అన్వేషించండి

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

(Source:  Poll of Polls)

Karimnagar News: ధరల్లో అనూహ్య మార్పులతో డైలమాలో పత్తి రైతులు - అమ్మాలా వద్దా అని సందిగ్ధత

Karimnagar News: ఉమ్మడి కరీంనగల్ జిల్లా పత్తి ధరల పెరుగుదల మార్పులతో రైతులు డైలమాలో ఉన్నారు. అమ్మాలా వద్దా అని ఆలోచనలు సాగిస్తూ ఆగమైతున్నరు.

Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి రైతులు, వ్యాపారులు డైలమాలో పడిపోయారు. గతంతో పోలిస్తే ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో అమ్మకం కొనుగోళ్ల విషయంలో తికమక పడుతున్నారు. తెల్ల బంగారం ధర ఇంకా పెరుగుతుందనే ఆశతో రైతులు పంటను అమ్మకుండా ఇళ్లల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. దీంతో పత్తి లేక జిన్నింగ్ మిల్లులు వెలవెలబోతున్నాయి. గత ఏడాది జనవరిలో క్వింటాల్ పత్తి కి రూ.12,000, ఫిబ్రవరిలో రూ.14,000 వరకు బహిరంగ మార్కెట్లో ధర పలికింది. ఈసారి కూడా అదే విధంగా రేటు వస్తుందన్న ఆశతో పత్తి దిగుబడులను విక్రయించడం లేదు. డబ్బులు అవసరం ఉన్నవారు కూడా కొంతే అమ్ముతున్నారు తప్ప.. పూర్తి స్థాయిలో అమ్మడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో భారత పత్తి సంస్థ (సీసీఐ) ద్వారా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ జిన్నింగ్ మిల్లులను నిర్ణయించినప్పటికీ ఓపెన్ మార్కెట్ లోనే ఎక్కువ ధర పలకడంతో (సీసీఐ)కొనుగోలు ప్రారంభం కాలేదు.

జిల్లాలోని వేములవాడ, కోనరావుపేట, బోయినపల్లి, ఇల్లంత కుంట మండలాల్లోని ఆరు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోళ్లకు సిద్ధం చేసింది. జిల్లాలో ఈ సీజన్ లో 69 వేల 200 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా.. మొత్తం 4.84 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మొదటి, రెండో దఫా ఏరిన పత్తి నాణ్యతగా ఉండడంతో బహిరంగ మార్కెట్ లో మంచి ధర రావడం రైతులకు కలిసొచ్చింది. గత సంవత్సరంతో పోల్చుకొని చూస్తే ఇంకా పెరుగుతుందని రైతులు పత్తిని అమ్మడానికి ముందుకు రావడం లేదు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్వింటాలుకు రూ.6,380 నిర్ణయించింది. ఓపెన్ మార్కెట్లో మాత్రం రూ.8000 నుంచి రూ.9000 వరకు ధర పలుకుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ లో రూ.5000 నుంచి ప్రారంభమైన ధర రోజు రోజుకు పెరుగుతూ.. నవంబర్ లో రూ.9000 వరకు పలికింది. ప్రస్తుతం రూ.8000 ఉంది. 

జిల్లాలో ఈ సీజన్ లో 4.84 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 11,000 క్వింటాళ్లు మాత్రమే జిన్నింగ్ మిల్లులు నిర్వహణకులు, ప్రైవేటు వ్యాపారాలు కొనుగోలు చేశారు. అధిక వర్షాలతో వాతావరణం అంతగా అనుకూలించక జిల్లాలో పత్తి పంట దిగుబడులు రైతు ఆశించిన మేర రావడం లేదు. పత్తిలో ఎదుగుదల లోపించింది. ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.20 వేలకు పైగా పెట్టుబడులు  పెట్టినప్పటికీ ఎకరానికి 7 క్వింటాళ్లు కూడా రాకపోవడం కర్షకులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికే రైతులు రెండు రకాలుగా పత్తిని సేకరించారు. కొంతమంది దళారులు గ్రామాల్లో కొన్ని మహారాష్ట్ర, ఆదిలాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో జిల్లాలోని జిన్నింగ్ మిల్లులు ప్రైవేట్ వ్యాపారుల కొనుగోలు కేంద్రాలు పత్తి విక్రయాలతో కళకళలాడగా, ప్రస్తుతం బోసి పోతున్నాయి. ఆశించిన మేర పత్తి రాక జిన్నింగ్ మిల్లులో కూలీల భారం మీద పడుతోందని జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు ఆందోళన పడుతున్నారు. ఏది ఏమైనా స్పష్టత వస్తే గాని ఈ సమస్యకు పరిష్కారం లభించేలా లేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు, 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు
3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు, 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు
Khanapur MLA Vedma Bojju: అటవీశాఖ చెక్ పోస్టుల ఫాస్టాగ్ కేంద్రాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
అటవీశాఖ చెక్ పోస్టుల ఫాస్టాగ్ కేంద్రాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
Delhi Blast CCTV Video: ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ విడుదల, ఒక్కసారిగా బ్లాస్ట్
Viral Video: ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ విడుదల, ఒక్కసారిగా బ్లాస్ట్
Shiva Re Release: 'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
Advertisement

వీడియోలు

Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు, 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు
3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు, 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు
Khanapur MLA Vedma Bojju: అటవీశాఖ చెక్ పోస్టుల ఫాస్టాగ్ కేంద్రాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
అటవీశాఖ చెక్ పోస్టుల ఫాస్టాగ్ కేంద్రాలపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
Delhi Blast CCTV Video: ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ విడుదల, ఒక్కసారిగా బ్లాస్ట్
Viral Video: ఢిల్లీ పేలుడుకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ విడుదల, ఒక్కసారిగా బ్లాస్ట్
Shiva Re Release: 'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
'శివ'లో చైల్డ్ ఆర్టిస్ట్... సైకిల్ టు అమెరికా... ఇప్పుడెలా ఉందో చూశారా?
Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన పోస్ట్
నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను.. కొండా సురేఖ సంచలన పోస్ట్
Vizag IT Campus: విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
విశాఖ కాపులుప్పాడలో మరో ఐటీ క్యాంపస్ ఏర్పాటు, 2 వేల మందికి ఉపాధి
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్‌! విజయం ఎవరి ధీమా వాళ్లదే!
Hyundai Tucson ఛాప్టర్‌ క్లోజ్‌ - మూడు సంవత్సరాలకే ముగిసిన స్టోరీ, కారణం ఇదే
Hyundai Tucson మూడేళ్ల ముచ్చటే - ఇండియన్స్‌కు గుడ్‌బై
Embed widget