అన్వేషించండి

Kaleshwaram Project: మోదీ తెలంగాణ టూర్‌ టైంలో షర్మిల సంచలనం!

Kaleshwaram Project: తెలంగాణ వైసీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లక్ష కోట్ల అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు భారత దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఆమె ఆరోపించారు. వెంటనే ఒక విచారణ కమిషన్‌ను వేయమని కోరారు. నిజానిజాలు దేశ ప్రజల ముందు ఉంచాలన్నారు. మోదీని కలిస్తే అవినీతి గురించి అడుగుతారని సీఎం కేసీఆర్‌కి భయం అంటూ ఎద్దేవా చేశారు. కేసీఅర్ తెలంగాణను సొంత ఎస్టేట్ అనుకుంటున్నారని ఆరోపించారు. 97,500 కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ సంస్థల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పు తెచ్చి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంగా వాచ్‌ డాగ్‌ల ఉండాలి కాదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. 


Kaleshwaram Project: మోదీ తెలంగాణ టూర్‌ టైంలో షర్మిల సంచలనం!

ఒక రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగింది అని మీకు, మీ మంత్రులకు, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కు, కేంద్ర జల శక్తి శాఖకి కూడా తెలుసన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారని మీరే చెబుతున్నప్పటికీ.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైఎస్ షర్మిల ప్రధాని మోదీని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన అతి పెద్ద కుంభకోణంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. విచారణకు వెంటనే ఆదేశాలు ఇవ్వమని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ ఒక అద్బుతం అన్నారని, మెగా అద్భుతం అని చెప్పి మెగా మోసం చేశారని పేర్కొన్నారు. 18 లక్షల ఎకరాల వరకు నీళ్లు ఇస్తామని చెప్పి 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారంటూ విమర్శించారు. 18 లక్షల ఎకరాలు ఎక్కడ, మీరు ఇచ్చిన 50 వేల ఎకరాలు ఎక్కడ అంటూ ధ్వజమెత్తారు. 

మూడేళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు ఇదొక్కటే..

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుతో వైఎస్సార్ 38 వేల కోట్లతో పూర్తి చేద్దాం అనుకున్నారని.. కానీ సీఎం కేసీఆర్ రీ డిజైన్ చేసి లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆమె చెప్పుకొచ్చారు. నా తలకాయ, నా చెమట అని ఎక్కడ లేని సొల్లు చెప్పారంటూ ఎద్దేవా చేశారు. గోదావరి నదిపై కాళేశ్వరం అనే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. కట్టిన 3 ఏళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు ప్రపంచంలో ఒక్కటే ఉంటుందని.. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే అని తెలిపారు. ఇది ప్రజల డబ్బు అని లక్షా 20 వేల కోట్లు అని చెప్పుకొచ్చారు. కేసీఅర్ సర్కార్ మీద దర్యాప్తు చేయాలని, ఒక దర్యాప్తు కమిషన్ కావాలని వైఎస్ షర్మిల అన్నారు. టెండరింగ్ దగ్గర నుంచి మొత్తం అక్రమాలు జరిగాయన్నారు. ఒక దర్యాప్తు కమిషన్ వేసి వెంటనే నిజాలు నిగ్గు తేల్చండని మోదీని డిమాండ్ చేశారు. 

కాంట్రాక్టర్లను పిలుచుకొని కమీషన్లు మాట్లుడుకొని..

దేశ ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తి పోసే అనుమతి ఉందని.. కానీ కానీ మూడేళ్లలో 50 టీఎంసీలు కూడా ఎత్తి పోయలేదని తెలిపారు. రెండు టీఎంసీలుగా ఉన్న ప్రాజెక్టుకు మూడో టీఎంసీ ఎందుకన్నారు. అక్కరకు రాని ప్రాజెక్టుకి మూడు టీఎంసీలు ఎత్తి పోయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఅర్ కి డబ్బు అవసరం కాబట్టి ఇప్పుడు 3 వ టీఎంసీ అంటూ ప్రతిపాదన పెట్టారన్నారు. మూడో టీఎంసీకి టెండరింగ్ ఎక్కడ జరిగిందని, గ్లోబల్ టెండరింగ్ ఎందుకు జరగలేదని ఆమె కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రగతి భవన్ లోనే టెండర్లు వేశారా అంటూ కామెంట్లు చేశారు. కాంట్రాక్టర్లను పిలిచి కమీషన్ లు మాట్లాడుకొని అనుమతి ఇచ్చారా అని అన్నారు. మీ నంబర్లు రాసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాట వాస్తవమన్నారు. 

రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమయ్యాయి అని సీఎం కేసీఆర్ ను అడగండంటూ గోదావరి ఖని ప్రజలకు తెలిపారు. సీఎం కేసీఆర్ కు ఏది చేతకాదు కానీ.. తప్పించుకు తిరగడం మాత్రం చేతనవుతుందంటూ విమర్శించారు. ప్రజల డబ్బుతో ఇప్పుడు బంది పోట్ల రాష్ట్ర సమితి పార్టీ పెట్టాడన్నారు. డొక్కు స్కూటర్ లో తిరిగే కేసీఅర్... విమానాలు కొనే స్థాయికి ఎలా చేరుకోగలిగాడన్నారు. మోడీ రాష్ట్రానికి వస్తె అవినీతిపై అడుగుతాడని కేసీఅర్ కి భయం అంటూ వ్యాఖ్యానించారు. కేసీఅర్ ఒక అహంకారి అని, ఒక నియంత అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ముందు జాగ్రత్తగా కేసీఆర్ సీబీఐను సైతం నిషేదించారంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Embed widget