అన్వేషించండి

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

Telangana News: తెలంగాణలో అన్నదాతలకు ఆర్థిక సాయం అందించే రైతు భరోసా అమలుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 26 నుంచి పథకం అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.

CM Revanth Reddy Announcement On Rythu Bharosa: కొత్త సంవత్సర వేళ తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. సచివాలయంలో శనివారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్ర రైతాంగానికి నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. రైతు భరోసా (Rythu Bharosa) కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ సాయం అందిస్తామని.. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకానికి 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' అని పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు.

వ్యవసాయ యోగ్యం కాని భూములు, మైనింగ్, రియల్ ఎస్టేట్ భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, రోడ్లు, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, నాలా భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారం సేకరించి, గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. వ్యవసాయ భూముల్లో ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో అప్ డేట్ చేయలేదని.. అందువల్లే గతంలో కొంతమందికి రైతుబంధు నిధులు వచ్చాయని అన్నారు. దయచేసి ఎవరికి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించాలని పేర్కొన్నారు.

అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం తెలిపారు. ఆర్థిక పరిస్థితి వెసులుబాటును బట్టి రైతు భరోసాను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామన్నారు. భూమి లేని వాళ్లకు సైతం ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. సాగు చేయకపోయినా సాగుకు అనుకూలంగా ఉండే భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు. 'రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ పథకాలు జనవరి 26న అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ ఆదాయం పెంచడం, ప్రజలకు పంచడమే మా ప్రభుత్వం విధానం.' అని సీఎం పేర్కొన్నారు.

కేబినెట్ మరిన్ని నిర్ణయాలు

దాదాపు 2 గంటలకు పైగా సాగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అజెండాలో ముఖ్యంగా 22 అంశాలున్నాయి. రైతు భరోసాకి ఆమోద ముద్ర వేయడం సహా ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం ఎప్పటి నుంచి ఇవ్వాలి.? అనే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. సింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయించారు.

అలాగే, జూరాల నుంచి కృష్ణా జలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కడ నీటి లభ్యత ఉంది..? ఎక్కడ నుంచి ఎంత నీటిని తీసుకునే వీలుంది..? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి..? ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. అటు, మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్- 2, ఫేజ్- 3కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 15 టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు  ఆమోదం తెలిపింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.

Also Read: Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Jaggannathota Prabhala Teertham : సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
సంక్రాంతి సంబరాలకు గోదావరి వెళ్తున్నారా? ఈ వేడుక చూడకుండా అసలు రావద్దు!
PM Modi New Office: త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
త్వరలోనే కొత్త ఆఫీస్‌లోకి ప్రధానమంత్రి మోదీ! ఇంటి చిరునామా కూడా మారుతుందా?
Embed widget