపై రగడ! మంత్రులతో చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలు! పోలీసుల అడ్డగింత, అరెస్టు!
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Embed widget