అన్వేషించండి

Karimnagar News: ధరల్లో అనూహ్య మార్పులతో డైలమాలో పత్తి రైతులు - అమ్మాలా వద్దా అని సందిగ్ధత

Karimnagar News: ఉమ్మడి కరీంనగల్ జిల్లా పత్తి ధరల పెరుగుదల మార్పులతో రైతులు డైలమాలో ఉన్నారు. అమ్మాలా వద్దా అని ఆలోచనలు సాగిస్తూ ఆగమైతున్నరు.

Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి రైతులు, వ్యాపారులు డైలమాలో పడిపోయారు. గతంతో పోలిస్తే ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో అమ్మకం కొనుగోళ్ల విషయంలో తికమక పడుతున్నారు. తెల్ల బంగారం ధర ఇంకా పెరుగుతుందనే ఆశతో రైతులు పంటను అమ్మకుండా ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. దీంతో పత్తి లేక జిన్నింగ్ మిల్లులు వెలవెలబోతున్నాయి. గత ఏడాది జనవరిలో క్వింటాల్ పత్తి కి రూ.12,000, ఫిబ్రవరిలో రూ.14,000 వరకు బహిరంగ మార్కెట్లో ధర పలికింది. ఈసారి కూడా అదే విధంగా రేటు వస్తుందన్న ఆశతో పత్తి దిగుబడులను విక్రయించడం లేదు. డబ్బులు అవసరం ఉన్నవారు కూడా కొంతే అమ్ముతున్నారు తప్ప.. పూర్తి స్థాయిలో అమ్మడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో భారత పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ జిన్నింగ్ మిల్లులను నిర్ణయించినప్పటికీ ఓపెన్ మార్కెట్ లోనే ఎక్కువ ధర పలకడంతో (సీసీఐ)కొనుగోలు ప్రారంభం కాలేదు.

జిల్లాలోని వేములవాడ, కోనరావుపేట, బోయినపల్లి, ఇల్లంత కుంట మండలాల్లోని ఆరు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోళ్లకు సిద్ధం చేసింది. జిల్లాలో ఈ సీజన్ లో 69 వేల 200 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా.. మొత్తం 4.84 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మొదటి, రెండో దఫా ఏరిన పత్తి నాణ్యతగా ఉండడంతో బహిరంగ మార్కెట్ లో మంచి ధర రావడం రైతులకు కలిసొచ్చింది. గత సంవత్సరంతో పోల్చుకొని చూస్తే ఇంకా పెరుగుతుందని రైతులు పత్తిని అమ్మడానికి ముందుకు రావడం లేదు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్వింటాలుకు రూ.6,380 నిర్ణయించింది. ఓపెన్ మార్కెట్లో మాత్రం రూ.8000 నుంచి రూ.9000 వరకు ధర పలుకుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ లో రూ.5000 నుంచి ప్రారంభమైన ధర రోజు రోజుకు పెరుగుతూ.. నవంబర్ లో రూ.9000 వరకు పలికింది. ప్రస్తుతం రూ.8000 ఉంది. 

జిల్లాలో ఈ సీజన్ లో 4.84 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 11,000 క్వింటాళ్లు మాత్రమే జిన్నింగ్ మిల్లులు నిర్వహణకులు, ప్రైవేటు వ్యాపారాలు కొనుగోలు చేశారు. అధిక వర్షాలతో వాతావరణం అంతగా అనుకూలించక జిల్లాలో పత్తి పంట దిగుబడులు రైతు ఆశించిన మేర రావడం లేదు. పత్తిలో ఎదుగుదల లోపించింది. ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.20 వేలకు పైగా పెట్టుబడులు  పెట్టినప్పటికీ ఎకరానికి 7 క్వింటాళ్లు కూడా రాకపోవడం కర్షకులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే రైతులు రెండు రకాలుగా పత్తిని సేకరించారు. కొంతమంది దళారులు గ్రామాల్లో కొన్ని మహారాష్ట్ర, ఆదిలాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో జిల్లాలోని జిన్నింగ్ మిల్లులు ప్రైవేట్ వ్యాపారుల కొనుగోలు కేంద్రాలు పత్తి విక్రయాలతో కళకళలాడగా, ప్రస్తుతం బోసి పోతున్నాయి. ఆశించిన మేర పత్తి రాక జిన్నింగ్ మిల్లులో కూలీల భారం మీద పడుతోందని జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు ఆందోళన పడుతున్నారు. ఏది ఏమైనా స్పష్టత వస్తే గాని ఈ సమస్యకు పరిష్కారం లభించేలా లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Pawan Kalyan Latest News: మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?
మహాకుంభమేళాలో పవన్ దంపతుల పుణ్య స్నానం-గట్టి మెసేజ్ పంపించిన డీసీఎం- మీకు అర్థమవుతుందా?
Telangana Ration Card Latest News: రేషన్ కార్డు యజమాని మహిళే- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం 
రేషన్ కార్డు యజమాని మహిళే- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం 
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABP
NTR Neel Movie: ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.