అన్వేషించండి

Marri Shashidar Reddy : డిసెంబర్ 15న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ, ముఖ్య అతిథిగా జేపీ నడ్డా- మర్రి శశిధర్ రెడ్డి

Marri Shashidar Reddy : ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత ముగింపు సభ కరీంనగర్ లో డిసెంబర్ 15న నిర్వహిస్తున్నట్లు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సభలో జేపీ నడ్డా పాల్గొంటారని వెల్లడించారు.

Marri Shashidar Reddy :కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం చేసే సమయం ఆసన్నమైందని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కుటుంబ పాలనలో బందీ అయిన  తెలంగాణ తల్లి విముక్తి కోసం బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్నారన్నారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర  ఈనెల 15వ తేదీన కరీంనగర్ కు చేరుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా  కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో 15వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని తెలిపారు. కరీంనగర్ లో జరగబోయే సభలో  సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని మర్రి శశిధర్ రెడ్డి కోరారు. ఈనెల 15న కరీంనగర్ లో జరిగే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా రావాలన్నారు. కరీంనగర్ టవర్ సర్కిల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ శ్రేణులతో కలిసి సభకు హాజరు కావాలని వ్యాపార వాణిజ్య వర్గాలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ తల్లికి విముక్తి 

మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ... నిరంకుశ, అవినీతి కుటుంబ పాలనపై బండి సంజయ్ కుమార్ సమరశంఖం పూరించారన్నారు. టీఆర్ఎస్ కుటుంబ కబంధ హస్తాల్లో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడుతున్నారన్నారు.  ప్రజాస్వామిక తెలంగాణ  సాధన కోసం  అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రతో  ప్రజల మధ్యకు పాదయాత్రతో వస్తున్నందున జిల్లా పరిధిలో ప్రజలు యాత్రకు బ్రహ్మరథం పట్టాలని పిలుపునిచ్చారు. అమలుకు నోచుకోలేని హామీలతో  తెలంగాణ ప్రజలు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. అందుకే బండి సంజయ్ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి, ప్రజలను జాగృతం చేయడానికి  ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్నారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా యాత్రలో భాగస్వామం అయ్యే విధంగా 15న జరిగే  కరీంనగర్ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే విధంగా  కృషి చేయాలన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యాయ రాజకీయ శక్తిగా అవతరించిందని, ప్రజలు బీజేపీ నాయకత్వాన్ని  బలంగా విశ్వసిస్తున్నారని స్పష్టం చేశారు. కరీంనగర్ లో జరగబోయే సభతో బీజేపీ సత్తా చూపించడానికి, విజయవంతం చేయడానికి శ్రేణులు అందరూ సమిష్టి కృషి చేయాలని మర్రి శశిధర్ రెడ్డి కోరారు. బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి ఆయన పర్యవేక్షిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget