అన్వేషించండి

PM Modi Warangal Visit: రేపు వరంగల్ కు రానున్న ప్రధాని మోదీ - సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపు

PM Modi Warangal Visit: ప్రధాని నరేంద్ర మోదీ రేపు వరంగల్ కు రాబోతున్నారని.. హన్మకొండలో నిర్వహించబోయే సభకు ప్రజలంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎంపీ బండి సంజయ్ సూచించారు.

PM Modi Warangal Visit: ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమావేశం ఏర్పాటు చేసి మరీ తెలిపారు. రూ.2146.86 కోట్లతో నిర్మించిన కరీంనగర్ - వరంగల్ 4 లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్నారని వెల్లడించారు. అలాగే అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కరీంనగర్ - వరంగల్ నాలుగు లైన్ల రోడ్డు విస్తరణతో ప్రజలు కష్టాలు తీర్చబోతుందని తెలిపారు. అభివృద్ధి కొరకు రోడ్ల విస్తరణకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈక్రమంలోనే హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించబతున్న భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని సూచించారు. సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి ఎన్‌విఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ, ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

అంతకుముందే ఎంపీ బండి సంజయ్ గజ్వేల్ బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు. కార్యకర్తలను కలిసి జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మాట్లాడుతూ... గజ్వేల్ గొడవల కేసులో కరీంనగర్ జైల్లో ఉన్న 11 మంది నిందితులను కలిశానని చెప్పారు. సీఎం నియోజకవర్గం గజ్వేల్ లో శివాజీ విగ్రహం వద్ద జరిగిన ఘటన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసున్నారు. ఈ ఘటనను తాను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే శివాజీ విగ్రహానికి అవమానం జరిగితే తాము చూస్తూ ఊరుకోమన్నారు. శివాజీ విగ్రహం వద్ద మూత్రం పోస్తే లిక్కర్ బాటిల్ ఇస్తామంటూ బెట్టింగ్ కట్టడం దారుణం అన్నారు. అది తప్పు కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా వ్యతిరేకించాల్సి అవసరం ఉందని చెప్పారు. ఇంత చేసిన వారిని అరెస్ట్ చేయకుండా వీడియో తీసిన వారిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కొందరు కార్యకర్తలపై సోడా బాటిల్స్, బీర్ బాటిల్స్ తో దాడి చేశారని మండిపడ్డారు. కౌన్సిలర్ వెళ్లి గొడవ ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

అయితే ఈ ఘటనలో ఫిర్యాదు చేసిన వారిపై, గొడవ ఆపేందుకు వెళ్లిన వారిపై కేసులు పెట్టడం ఏంటో పోలీసులకే తెలియాలంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీద్ నుంచి రెచ్చగొట్టి గొడవ చేసిన 30 మందిలో కేవలం ఆరుగురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ విగ్రహానికి అవమానం జరిగితే చూస్తూ ఊరుకునే స్థితిలో బీజేపీ లేదని వివరించారు. ఈ కేసులో అమాయక ప్రజలపై నాన్ బేయిలబుల్ పెట్టాలని సీఎంఓ నుంచి పోలీసులకు ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని బండి సంజయ్ కోరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget