అన్వేషించండి

సింగరేణిలో పేలిన తుపాకీ- పరుగులు పెడుతున్న పోలీసులు

పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గంగానగర్‌లో జరిగిన సింగరేణి కార్మికుని హత్య ఘటన కలకలం రేపింది. చాలా కాలం తర్వాత మళ్లీ కోల్ బెల్ట్‌లో గన్ కల్చర్ ఆనవాళ్లు సంచలనం కలిగిస్తున్నాయి.

రోజంతా శ్రమించి ఇంటిలో నిద్రపోతున్న బొగ్గుగని కార్మికుడిపైకి బుల్లెట్లు దూసుకొచ్చాయి. ఏం జరిగిందో తెలిసేలోపే అతడు నిద్రలోనే కన్నుమూశాడు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తి చేసిన నేరగాళ్లు వచ్చిన దారినే సునాయాసంగా తప్పించుకొన్నారు. చాన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న సింగరేణి కోల్‌ బెల్ట్‌ ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపింది. 

మళ్లీ గన్‌ కల్చర్‌ ఆందోళనలు

పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గంగానగర్‌లో జరిగిన సింగరేణి కార్మికుని హత్య ఘటన కలకలం రేపింది. చాలా కాలం తర్వాత మళ్లీ కోల్ బెల్ట్‌లో గన్ కల్చర్ ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. పథకం ప్రకారమే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రూపేష్ పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. 

నిద్రలో ఉండగానే హత్య

గంగానగర్‌కు చెందిన కొరికొప్పుల రాజేందర్ అనే సింగరేణి కార్మికుడిని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత తుపాకీతో కాల్చి చంపారు. రాజేందర్‌ నిద్ర మత్తులో ఉండగానే హత్య చేసినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా ఆర్కే న్యూటెక్ అనే బొగ్గుగనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేసే రాజేందర్ నిత్యం అక్కడినుంచి ఇంటికి రాకపోకలు సాగిస్తుండేవాడు. భార్య ఇద్దరు పిల్లలతో నివసించే అతడు... నిన్న మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన తర్వాత... నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపి పరారయ్యారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా కొంతమంది వ్యక్తులు రాత్రి రెండున్నర తర్వాత వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రూపేష్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, వన్ టౌన్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డీసీపీ మాట్లాడుతూ ఘటనకు గల కారణాలను పరిశీలిస్తున్నామన్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. 

మళ్లీ ఒకప్పటి పరిస్థితులు?

గతంలో సింగరేణి ప్రాంతంలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా ఉండేవి. పోలీసులు తీసుకున్న కఠిన చర్యల వల్ల క్రమంగా అదుపులోకి వచ్చాయి. ఎప్పటికప్పుడు స్థానిక రౌడీషీటర్లు... హిస్టరీ షీటర్‌లని స్టేషన్‌కు పిలిపించుకొని వారి ప్రస్తుత వృత్తి, జీవన విధానంపై ఎప్పటికప్పుడు ఆరా తీసేవారు. రామగుండంలో రైల్వే జంక్షన్ ఉన్నందున నేరస్తులు సులువుగా పారిపోవడం లేదా బయటినుంచి కిరాయి వ్యక్తులతో తమ చేతికి మట్టి అంటకుండా నేరాలు చేయించడం జరిగేది. అయితే... టెక్నాలజీని వినియోగించి పోలీసులు ఎప్పటికప్పుడు నేరస్థుల కదలికలపై నిఘా వేసి ఉంచినందున క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది. తుపాకీల వినియోగం లాంటి సీరియస్ నేరాలు దాదాపుగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కాల్పులు, హత్య ఘటన సింగరేణి వాసుల్లో భయాందోళనలు రేపుతోంది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read:జనసంద్రంగా మారిన మునుగోడు- కేసీఆర్‌ స్పీచ్‌తో ఫుల్‌ జోష్

Also Read: https://telugu.abplive.com/education/telangana-inter-supplementary-exam-results-2022-soon-check-details-here-47475

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
Ys Jagan: 'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pipeline Gas: గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - తిరుచానూరులో ఇంటింటికీ పైప్ లైన్ గ్యాస్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Bhogi 2025 : భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
భోగిపళ్లకి దిష్టికి ఏంటి సంబంధం ..భోగిపళ్లు అంటే ఏమేం ఉంటాయి!
Ys Jagan: 'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
Daaku Mahaaraj Review - డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
Karimnagar News: మంత్రుల సమక్షంలోనే వివాదం - కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం రసాభాస, పాడి కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కెళ్లిన పోలీసులు
మంత్రుల సమక్షంలోనే వివాదం - కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం రసాభాస, పాడి కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కెళ్లిన పోలీసులు
IPL-2025 UPdate: ఐపీఎల్ డేట్ వచ్చేసిందోచ్ - 2 నెలల పాటు ధనాధన్ ఆట, నిర్వహణ తేదీలు ప్రకటించిన బీసీసీఐ
ఐపీఎల్ డేట్ వచ్చేసిందోచ్ - 2 నెలల పాటు ధనాధన్ ఆట, నిర్వహణ తేదీలు ప్రకటించిన బీసీసీఐ
Atreyapuram Boat Racing: సంక్రాంతికి ఫుల్ జోష్ - కోనసీమలో కేరళ తరహా పడవ పోటీలు, ఆత్రేయపురానికి బోట్ రేసింగ్ శోభ
సంక్రాంతికి ఫుల్ జోష్ - కోనసీమలో కేరళ తరహా పడవ పోటీలు, ఆత్రేయపురానికి బోట్ రేసింగ్ శోభ
Embed widget