అన్వేషించండి

Minister Gangula Kamalakar : ఎర్రగడ్డ ఆసుపత్రిని ఏపీకి షిఫ్ట్ చేస్తే సరిపోతుంది, సీఎం జగన్ కు నేనే లెటర్ రాద్దామనుకున్నా- మంత్రి గంగుల కమలాకర్

Minister Gangula Kamalakar : ఆంధ్రనేతల రాజకీయంపై మంత్రి గంగుల కమలాకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ కు తానే స్వయంగా లెటర్ రాద్దామనుకున్నానని చెప్పారు. ఆంధ్ర నేతలను తెలంగాణ పంపుతున్నారని చమత్కరించారు.

Minister Gangula Kamalakar :  "ఆంధ్ర నేతలు తెలంగాణ మీద పడ్డారు. ఒకరు నడుస్తున్నారు, ఒకరు డ్యాన్స్ చేస్తున్నారు. నేనే సీఎం జగన్ మోహన్ రెడ్డికి లెటర్ రాద్దామనుకుంటున్నారు. అయ్యా అందరినీ ఇటు ఎందుకు పంపిస్తున్నావు. ఎర్రగడ్డ ఆసుపత్రిని ఏపీకి తరలిస్తే సరిపోతుంది కదా. ఏపీ నేతలు వచ్చి ఏం తిటుతున్నారో, ఎందుకు తిడుతున్నారో, ఎవరిని తిటుతున్నారో అర్థం కావడంలేదు. తెలంగాణ బిడ్డలకు ప్రజాప్రతినిధులకు ఓపిక ఎక్కువ. వాళ్లను మనం అతిథులుగా చూస్తాం. రానీ తెలంగాణ పంటలను చూసుకుంటా పోతారు. రోడ్లు చూసుకుంటా పోతారు. పాదయాత్ర చేసివాళ్లను ఆహ్వానిస్తున్నాం. రోడ్డుకు ఇరువైపులా పంటలుంటాయి. మరో జలశయాలు ఉంటాయి. విద్యుత్ సౌకర్యాలు ఉన్నాయి. తెలంగాణ అంటే అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్. అందరూ రావాలి తెలంగాణ అభివృద్ధిని చూడాలి. రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో చూసుకుంటా పోతారు." - మంత్రి గంగుల కమలాకర్ 

ధాన్యం కొనుగోలు సెంటర్ల ప్రారంభం 

 కరీంనగర్ నియోజకవర్గంలోని నగునూర్, చామనపల్లి, చర్లబుత్కూర్, దుర్శేడ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం ప్రారంభించారు. 2014కు ముందు కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఇప్పుడు కోటిన్నర  మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గర్వకారణమన్నారు. పంట పండడానికి అవసరమైన నీళ్లు, పెట్టుబడి, కరెంటు, ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందించిందన్నారు. గతంలో మార్కెటింగ్ చేసుకోవడంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, కేంద్రం నూకలు తినాలని, మేం కొనమని ఖరాఖండిగా చెప్పినా... రైతు పండించిన ప్రతీ గింజను తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందన్నారు.  శ్రీలంక లాంటి దేశాలు ఎదుర్కొన్న ఆహార సంక్షోభం చూశామని, కనీసం దాన్ని పట్టించుకోకుండా ముందు చూపు లేకుండా రైతుల పంటలపై చిన్నచూపుతో వ్యవహరించిన తీరుతో కేవలం ఆరు నెలల్లోనే కేంద్రం వద్ద నిల్వలు కొరత ఏర్పాడ్డాయని దుయ్యబట్టారు. బాబాసాహెబ్ చెప్పిన ఆహార భద్రతను గాలికొదిలి పూర్తి వ్యాపారిలా వ్యవహరించే కేంద్రం ఉండడం దురదృష్టమన్నారు. సీఎం కేసీఆర్ కృషితో భూమి మేయలేని విధంగా పంటను పండించామని, కానీ దీన్ని అడ్డుకునేవిధంగా ర్యాకు మూమెంట్ ఇవ్వకా, గోడోన్లు కేటాయించక, ఎఫ్.సి.ఐ వంటి సంస్థలను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవడం దారుణమన్నారు.  

6713 కొనుగోలు కేంద్రాల ప్రతిపాదన 

రాష్ట్ర వ్యాప్తంగా 6713 కొనుగోలు కేంద్రాల ప్రతిపాదించామని, ఇప్పటివరకూ 1545 కేంద్రాలు ప్రారంభించి దాదాపు 50 వేల మెట్రిక్ టన్నుల్ని సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వీటికి సాధారణ రకం 2040, మేలు రకం 2060 మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తామన్నారు. నిధుల కొరత లేదని, గన్నీలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, మాయిశ్చర్ మిషన్లతో పాటు అన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు.  గతంలో కళ్లాలు ధ్యానం ఉండి ఎప్.ఏక్యూ వచ్చేదని ఇప్పుడు నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తుండడంతో అక్కడ ప్యాడీ క్లీనర్ల ద్వారా ఎఫ్.ఏ.క్యూ పాటించి ఒక్క గింజను సైతం తరుగు పెట్టే ప్రసక్తే లేదన్నారు. కానీ కొన్ని చోట్ల రైతులే స్వయంగా రెండు మూడు కిలోలు తరుగు పెట్టినా సరే ఎట్లుందో అట్ల తీసుకోవాలంటున్నారని తద్వారా మిల్లుల్లో తరుగుతీస్తున్నారని ఈసారి అలాంటి వాటికి అనుమతించేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 6313 మంది రైతుల దగ్గర నుండి సేకరించామని దీని విలువ దాదాపు 100 కోట్లుందన్నారు.  14 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం తోనే రైస్ మిల్లులున్నాయని, 2300 మిల్లుల్లో నిరంతరాయంగా మిల్లింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget