అన్వేషించండి

Telangana: ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనే లేదు ప్రచారం ప్రారంభించేసిన ఆశావహులు- తెలంగాణలో విచిత్ర రాజకీయం

Telangana: తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఉన్నవారి పదవీ కాలం ముగియనే లేదు అప్పుడే ప్రచారం ప్రారంభించేశారు ఆశావహులు.

Telangana MLC Elections : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్సీగా ఎంపికైన కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. ఆ స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు వీలుగా ఎన్నికలు నిర్వహించనుంది. ఎన్నికల కసరత్తును ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రారంభించింది. ఓటర్ల జాబితా కోసం ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. డిసెంబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు.

నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్  ఎమ్మెల్సీ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి 2025 మార్చి నెలలో ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తున్న నేపధ్యంలో ఇప్పటినుంచే తమ ప్రచారాలు ప్రారంభించారు. అయితే ఈసారి జరగబోయే పట్టభద్రుల ఎన్నికలు గతంలో కంటే అధిక పోటీ ఇచ్చేందుకు అన్ని రంగాల వారు సిద్ధమవుతున్నారు. ముందస్తు కసరత్తు ప్రారంభించారు. 

పట్టభద్రుల ఎన్నికల్లో పోటీపడేందుకు ఆసక్తి...!
ప్రముఖ వ్యాపారవేత్త ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, ప్రముఖ వైద్యుడు మాజీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి.ఎన్.రావు, కరీంనగర్ మాజీ మేయర్ సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, డాక్టర్ చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు కొలసాని సుగుణాకర్ రావు, ట్రస్మ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తికరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారాలను ప్రారంభించారు.

బీసీ వర్సెస్ ఓసి...
ప్రధాన పార్టీల విషయాలకు వస్తే బిఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ బీజేపీ నుంచి జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుగుణాకర్‌రావుకు ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పార్టీ నుంచి కూడా వారికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ప్రొఫెసర్ ప్రసన్న హరి కిషోర్‌కి లేక సొంత సామాజిక వర్గానికి చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? లేదా ఇంకా వేరే వాళ్లకు ఛాన్స్ ఇస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. అయితే జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఇద్దరు బిసి సామాజిక వర్గానికి చెందిన వారు మరో ఇద్దరు ఓసి సామాజిక వర్గానికి చెందినవారు పోటీల్లో నిలవడం ఆసక్తికరంగా మారింది.

పట్టభద్రుడు ఎన్నుకునేది ఎవరిని...?
గతంలో పట్టబదుల పక్షాన నాయకులు పోరాడిన న్యాయం జరగలేదని ఒక అసంతృప్తి పట్టభద్రుల్లో నెలకొంది. అయితే ఈసారి అలా కాకుండా పట్టభద్రుల పక్షాన ఉండి తమ సమస్యలపై పోరాడే వాళ్లను ఎన్నుకోవాలని పట్టభద్రులు ఆలోచిస్తున్నారు. కానీ ఈసారి జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎవరికి ఓటు వేయాలి అనే ఒక ప్రశ్న ఓటర్లలో చిన్న ఆందోళన తీసుకువచ్చింది.
ప్రముఖ అపరవేత్త ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఉత్కూరి నరేందర్ రెడ్డికి ఓటు వేయాల లేక మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి.ఎన్.రావుకు గెలిపిద్దామా లేక బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణను ఎన్నుకుందామా అనే అనే సందిగ్ధంలో ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రజల్లో వ్యతిరేకత...
ఆల్ఫోర్స్ విద్య సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి కొంతవరకు వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మాజీ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి.ఎన్.రావు తన సామాజిక సేవ భావంతో ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రొఫెసర్‌గా అనుభవం కలిగిన ప్రసన్న హరికృష్ణ విద్యార్థుల్లో మంచి పేరున్న వ్యక్తిగా తెలుస్తుంది. బిఅర్ఎస్ పార్టీ నాయకుడు సర్దార్ రవీందర్ సింగ్ న్యాయవాదిగా అనుభవంతోపాటు కరీంనగర్ మేయర్‌గా అనుభవం కలిగిన వారు.

ఆసక్తికరంగా పట్టభద్రుల ఎన్నికలు...
వైద్యరంగంలో రాణిస్తున్న డాక్టర్ బి.ఎన్.రావు, న్యాయవాదిగా అనుభవం కలిగిన సర్దార్ రవీందర్ సింగ్, విద్యారంగంలో అనుభవం కలిగిన ప్రొఫెసర్ ప్రసన్న హరి కిషోర్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుంది పట్టభద్రుడి అభిమానాన్ని ఎవరు గెలుచుకుంటారనేది మాత్రం ఆసక్తిగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget