అన్వేషించండి

Karimnagar: వ్యాక్సినేషన్‌లో కరీంనగర్ అరుదైన రికార్డు.. తెలంగాణలోనే తొలి, దేశంలో రెండో జిల్లాగా గుర్తింపు

అత్యధిక వ్యాక్సినేషన్లు వేసిన జిల్లాగా కరీంనగర్ జిల్లా రికార్డు బద్దలు కొట్టడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా వైద్యాధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

వాక్సినేషన్ విషయంలో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు జిల్లాలో రెండో డోస్ వేయడం కూడా 100 శాతం పూర్తయింది. రెండు డోసులు పూర్తి చేసుకున్న జిల్లాగా తెలంగాణలో రికార్డు నమోదు చేసింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డును సొంతం చేసుకుంది. మొత్తం జిల్లాలో 7,92,922 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు మొదటి డోస్ లక్ష్యానికి మించి 104 శాతం మందికి వ్యాక్సిన్ చేశారు. ఇదే స్ఫూర్తితో రెండో సైతం రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. ఇప్పటివరకు 8,27,103  డోసులు పంపిణీ చేశారు. ఈ ఫీట్ పూర్తి చేసిన తొలి జిల్లాగా కరీంనగర్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా గమనిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బెంగళూరు అర్బన్ మొదటి స్థానంలో నిలిచింది.

మంత్రి హరీష్ రావు అభినందనలు..
అత్యధిక వ్యాక్సినేషన్లు వేసిన జిల్లాగా రికార్డు బద్దలు కొట్టడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో సైతం తిరిగి లక్ష్యం కోసం కృషి చేసిన సిబ్బందిని, అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సరైన కో ఆర్డినేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని.. తెలంగాణలోని మిగతా జిల్లాలు సైతం కరీంనగర్‌ని అనుసరించాలంటూ ప్రశంసించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు అనుసరించిన విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

నిజానికి  కరీంనగర్ జిల్లా ఇప్పటికే మొదటి డోస్ విషయంలో వంద శాతం లక్ష్యాన్ని ఎప్పుడో అధిగమించింది. కరోనా బారిన పడిన బాధిత జిల్లాల్లో కరీంనగర్ అప్పట్లో ముందుండేది. అయితే వరుస కట్టడి విధానాలతోపాటు ముందు ముందు వచ్చే వేవ్‌లను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయి ప్రణాలికను రూపొందించుకుంది. తెలంగాణలోని ఇతర జిల్లాలతో  పోలిస్తే మొదటి నుంచి కూడా వాక్సినేషన్ ప్రక్రియలో ఎంతో ముందంజలో ఉంది.

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే నిజామాబాద్, సూర్యాపేట, కొమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాలో 100 శాతం పూర్తయితే అన్ని జిల్లాల్లో కూడా నూటికి నూరు శాతం వాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసిన రికార్డు తెలంగాణ సొంతం చేసుకోనుంది. రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడి 2.77 కోట్ల మందికి వాక్సిన్ వేయాలని సాధారణంగా నిర్ణయించుకున్న టార్గెట్ కంటే ఎక్కువగానే 2.88 కోట్ల మందికి మొదటి డోస్ అంటే 104 శాతం వాక్సినేషన్  ప్రక్రియని ఇప్పటివరకు పూర్తిచేశారు.

Also Read: Nizamabad News: నిజామాాబాద్ జిల్లాలో పసుపు బోర్డుపై రాజుకున్న రాజకీయం.. కమలం, గులాబీ బాహాబాహీ

Also Read: పోర్న్ వీక్షకులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు... ఫేక్ పాప్ అప్ తో కంప్యూటర్ బ్లాక్... ఎలా అన్ బ్లాక్ చేయాలంటే...?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Viral News: జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
జనగామ జిల్లాలో సంచలనం.. మద్యం అమ్మిన వారి ఇళ్లకు కరెంట్ కట్! తీర్మానం ఉల్లంఘనపై చర్యలు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Breaking News:తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు! ఉత్తర్వులు జారీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget