అన్వేషించండి

Bandi Sanjay : కేసీఆర్ నీ మాటలన్నీ కోతలే, రైతులకు నయాపైసా పరిహారం అందలేదు - బండి సంజయ్

Bandi Sanjay : వారంలో ఇస్తానన్న పంట నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్రం విపత్తుల కింద తెలంగాణకు కేటాయించిన రూ. 3 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.

 Bandi Sanjay : "సీఎం కేసీఆర్.... ఒక్కసారైనా రైతుల వద్దకు రా. యాడ చూసినా పంట  నష్టపోయి రైతులు ఏడుస్తున్నారు. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయ్. గత నెలలో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదో సమాధానం చెప్పాలి" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమర్ డిమాండ్ చేశారు. 8 ఏళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నారా? అని ప్రశ్నించారు. నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలను తెరిచినట్లయితే సగం మంది రైతులకు నష్టం జరగకపోయేది కదా అని పేర్కొన్నారు. ఆయా కేంద్రాలు తెరవకపోవడంవల్లే కోతలను చాలా మంది రైతులు నిలిపివేశారని చెప్పారు. ప్రకృతి విపత్తుల కింద తెలంగాణకు కేంద్రం కేటాయించిన రూ. 3 వేల కోట్లు ఏమయ్యాయి? వేటికి ఖర్చు చేశారో ఆ వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.   కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని పకీర్ పేట, చామనపల్లి, వేదురుగట్ట గ్రామాల్లో బండి సంజయ్ పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

పంట పొ
 లాల పరిశీలన 

 వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను బండి సంజయ్ పరిశీలించారు. రైతులను కలిసి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే, అప్పు చేసి ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి పెడితే తీరా పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన వచ్చి మా బతుకులను నాశనం చేసిందని భోరున విలపిస్తు్న్నారన్నారు. అన్నం పెట్టే చేతులు అడుక్కునే దుస్థితికి చేరుకున్నామని వాపోయారు. "పోయినసారి పంట నష్టపోయాం... ఈసారైనా పంట వస్తే అప్పులు తీర్చాలనుకున్నాం... ఈసారి కూడా దేవుడు మా పంటను పొట్టన పెట్టుకున్నాడు.. చావే శరణ్యం’’ అంటూ పలువురు రైతులు బండి సంజయ్ ను పట్టుకుని ఏడ్చారు. వాళ్ల కన్నీళ్లను తుడిచిన బండి సంజయ్ పరిహారం అందేవరకు ప్రభుత్వంపై పోరాడతానని భరోసా ఇచ్చారు.  

Bandi Sanjay : కేసీఆర్ నీ మాటలన్నీ కోతలే, రైతులకు నయాపైసా పరిహారం అందలేదు - బండి సంజయ్

నయా పైసా రైతులకు సాయం అందలేదు 

కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వానతో రైతులు పూర్తిగా పంట నష్టపోయారని బండి సంజయ్ తెలిపారు. పంట పొలాలకు పోయి రైతును కదిలిస్తే దు:ఖ మొస్తోందన్నారు. ఏ రైతును చూసినా కన్నీళ్లే వస్తున్నాయన్నారు. పోయినసారి పంట నష్టపోయారు. ఈసారైనా పంట చేతికొస్తే ఆ నష్టాన్ని పూడ్చుకుని అప్పు తీర్చాలని రైతులు తపన పడ్డారు. తీరా చూస్తే మళ్లీ వడగండ్ల వానతో పంట పూర్తిగా నష్టపోయారని ఆవేదన చెందారు.  ప్రభుత్వం నిర్ణీత సమాయానికి కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లయితే ఇంత భారీ నష్టం జరిగేది కాదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంవల్ల రైతులు కోతలు పూర్తి చేయలేకపోయారన్నారు. గత నెలలోనే సీఎం కేసీఆర్ ఇదే జిల్లాలోని రామడుగు వచ్చి... నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తానన్నారు. ఈ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే గత నెలలో 23 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నివేదిక ఇఛ్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 288 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు నయాపైసా రైతులకు సాయం అందలేదని ఆరోపించారు. తీరా చూస్తే 8 వేల ఎకరాలకే పంట నష్టం ఇవ్వాలని నివేదిక రెడీ చేశారట.. అయినా ఏ ఒక్కరి ఖాతాలో పైసా కూడా పడలేదన్నారు. 

కొడుకు, బిడ్డ దందాలకిచ్చే చెక్కులు చెల్లుతాయ్ 

 "కేసీఆర్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలాల్లేవు. ఇయాళ రైతులు బిచ్చమెత్తుకోవాల్నా? నీ మూర్ఖత్వ పాలనలో 4 ఏళ్లలో 70 వేల మంది రైతులు చనిపోయారు.  288 కోట్ల రూపాయల సాయం చేస్తానని చెప్పిన నిధులన్నీ కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింది కేటాయించినవే కదా. ఆ డబ్బులు రైతులకు ఇవ్వడానికి నీకున్న అభ్యంతరమేంది? మళ్లీ ఈసారి కూడా రైతులు వడగండ్ల వానకు నష్టపోయారు. ఈసారి 24 వేల ఎకరాల పంట నష్టం జరిగింది ఈ జిల్లాలోనే ఇట్లయితే రైతులు కోలుకునేదెలా? అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వనట్లుంది నీ పాలన. 8 ఏళ్లలో నష్టపోయిన ఒక్క రైతు కుటుంబాన్ని అయినా ఆదుకున్నవా? ఈడ కోతలు కోస్తివి... పారిపోతివి. పంజాబ్ పోయి రైతులకు చెక్కులిస్తివి..అవి కూడా చెల్లకపాయే. నీ కొడుకు, బిడ్డ దందాలకిచ్చే చెక్కులు చెల్లుతాయి. మీరు దోచుకున్న సొమ్ములో ఒక్క శాతం ఇస్తే రైతులకు పూర్తి సాయం అందుతుంది- బండి సంజయ్ 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget