అన్వేషించండి

Rani Rudrama on KTR: "మంత్రి కేటీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ - పనిగట్టుకొని విష ప్రచారాలు"

Rani Rudrama on KTR: మంత్రి కేటీఆర్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని పని గట్టుకొని మరీ బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాడని రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఫైర్ అయ్యారు. 

Rani Rudrama on KTR: తెలంగాణలో సీఎం కేసీఆర్ రాజరిక పరిపాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. తామే దేవుళ్లం, తాము చేసిందే వేదం, శాసనం అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న గవర్నర్, రాష్ట్రపతులను అందులోనూ ముఖ్యంగా ఆ పదవిలో కొనసాగుతున్న మహిళలను గౌరవించలేని పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. బుధవారం కరీంనగర్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో మంత్రి కేటీఆర్ వివిధ పర్యటనల సందర్భంగా బీజేపీపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు. 

పదేపదే తప్పుడు ప్రచారాన్ని నిజం చేయాలని మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ అయ్యారని ఆమె దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీజేపీపై వ్యాఖ్యలు చేసే ముందు మంత్రి కేటీఆర్ అవగాహనతో మాట్లాడాలని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ బండి సంజయ్ వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారని, అందులో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే ఉందని తెలిపారు.

సిద్దిపేట-హుస్నాబాద్ -ఎల్కతుర్తి రెండు వరుసల రహదారి ఉందని ఆమె వివరించారు. విద్య, వైద్యం, గ్రామీణ రహదారులు, ఇతరత్రా అవసరాల కోసం.. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి కోసం  ఎంపీ బండి సంజయ్ ఎన్నో నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ఇలాంటి అభివృద్ధి పనులు మంత్రి కేటీఆర్ కు కనబడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ కు లేదన్నారు. ఈటల రాజేందర్ ఉద్యమ నేత, ప్రజల మెచ్చిన నేతని.. వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి తానేంటో నిరూపించుకున్నారని అన్నారు. 

ప్రధాని మోడీ ప్రభుత్వంపై విష, అసత్య ప్రచారం మంత్రి కేటీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా కేసీఆర్ ప్రభుత్వం మార్చిందని ఆమె మండి పడ్డారు. అప్పులు చేస్తున్నా జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని ఆరోపించారు. పథకాలు పక్కాగా అమలు కావడం లేదన్నారు. పన్నులు పెంచి, చార్జీలు పెంచి, భూములను అమ్మి, వేల కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర సర్కారు.. చివరికి అప్పులపైనే ఆధార పడుతుందని చెప్పుకొచ్చారు. ఏటేటా తీసుకుంటున్న అప్పును పెంచుకుంటూ పోతుందని ఆమె గుర్తు చేశారు. అలా సర్కారు తెచ్చిన రుణాలు బడ్జెట్‌కు రెండింతలు అయ్యాయనన్నారు. గ్యారంటీల పేరుతో తీసుకున్న అప్పుల్లో.. రాష్ట్రం దేశంలోనే టాప్‌లో ఉందన్నారు. అప్పు ఇంత చేస్తున్నా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, నిధుల్లోనూ కోతలు పెడుతూ, కేంద్ర నిధులను అడ్డగోలుగా వాడుకుంటూ.. సర్కారు ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రాబడి పెంచుకునేందుకు జనంపై టాక్స్‌‌లు, వ్యాట్‌‌లు వేస్తోందని, అనుకున్న దాని కంటే ఎక్కువే ఆదాయం ఆర్జిస్తోందనీ రాణి రుద్రమ చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల కేసీఆర్ సర్కార్ పాలనలో భూముల విలువలు 150 శాతం దాకా పెంచి రిజిస్ర్టేషన్ చార్జీలు అడ్డగోలుగా పెంచిందని.. ఆర్టీఏలో లైఫ్ టాక్స్, క్వార్టరీ టాక్స్, గ్రీన్ టాక్స్, సెస్​ల పేరుతో 30 నుంచి 40 శాతం దాకా బాధిందన్నారు. కరెంట్ బిల్లుల్లో ఏడీసీ చార్జీల పేరుతో వసూలు చేస్తోందన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్‌‌ వ్యాట్‌‌ను కేంద్రం తగ్గించుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడంతో ఆ రాబడి కూడా అధికంగానే వస్తోందని వివరించారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములు లాక్కుంటూ.. వాటితోనూ ప్రభుత్వం ఆదాయం పొందుతోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతుందని ఆమె మండిపడ్డారు. ఇలాంటి టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మంత్రి కేటీఆర్ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రభుత్వ అప్పుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

రాష్ట్రాల అభివృద్ధిల కోసమే కేంద్రం అప్పులు చేస్తుందనే విషయం మంత్రి కేటీఆర్ తెలుసుకొని మాట్లాడితే మంచిదన్నారు. 70 ఏళ్ల దేశ పాలనలో ఎప్పుడు లేని విధంగా మోడీ ప్రభుత్వం గ్రామ రహదారి మొదలుకొని దేశ బార్డర్ వరకు రహదారులను నిర్మిస్తుందని రాణి రుద్రమ అన్నారు. దేశ ప్రజల భద్రత, రక్షణ, అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతుందని.. దేశంలోని రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, జిల్లా ఆఫీస్ సెక్రటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, ఎడమ సత్యనారాయణ రెడ్డి, జెల్ల సుధాకర్, కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బల్బీర్ సింగ్, 58వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ రాపర్తి విజయ, మామిడి చైతన్య, ఆవుదుర్తి శ్రీనివాస్, పోరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాసం గణేష్, పురం హరి తదితరులు పాల్గొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Embed widget